ఆర్ఎస్ఎస్ పూర్వ ప్రచారక్ నాగేంద్ర ప్రసాద్ జీ శివైక్యం పొందడం హిందూ ధార్మిక స్వచ్ఛందసేవా సంస్థలకు & హిందూ ఆత్మీయ బంధువులందరికి కూడా ఓ తీరనిలోటు! ( 2 - 3 - 2026)!
లేదా
హిందువుల ఐక్యతకు,బలోపేతానికి తన యావత్ జీవితాన్ని అంకితం చేసిన ఓ మహోన్నత వ్యక్తి,పోరాటయోధుడు,కారణజన్ముడు ఈ నాగేంద్రప్రసాద్ గారు!
రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పూర్వ ప్రచారక్ శ్రీ నాగేంద్ర ప్రసాద్ గారు శివైక్యం చెందడం యావత్ హిందూ సమాజానికి,హిందూ ధార్మిక స్వచ్ఛంద సేవా సంస్థలకు,ప్రతి యొక్క హిందూ ఆత్మీయ బంధువులకు కూడా తీరనిలోటు అనే మాట ఓ అక్షర సత్యం.ఎందుకంటే తన యావత్ జీవితాన్ని హిందూవుల ఐక్యతకు,బలోపేతానికి అంకితం చేసిన మహోన్నత వ్యక్తి,కారణజన్ముడు,ఓ పోరాట యోధుడు,హిందుత్వ ఎజెండానే ఏకైక లక్ష్యంగా మనసా,వాచ,కర్మణ జీవించిన ఓ నిఖార్సైనా హిందుత్వవాది ఈ నాగేంద్రప్రసాద్ గారు అనడంలో ఎలాంటి సందేహనికి తావులేదు.అంతేకాదు చిన్ననాటి నుండి కూడా ఆయన హిందుత్వ కార్యకలాపాలలో నిత్యం తలమానికంగా వుంటూ దాదాపు 30 సంవత్సరాలు భరతమాత సేవలో తరించిపోవడమే కాదు కాల్వబుగ్గ దగ్గర అత్యంత విశాలమైన ప్రాంగణంలో శ్రీ సురభి గోశాలను ఏర్పాటు చేయడమే కాదు,అక్కడ ప్రముఖ స్వాతంత్ర్య యోధుల ప్రతిమలను సైతం ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన అసలు సిసలు హిందుత్వవాది ఈ శ్రీ నాగేంద్రప్రసాద్ గారు.అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ స్వయంసేవకుడిగా వుంటూ భరతమాత సేవలో తరించిపోతూ తన అమూల్యమైన జీవితాన్ని అంకితం చేయడమే కాదు తన స్వగ్రామమైన బేతంచెర్లకు వచ్చి శ్రీ వికాస భారతి అను ధార్మిక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి దాదాపు 150 గ్రామాలలో పర్యటన చేసి నిద్రాణావస్థలో జోగాడుతున్న మన యావత్ హిందూ సమాజాన్ని తట్టిలేపి,జాగృతం చేసి తిరిగి పునర్జీవింపచేసిన,హిందూ సనాతన ధర్మ స్థాపన పటిష్టతకు ఎనలేని,వెలకట్టలేని,అజరామమైన సేవలు అందించిన ఈ హిందుత్వ పిపాసి,హిందువుల ఐకమత్యమే తన జీవిత ఆశయంగా జీవించిన ఓ గొప్ప మానవతామూర్తి,హిందూ ఆత్మీయ బంధువు,హిందూ సోదర,సోదరిమణుల నిజమైన శ్రేయోభిలాషి ఈ నాగేంద్రప్రసాద్ గారు. అన్నింటికిమించి 2019న తాను స్థాపించిన వికాస భారతి,సురభి గోశాల ఇలా రెండింటిని కలిపి భవిష్యత్ లో వికాస భారతి ఆధ్వర్యంలో జరిగే పలు హిందుత్వ సంబంధిత కార్యకలాపాలకు ఓక వేదికగా,ఓ కేర్ ఆఫ్ అడ్రస్ గా, ఓ చక్కటి ప్లాట్ ఫామ్ గా ఈ రెండు సంస్థలు బాసిల్లాలనే ఓ మంచి సదాశయానికి,లక్ష్యానికి అంకురార్పణ గావించిన ఓ నిజమైన,యదార్థమైన ఆరనాల హిందుత్వ ప్రేమికుడు ఈ నాగేంద్రప్రసాద్ గారు.
ఏదిఏమైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘానికి ప్రచారక్ గా అత్యంత సుదీర్ఘ కాలంపాటు చిరస్మరణీయమైన సేవలు అందించి,చిలువలు పలువలుగా,అనైక్యతతో చీలిపోయిన పలు హిందుత్వ కులాలను ఒకే త్రాటిపై తీసుకువచ్చి 'కలిస్తే నిలుస్తాం విడిపోతే పడిపోతే అధ పాతాళానికి ' అనే నీతి సూత్రానికి పెద్ద పీట వేసి,ఆ నీతి సూత్రాన్ని ప్రతి ఒక్క హిందూ సోదర,సోదరీమణులలో నాటుకుపోయేలా చేసి వారందరూ హిందుత్వ ఐక్యతకు విశేష,అవిరళ కృషి సల్పేలా చేయగలిగిన అంకుటిత దీక్షపరుడు, ఆరు నూరైన తననుకున్న సమున్నత లక్ష్యాలు,ఆశయాల విషయంలో ఎంతమాత్రం రాజీపడని మొండిఘట్టం,యావత్ హిందూ సమాజానికే ఓ గొప్ప స్ఫూర్తి ప్రదాత,ఆదర్శ వ్యక్తి,గొప్ప విశాలభావాలు మెండుగా గల నాయకుడు ఈ నాగేంద్రప్రసాద్ గారు.ఏమైనా ఆ మహానుభావుడు,ఓ కరుడు గట్టిన హిందుత్వ భావజాలం మెండుగా గల ఈ ఆర్ఎస్ఎస్ పూర్వ ప్రచారక్ అయిన శ్రీ నాగేంద్రప్రసాద్ గారికి ఈ విషాద సమయాన ప్రతి ఒక్క ఆత్మీయ హిందువు బంధువులు ఆయనకు అత్యంత గొప్పగా,ఘనంగా నివాళులు అర్పించాల్సిన గురుతర బాధ్యత మనందరి భుజస్కంధాలపై ఎంతైనా వుంది.ఓం శాంతి! బోలో భారతమాతాకీ జై! జై శ్రీరామ్!🏹🏹🏹✍️✍️✍️
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు & ఆత్మీయ హిందూ బంధువు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా!
#rss