Mahbubnagar Police
525 views
17 days ago
హెల్మెట్ వినియోగంపై అవగాహన – “అలైవ్ అర్రైవ్” కార్యక్రమం విజయవంతం రోడ్డు భద్రత కోసం అడ్డాకల్ టోల్ ప్లాజా వద్ద అడ్డకల్ పోలీసుల చొరవతో 100 హెల్మెట్ల ఉచిత పంపిణీ మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని జాతీయ రహదారి–44 పై రోడ్డు భద్రతను బలోపేతం చేయడం లక్ష్యంగా చేపట్టిన “అలైవ్ అర్రైవ్” కార్యక్రమంలో భాగంగా ఈరోజు అడ్డాకల్ టోల్ ప్లాజా వద్ద ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. అడ్డాకల్ పోలీసుల ఆధ్వర్యంలో, వెస్ట్రన్ ఆంధ్ర టోల్‌ వేస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించి, భద్రతా చర్యల ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేని వాహనదారులకు 100 హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడ్డాకల్ ఎస్సై శ్రీనివాస్ గారు, అడ్డాకల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, అడ్డాకల్ టోల్ ప్లాజా ప్రతినిధి రఘునందన్ మరియు వారి సిబ్బంది, వెస్ట్రన్ ఆంధ్ర టోల్‌ వేస్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడ్డాకల్ ఎస్సై శ్రీనివాస్ మాట్లాడుతూ — రోడ్డు ప్రమాదాలలో తల గాయాలు ప్రధాన కారణంగా ప్రాణనష్టం జరుగుతున్నదని, హెల్మెట్ ధరించడం వాహనదారుల ప్రాణాలను రక్షించే అత్యంత ముఖ్యమైన భద్రతా చర్య అని తెలిపారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నియమాలను పాటించి సురక్షిత ప్రయాణాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన వెస్ట్రన్ ఆంధ్ర టోల్‌ వేస్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారులకు మరియు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అడ్డాకల్ పోలీసుల చొరవతో ప్రజల భద్రత దృష్ట్యా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, ఇటువంటి రోడ్డు భద్రతా చర్యలు కొనసాగించాలని సూచించారు. ప్రజలు రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ, తమ ప్రాణాలను మరియు ఇతరుల ప్రాణాలను కాపాడుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. #MahabubnagarPolice #helmetawareness #📰 వార్తలు