#గుడికోట #జగిత్యాల జిల్లా
తెలంగాణలోని ఏకైక పంచముఖ శివలింగ
ఆలయం గుడికోట, రాయికల్ గ్రామం,
జగిత్యాల జిల్లా.
.....
• తెలంగాణ రాష్ట్రం జగిత్యాల పట్టణ కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో రాయికల్ గ్రామంలో గుడికోట అని ఓ ఆలయం ఉంది.
• దీనిని కాకతీయుల కాలంలో(సా.శ 1305) నిర్మించారు. ఒక్కప్పుడు ఇక్కడ కోట ఉండడంతో ఈ ఆలయానికి గుడికోట అని పేరు వచ్చింది.
• 24 అడుగుల చతురస్ర ఆకారంలో రంగ మంటపం, 8 అడుగుల చతురస్ర ఆకారంలో గర్భగుడులు, అర్ధమంటపాలు లాంటివి ఈ ఆలయం లో ఉన్నాయి.
• మూడు గోపురాలు ఉండగా.. ఈ ఆలయానికి శ్రీ చెన్నకేశవనాథ పంచముఖ లింగేశ్వర సూర్యనారాయణ దేవాలయం అని పేరుంది.
• ఈ ఆలయం రాయికల్ పెద్ద చెరువుకు తూర్పున చాళుక్యుల శిల్పకళా రీతిలో నిర్మించారు. ఇక ఇక్కడి పంచముఖ లింగం తెలంగాణలోని ఏకైక పంచముఖ లింగంగా పేరుగాంచింది.
• పడమటి గర్భగుడిలో పంచముఖ లింగం, ఉత్తర గర్భగుడిలో కేశవనాథుడు, తూర్పు గుడిలో సూర్యనారాయణ స్వామి విగ్రహాలు ఉంటాయి.
• ఈ ఆలయం పరిసరాల్లో నంది విగ్రహం, నవ గ్రహ విగ్రహం, వినాయక, హనుమాన్, తదితర విగ్రహాలు ఉన్నాయి. పరమేశ్వరుడు విగ్రహం ప్రత్యేక ఆకర్షణ.
• ఈ ఆలయం మొత్తం అలంపూర్, మహానంది, సత్యవోలు ఆలయాల పోలి ఉంటుంది. తెలంగాణ రక్షిత కట్టడాల్లో ఈ ఆలయం ఒకటి.
• ఆలయం బయట కొన్ని శాసనాలు, వాటి వివరాలు ఉన్నాయి. ధ్వంసమైన కొన్ని విగ్రహ మూర్తులు ఉన్నారు.
• ఈ ఆలయాన్ని కాకతీయ రాజు ప్రతాపరుద్ర 1304లో నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. ఇది త్రికూట ఆలయంగాను చెప్పవచ్చు.
.....