Rochish Sharma Nandamuru
1.5K views
1 months ago
🌿🌼🙏శ్రీ అమరనాథ లింగ తొలి దర్శనం🙏🌼🌿 భారత దేశం లోని జమ్మూ మరియు కాశ్మీర్‌ రాష్ట్రంలో అమర్‌నాథ్‌ పర్వతంపెై ఉన్న గుహ హిందూమత ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయం లో శివుడు హిమలింగ రూపంలో కొలువు దీరాడు. ఈ పుణ్యక్షేత్రానికి 5,000 సంవత్సరాలకు పైబడిన చరిత్ర ఉంది. ప్రధాన గుహ లోపల శివలింగం ఉంటుంది. ఇది మే నుంచి ఆగష్టు వరకు వృద్ధి చెంది, ఆ తరువాత కరుగుతుంది. చంద్రుడి దశలతో పాటు పెరుగుతూ, తగ్గుతూ, వేసవి పండుగ సమయంలో గరిష్ఠ ఎత్తుకు చేరుకుంటుంది. హిందూ పురాణాల ప్రకారం, ఈ గుహలోనే శివుడు తన దెైవిక సహాధర్మచారిణి అయిన పార్వతికి జీవిత రహస్యం, సనాతనం గురించి వివరించాడు. ఇంకో రెండు మంచు ఆకారాలు పార్వతి, శివుడు కుమారుడు అయిన గణేశుడిని సూచిస్తాయి. అమరనాథ్ గుహలు భారత దేశం లోని జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రంలో గల ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ క్షేత్ర ప్రధాన దైవం "శివుడు". మంచు కొండ మీద ఓ గుహ... భారత దేశంలోనే పెద్దది... ఉన్నది 12,000 అడుగుల ఎత్తున... అక్కడికి వెళ్లడమే ఎంతో కష్టం... అయినా లక్షలాది మంది దర్శిస్తారు... అదే అమర్‌నాథ్‌! ఓసారి పార్వతీదేవికి జీవరహస్యం, అమరత్వం గురించి తెలుసుకోవాలనే కోరిక కలిగింది. శివుడిని అడిగింది. మంచు కొండల్లో ఎవరూ లేని ఏకాంత ప్రదేశంలో దానిని వివరించాడు. ఆ అమర కథను చెప్పిన స్థలమే. భక్తులు పహల్గామ్‌ అనే ఊరి నుంచి 42 కిలోమీటర్ల దూరం కాలినడకన మంచు కొండ ఎక్కుతారు.జీవరహస్యాన్ని ఎవరూ లేని చోట చెప్పాలనుకున్న శివుడు, పహల్గామ్‌లో నందిని వదిలేసి పార్వతితో కొండెక్కాడని చెబుతారు. మార్గమధ్యంలో చందన్‌వరి వద్ద నెలవంకని, శేష్‌నాగ్‌ సరస్సు వద్ద కంఠాభరణమైన పాముని, మహాగుణాస్‌ పర్వతం వద్ద గణేశుడిని, పంజితర్ణి వద్ద పంచ భూతాల్ని విడిచిపెట్టాడు. త్రినేత్రంలోని కాలాగ్నిని కూడా వదిలి ఏ జీవి కనిపించినా భస్మం చేయమని ఆదేశించి గుహలో ప్రవేశించాడు. శివుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా తను పరుచుకున్న జింక చర్మం కింద ఉన్న రంధ్రంలో రెండు పావురాలు ఉండిపోయి శివుడి చెప్పిన రహస్యాన్ని విన్నాయి. వాటికి శివుడు అమరత్వాన్ని ప్రసాదించాడని, అవి ఇప్పటికీ అమర్‌నాథ్‌ గుహలో కనిపిస్తాయని భక్తులు నమ్ముతారు. .#☀️శుభ మధ్యాహ్నం #🌻సోమవారం స్పెషల్ విషెస్ #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #😇శివ లీలలు✨ #🛕శ్రీ అమరనాథ్ స్వామి🕉️