Ramesh Devanapalli
521 views
3 hours ago
#💪పాజిటీవ్ స్టోరీస్ *ప్రైవేట్ మెడికల్ కాలేజీ లలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న తీరును ఖండిస్తూ సమావేశం అయిన మెడికో మెడికో పేరెంట్స్ అసోసియేషన్* 👉FRC కలువనున్న అసోసియేషన్ సభ్యులు 👉ఏప్రిల్ 15 వేలాది మంది పేరెంట్స్ తో కాళోజీ యూనివర్సిటీ ముట్టడి అధిక ఫీజుల మోత పై రాష్ట్రస్థాయి మెడికో పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు ఎల్బీనగర్ లో సమావేశం అయ్యారు ఈ సమావేశంలో ప్రైవేటు మెడికల్ కాలేజీలు బి అండ్ సి కేటగిరి కి సంబంధించి నాలుగున్నర సంవత్సరాల వరకు మాత్రమే ఫీజు వసూలు చేయాల్సి ఉండగా ఐదు సంవత్సరాలకు ఫీజును తల్లిదండ్రుల నుండి వసూలు చేస్తున్నారు దీనిపై మెడికల్ పేరెంట్స్ లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఇలా అధిక ఫీజు వసూలు చేయడం వల్ల సుమారు సంవత్సరానికి ఒక్కో విద్యార్థి రూ.6లక్షలు సీ కేటగిరీకి 13 లక్షల రూపాయలు అధికంగా చెల్లించాల్సి వస్తుంది. ఇది మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీల తల్లిదండ్రులపై సంవత్సరానికి 209 కోట్ల రూపాయలు అధిక భారం పడుతుంది. అయితే అపోలో మల్లారెడ్డి వంటి కొన్ని కాలేజీలు మాత్రం ఇందుకు మినహాయింపు ఇస్తున్నారు. ఈరోజు ఈ విషయమై సమావేశంలో చర్చించారు ఈనెల 15వ తారీఖున వరంగల్ లో కాళోజి నారాయణరావు యూనివర్సిటీ దగ్గర భారీ స్థాయిలో పేరెంట్స్ అందరు సమావేశం కావాలని నిర్ణయించారు ఈసమావేశంలో తల్లిదండ్రుల తరఫున వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అప్పటికి యూనివర్సిటీ ప్రైవేట్ కాలేజీ మేజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే హై కోర్ట్ మరియు సుప్రీంకోర్టు లను సంప్రదించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది మరియు రాష్ట్రస్థాయి అన్ని మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అసంపూర్తి సౌకర్యాల గురించి చర్చించడం జరిగింది. తదుపరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ కలిసి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్ ని సందర్శించి కాలేజీ యాజమాన్యాన్ని కలిసి సమస్యల పై చర్చించి ంచాలని నిర్ణయించారు ఈ సమావేశం అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ సత్యనారాయణ చారి గారి అధ్యక్షతన జరిగింది ప్రతినిధులు బీరెల్లి కమలాకర్ గారు రమేష్ గారు కె.వి.ఆర్ గారు రవీందర్ రెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ గారు సుజాత గారు సంధ్యా గారు తదుపరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా ప్రతినిధులు తల్లిదండ్రులు పాల్గొన్నారు