తనువు చాలించిన
పార్థివ దేహానికి చితి పేరుస్తారు.
చితి పెట్టేది కుటుంబ సభ్యులే
అయినప్పటికీ, చితి అంటించాక
కాసేపటికే స్నానం చేస్తారు...
ఎందుకంటే, చనిపోయిన
జీవాత్మ తమ వెంట రాకూడదని
వారి నమ్మకం..
అంతవరకు ఆ వ్యక్తి వాడిన
బట్టలు,
దుప్పట్లు,
వస్తువులు,
ఇలా తనకు సంబంధించిన
ప్రతి వస్తువును తీసి పారేస్తారు.
కానీ, వారు సంపాదించిన..
డబ్బును,
ఆభరణాలను,
మాత్రం అస్సలు పారేయరు..
దీనికి కారణం మనిషిలోని స్వార్థం.
మనుషులు వ్యక్తి కంటే..
ఆ వ్యక్తి సంపాదించిన
ధనానికి,
ఆస్తులకే, ఎక్కువ విలువ ఇస్తారు.
ఇది మనిషి ఒప్పుకున్నా,
ఒప్పుకోకపోయినా నగ్న సత్యం..||
#sad reality 💔 #🗣️జీవిత సత్యం