జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలలో దారుణం జరిగింది!
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలలో దారుణం జరిగింది. మండలంలోని అబ్బాపూర్ గ్రామంలో 100 కి పైగా వీధి కుక్కలు మృత్యవాత పడడం గ్రామంలో కలకలం రేపింది. విషపు ఇంజక్షన్ల ద్వారా కుక్కలను చంపినట్లుగా ఆరోపిస్తూ.. గౌతమ్ అనే ఎన్జీఓ సభ్యుడు గొల్లపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎన్జీఓ సభ్యుడి ఫిర్యాదుతో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ తోపాటు, పంచాయతీ కార్యదర్శిపై పోలీసులు ఎఫ్.ఆర్.ఐ నమోదు చేశారు. కుక్కల నియంత్రణ కోసం ఎన్నో మార్గాలు ఉన్నా.. వాటిని చంపడమే పరిష్కారంగా భావించడంపై ఎన్జీఓ సంఘాల సభ్యులు మండిపడుతున్నారు.