Mahbubnagar Police
509 views
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ సందర్భంగా భద్రత ఏర్పాట్లను పరిశీలించిన మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు నామినేషన్ ఉపసంహరణ మరియు బీ–ఫారం సమర్పణ ప్రక్రియ కొనసాగుతున్న దృష్ట్యా, మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి, భద్రతా విధుల నిర్వహణపై పోలీసు అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, నామినేషన్ ఉపసంహరణ మరియు బీ–ఫారం సమర్పణ ప్రక్రియ పూర్తిగా ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు జిల్లా పోలీస్ శాఖ అన్ని రకాల ముందస్తు భద్రతా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్థులు, వారి అనుచరులు మరియు ప్రజలు ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటిస్తూ పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. నామినేషన్ ఉపసంహరణ మరియు బీ–ఫారం సమర్పణకు చివరి రోజు కావడంతో, ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ గారు తెలిపారు. ఈ సందర్శనలో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య మరియు ఇతర సిబ్బంది ఉన్నారు. #MahabubnagarPolice #MunicipalElections #📰 వార్తలు