"లండన్ బెంగళూరు ఎయిరిండియా విమానంలో కలకలం".
పనిచేయని ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్
లండన్ నుంచి బెంగళూరు రావాల్సిన ఉన్న ఎయిరిండియా డ్రీమ్లైన్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఇంజిన్ స్టార్ట్ చేసే సమయంలో ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ ఆటోమేటిక్గా కటాఫ్ పొజిషన్కు మారడాన్ని పైలట్లు గుర్తించారు. దీంతో అధికారులు దీని గురించి సమాచారం అందించి, విమానం నిలిపివేశారు. గత ఏడాది అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లే సమయంలో టెకాఫ్ అయిన వెంటనే విమానం కూలిపోయింది. ఇలాంటి ప్రమాదమే జరగడంతో ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది.గతేడాది అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్తున్న ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలి దాదాపు 270 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో ఎయిరిండియా విమానానికి అటువంటి పరిస్థితే ఏదురైంది. అయితే, పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. లండన్లోని హీత్రూ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు రావాల్సిన బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానంAI 132లో సాంకేతికలోపం తలెత్తింది. ఇంజిన్ స్టార్ట్ చేసే సమయంలో ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ ఆన్ కాకపోవడాన్ని పైలట్లు ముందే గుర్తించారు. ఎడమవైపు ఉన్న స్విచ్ రన్ పొజిషన్లో ఉండకుండా... ఆటోమేటిక్గా రెండుసార్లు కటాఫ్ పొజిషన్కు మారిపోయినట్లు గమనించారు.
#😲తప్పిన పెను ప్రమాదం..గాల్లో 200 మంది❕ #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్