#కల్తీ వ్యాపారం #కల్తీ ఆహారం #కల్తీ #తస్మాత్ జాగ్రత్త #జాగ్రత్త
కల్తీ కోవా బన్తో ఒళ్ళు గుల్ల..
దానివైపు చూడొద్దు మల్ల
పాలతో చేసిన కోవాబన్ రూ.10కే అంటూ ఇంతపెద్ద వ్యాన్పైన భారీగా సినిమా యాక్టర్ల ఫ్లెక్సీతో మంచి ఆకర్షణీయంగా కనిపిస్తుంది కదా.. పది రూపాయలకు ఈ రోజుల్లో ఏమొస్తుందనుకుంటూ పాపం ఆత్రంగా ఆ కోవాబన్ కొనుక్కుంటున్నారు చాలామంది అమాయకులు. వీరి అమాయకత్వమే ఆ బన్ అమ్మేవారికి ఆయుధం.. ఆ కల్తీ కోవాబన్ తిని జనానికి అనారోగ్యం.. అసలేం జరిగిందో ముందు ఈ సంఘటన గురించి తెలుసుకోండి.
తెలంగాణలోని తాండూరులో కల్తీ కోవా తయారు చేస్తున్న కేంద్రాలపై ఇటీవల టాస్క్ ఫోర్స్ దాడులు చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ వెల్లడించారు. తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ కోవా తయారు చేసి విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు.. టాస్క్ ఫోర్స్ బృందం రంగంలోకి దిగి ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో సుమారు 120 కిలోల కల్తీ కోవాను స్వాధీనం చేసుకున్నారు. ఆహారాన్ని కల్తీ చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ప్రకాష్ విష్ణు అనే వ్యక్తితో పాటు హైదరాబాద్ చంద్రాయణగుట్ట నివాసి మహమ్మద్ సల్మాన్ అనే మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం స్వాధీనం చేసుకున్న కల్తీ కోవాతో నిందితులను తాండూరు పోలీసులకు అప్పగించారు.
ఇప్పుడు అసలు విషయానికి వద్దాం... ఈ రకమైన కల్తీ కోవాతో బన్ తయారు చేసి విక్రయిస్తున్న కొందరు వ్యాపారుల బండారాన్ని బయటపెట్టిన ఒక మీడియా సంస్థపై కొందరు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇది కల్తీ బన్ అని మీకెలా తెలుసు? అంటూ కువిమర్శలు చేస్తున్నారు. ఇక్కడొక వాస్తవాన్ని గమనించాలి. నాణ్యత గల కోవా ధర హైదరాబాదులో కిలో రూ.250తో మొదలవగా... మంచి నాణ్యత గల కోవా కిలో రూ.400 వరకూ ఉంది. రూ.10కే కోవా బన్ అమ్మేవారు కేజీ రూ.220 విలువ చేసే తక్కువ నాణ్యత గల కోవాతో బన్స్ తయారు చేసినప్పటికీ, మనం ఎన్ని రకాల లెక్కలు వేసుకున్నా కచ్చితంగా రూ.10కి కోవాబన్ అమ్మితే కనీసం దాన్ని తయారు చేసేందుకయ్యే ఖర్చులు కూడా గిట్టుబాటు కావు. అందువల్ల కల్తీ కోవా వాడకతప్పదు.. అది తిన్న జనం ఆరోగ్యం గుల్లకాక తప్పదు.
పైన తెలిపిన కేసు మాత్రమే గాకుండా.. మరొకరిని కూడా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు ఏపీలోని కర్నూలు నుంచి వచ్చి తెలంగాణలోని మేడారంలో కోవా బన్స్ అమ్ముతున్నాడు. నిందితులు రోజుకు సగటున 500 బన్స్ ఆపైన అమ్ముతూ 3 రోజుల పాటు దాదాపు 2 వేల బన్స్ అమ్మినట్లు సమాచారం రాబట్టారు. ప్రతి బన్ మీద రూ.3 లాభంతో 2 వేల బన్స్ పై రూ.6,000 వరకూ లాభం సంపాదించినట్టు వివరాలిచ్చారు. కర్నూలు నుంచి మేడారానికి రానుపోను 900 కి.మీ దూరం ఉంటుంది. ఈ ప్రయాణానికి పెట్రోల్ ఖర్చులు, టోల్ గేట్ ఖర్చులు, ఆ పైన వ్యాపారికి ఉండేందుకు, సరుకు పెట్టుకోవడానికి గొడౌన్కి వేలల్లో ఖర్చులవుతాయి. ఇన్ని ఖర్చుల మధ్య కల్తీ చెయ్యకుండా కేవలం రూ.10కే మంచి నాణ్యత గల కోవాబన్ తయారు చెయ్యడం సాధ్యమేనా? లాభాల్లేకుండా అమ్ముతారా? కేవలం కొన్ని వందల రూపాయల లాభానికి ఏపీ నుంచి ఇంతదూరం వస్తారా.. అనేది ఆలోచించాలి.
ఇదంతా ఇలా ఉంటే, ఈ వ్యవహారంలో నిందితులకు మద్దతునిస్తూ SDPI సంస్థ రంగంలోకి దిగింది. ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ కల్తీ వ్యవహారాన్ని ప్రజలకు చూపించిన ఒక మీడియా సంస్థకు హెచ్చరిక కూడా జారీ చేసింది. కేరళ నుంచి దేశమంతా విషబీజాలు నాటుతున్న ప్రముఖ ఉగ్రవాద సంస్థ PFIకి మద్దతుదారు అయిన SDPIకి ఈ కల్తీ కోవాబన్ వ్యాపారులతో సంబంధమేంటి? ఒక పక్క పోలీసులే రంగంలోకి దిగి, కల్తీ కోవాను పట్టుకుని కేసులు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తుండగా మధ్యలో SDPIకి బాధేంటి? ఇదంతా చూస్తుంటే దీని వెనుక పెద్ద వ్యవహారం, కుట్ర ఉన్నట్టు కనిపిస్తోంది.
ఒక్క కోవాబన్ మాత్రమే కాదు, ఇంకా ఎన్నెన్నో రకాల ఆహారపదార్థాలను కల్తీ చేస్తూ ప్రజలను నిర్వీర్యుల్ని చేస్తున్నారు. జనులారా జాగ్రత్త..