భారత్ - ఇరాన్: ఒకే వృక్షపు రెండు కొమ్మలు..
స్థానిక సాంప్రదాయాలకు అనుగుణంగా విడిపోయిన దేవుళ్లు!
వేల ఏళ్ల క్రితం.. సింధు నదీ తీరంలో విరాజిల్లిన ఒకే జాతి,ఒకే నది రెండు ప్రవాహాలుగా ఎలా మారింది? దేవతలు రాక్షసులుగా, రాక్షసులు దేవతలుగా ఎలా రూపాంతరం చెందారు? ఇది కేవలం చరిత్ర కాదు, ఒక ఉత్కంఠభరితమైన సనాతన గాథ! మన చరిత్ర..
చాలామంది భ్రమపడుతున్నట్లు ఆర్యులు ఎక్కడో బయటి దేశాల నుండి వచ్చిన వారు కాదు. ఆర్యులు ఈ భారత భూమి పుత్రులే! సప్తసింధు తీరంలో విరాజిల్లిన 'ఆర్యవర్తమే' వారి మాతృభూమి. సుమారు 10,000 నుండి 15,000 ఏళ్ల క్రితమే సింధు నది ఒడ్డున ఒక అద్భుతమైన నాగరికత పురుడు పోసుకుంది. కాలక్రమేణా, ఆర్య కుటుంబంలోని ఒక శాఖ పశ్చిమ దిశగా పయనించి నేటి ఇరాన్ ప్రాంతంలో స్థిరపడింది. అందుకే భారతీయులు తమ దేశాన్ని 'ఆర్యవర్త' అని పిలిస్తే, ఇరానీయులు తమ దేశాన్ని 'ఐర్యనేమ్' (Land of Aryans) అని పిలుచుకున్నారు.
ఒకప్పుడు ఒకే కుటుంబంగా ఉన్న ఆర్యుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ఇదే ప్రపంచ చరిత్రలో అతిపెద్ద మలుపు!
భారతదేశంలో ఇంద్రుడు అగ్రశ్రేణి వీరుడిగా, 'దేవత'గా పూజలందుకున్నాడు.
ఇరాన్లో అదే ఇంద్రుడు 'అంద్రా' (Andra) అనే పేరుతో ప్రతికూల శక్తిగా (Daeva) పరిగణించబడ్డాడు.
అద్భుతమైన విషయం ఏమిటంటే, ఋగ్వేదంలో తొలినాళ్లలో 'వరుణుడిని' అసుర (శక్తివంతుడు) అని సంబోధించారు. కానీ కాలక్రమేణా భారత్లో 'దేవ' పదానికి పవిత్రత పెరిగింది, 'అసుర' అంటే రాక్షసుడు అనే అర్థం వచ్చింది. ఇరాన్లో దీనికి సరిగ్గా వ్యతిరేకంగా జరిగింది! అక్కడ 'అహుర' (అసుర) అంటే భగవంతుడు, 'దైవ' (దేవ) అంటే దుష్టశక్తి. ఒకరి దేవుడు మరొకరికి రాక్షసుడు అయ్యాడు.. ఎంతటి విచిత్రమైన చారిత్రక వైరుధ్యం!
పురాతన పర్షియన్ గ్రంథమైన 'జెండ్-అవెస్తా', భారతీయ 'ఋగ్వేదం' ఎంత పోలి ఉంటాయంటే.. ఆ కాలంలో ఒక భారతీయుడు, ఒక ఇరానియన్ మాట్లాడుకుంటే ఒకరి భాష ఒకరికి సులభంగా అర్థమైపోయేది!
భారతదేశం: 'సప్త సింధు'
ఇరాన్: 'హప్త హిందు'
భారతదేశం: 'యజ్ఞం'
ఇరాన్: 'యస్న'
రెండు సంస్కృతులు కూడా అగ్నిని, సూర్యుడిని దైవ స్వరూపాలుగా ఆరాధిస్తాయి. మనం జరుపుకునే నవవర్షం (ఉగాది/సంక్రాంతి సమయం), ఇరానీయుల 'నవ్రోజ్' (కొత్త సంవత్సరం) రెండూ వసంత కాలంలోనే రావడం మన ఉమ్మడి మూలాలకు నిదర్శనం.
మొన్నే భారత్ విదేశాంగ శాఖా మంత్రి శ్రీ జయశంకర్ వాళ్ళకు ' నవ్రోజ్..రంజాన్ ' రెంటికీ కలిపి శుభాకాంక్షలు తెలియచేసారు..
ఇరానీయులు అరబ్బులు కాదు. 7వ శతాబ్దంలో ఇస్లాం రాకముందు వరకు ఇరాన్ పూర్తిగా జొరాస్ట్రియన్ (పర్షియన్) సంస్కృతితో కళకళలాడింది. వారి DNA మరియు సంస్కృతి నేటికీ భారతీయ ఆర్య మూలాలతోనే ముడిపడి ఉంది. అందుకే ఇస్లామిక్ దాడుల సమయంలో తమ మతాన్ని కాపాడుకోవడానికి పర్షియన్లు (పార్సీలు) తమ 'మాతృభూమి' అయిన భారత్కే తిరిగి వచ్చారు. ఇక్కడ పాలలో చక్కెరలా కలిసిపోయారు.
ఇరాన్ ప్రజలు తమ వేర్లను వెతుక్కుంటూ వెళ్తే, అవి ఖచ్చితంగా సింధు నదీ తీరంలోనే ఆగుతాయి. ఇది 'ఘర్ వాపసీ' లాంటిది. ఇరానీయులు తమ పురాతన ఆర్య మూలాలను గుర్తించి, గౌరవించడం వారి పూర్వీకులకు ఇచ్చే నిజమైన నివాళి..
ఇరాన్ ప్రజలే తమ మూలాలను వెతుక్కుంటూ భారత్ కు వచ్చారు..
ఇప్పుడు కూడా వాళ్ళు ఇస్లాం మాది కాదు మా ధర్మం ' జొరాష్ట్రియన్ ' అంటూ అక్కడ ర్యాలీలు తీస్తున్నారు..ఘర్ వాపసీ అవుతున్నారు..
ఇక్కడున్న ముస్లింస్ మటుకు తమను తాము భారత్ ను దోపిడీ చేసిన అరబ్ సంతతిని..టర్కీ సంతతిని ఆరాదిస్తున్నారు..తమను తాము అరబ్స్ గా తురకలుగా భావించుకుంటూ తమను తాము మోసగించుకుంటున్నారు..
భారత్ మాతాకీ జై..
#😴శుభరాత్రి #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #⛳భారతీయ సంస్కృతి #🌍మన దేశచరిత్ర #🙏సనాతన హైందవ ధర్మం🕉️