#జయహో భారత్🇮🇳
*రికార్డు సృష్టించిన ఇండియా❗*
16.02 2025✍️
T 20 ప్రపంచకప్ 2026లో భారత్ (Team India) తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. వేదికతో సంబంధం లేకుండా, ప్రత్యర్థి ఎవరైనా భారత ఆధిపత్యం మాత్రం తగ్గడం లేదు.
సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు, దాయాది పాకిస్థాన్పై మరోసారి పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆదివారం కొలంబో వేదికగా జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్లో సూర్య సేన 61 పరుగుల భారీ తేడాతో గెలిచి, సూపర్-8 బెర్త్ను ఖరారు చేసుకుంది.
ఓ జట్టుపై అత్యధిక సార్లు గెలిచిన టీమ్గా భారత్
ఈ విజయంతో పాకిస్థాన్పై భారత్ (Team India) తమ రికార్డును 8-1కి మెరుగుపరుచుకుంది.
ఈ నేపథ్యంలోనే, ఈ టోర్నీ చరిత్రలో ఓ జట్టుపై అత్యధిక సార్లు గెలిచిన టీమ్గా రికార్డు సృష్టించింది. పాక్తో జరిగిన 9 మ్యాచుల్లో ఏకంగా 8 సార్లు భారత్ గెలిచింది. మరే జట్టూ దరిదాపుల్లో కూడా లేదు. బంగ్లాపై ఆస్ట్రేలియా, బంగ్లాపై పాకిస్థాన్, వెస్టిండీస్పై శ్రీలంక, ఇంగ్లండ్పై వెస్టిండీస్ 6 విజయాలతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి.