MURALI MOHINI
2.6K views
🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀 🕉 ఈనాటి శ్రీవైష్ణవ దివ్యదేశం : 46వ దివ్యదేశము 🕉 🙏శ్రీ కాలమేఘ పెరుమాళ్ ఆలయం-తిరు మొఘుర్, మదురై 🙏 @ ప్రధాన దైవం : కాలమేఘ పెరుమాళ్ @ ప్రధాన దేవత : తిరుమోగూర్వల్లి తాయార్, మేఘవల్లి(మోహన వల్లి) @ పుష్కరిణి : క్షీరాబ్ది పుష్కరిణి @ విమానం :కేతకి విమానం(మోహన విమానం) @ ప్రత్యక్షం : బ్రహ్మ, రుద్ర, ఇంద్రులకు 🛎 స్థల పురాణం : 🛎 👉 అమృతమును పంచు నిమిత్తమై మోహినీ అవతారము దాల్చిన స్వామి దేవతల ప్రార్థననంగీకరించి కాళమేఘ పెరుమాళ్లుగా అవతరించుట చేత ఈ క్షేత్రమునకు మోహనపురమని పేరు వచ్చింది 👉 దేవదానవులు అమృత సాధనకై పాల సముద్రమును మథించిన వివరము అందరకు తెలిసనదే కదా ! ఆ కార్యములో ప్రథమమున ఉద్భవించిన కాలకూట విషము జగదుపద్రవకారి కావున అందరి ప్రార్థన మేరకు పరమేశ్వరుడు తన కంఠమున ఆ విష ప్రభావమున కంఠము నీలపు రంగు తాల్చగా నీల కంఠుడు , గరళ కంఠుడు అని పేరు పొందెను . 👉 ఆ పిమ్మట ధన్వంతరి , అశ్వినీ దేవతలు ,రంభాది అప్సరసలు , ఉచ్ఛైశ్రవము అను గుఱ్ఱము , కామధేనువు , కల్పతరువు , పాంచజన్యము అను గొప్ప శంఖము , కౌస్తుభమణి , చంద్రుడు , లక్ష్మీదేవి ఉద్భవించగా ఆఖరున అమృతము సాధించబడినది . 👉 శ్రీ మహావిష్ణువు పాంచజన్య శంఖమును తన చేతి యందు శోభించునట్లు , కౌస్తుభ మణిని తన వక్ష స్థలమున శోభించు రీతిలో హారముగానుంచుకొనెను . 👉చంద్రుని పరమేశ్వరుడు తన శిరమున జటలలో నుంచుకొని చంద్రమౌళి , చంద్రశేఖరుడు గా పిలువ బడుచున్నాడు . 👉 అమృతము దేవేంద్రాది దేవతలు మాత్రమే పొందవలసి యున్నది . ఏలనన అసురులు ( దానవులు ) లోక కంటకులు , దేవతా శత్రువులు . ఆ యవసరమున శ్రీ మహావిష్ణువు మోహినీ అవతారమున దానవులను మోహమున త్రోసి , వివేక శూన్యులను గావించి అమృతమును ఇంద్రాది దేవతలకు పూర్తిగా పంచి పెట్టి వారిని అమరులను గావించెను . మరియు లక్ష్మీదేవికి తానే అతిలోక సుందరిని అనుభావముతో నుండిన కించిత్తు గర్వమును తొలగించుట కూడ మోహినీ అవతారమున శ్రీమన్నారాయణుని ఒక లీలా విశేషము . మరియు ఆ సందర్భమున శ్రీ మహావిష్ణువు యొక్క మోహినీ రూప లావణ్యమునకు సౌందర్యమునకు ముగ్ధుడై కాంచిన పార్వతీ పతి పరమేశ్వరునకు సహితము మోహావేశము కలుగగా ఆ దేవుని జ్ఞాన నేత్రమున అయ్యప్ప స్వామి జన్మించెను . దేవాదిదేవుల సంకల్పములు అకారణములు కావు కదా ! అయ్యప్ప దేవుని జన్మము కూడ మహిషాసురుని సోదరి అయిన మహిషి యను అసురిణి సంహారార్థము అవసరమైనది . ఆ విధముగా అవతరించిన అయ్యప్ప స్వామి మహిషిని సంహరించి శబరిమల ( కేరళ ) లో వెలసి భక్తులను బ్రోచుచున్నాడు . 👉ఈ స్థలమునకు “ మోముర్ " అని పేరు కలుగుటకు కారణము శ్రీమన్నారాయణుని మోహినీ అవతారమే . మేఘములలో నల్లనివి ( కాల మేఘములు ) మాత్రమే వర్షించి జగమున ధాన్యములు , ఓషధులు పండించునట్లు ఇచ్చటి పెరుమాళ్ భక్తుల " అని పేరు పొంది కాంచీపురమున వెలసిన " వరదరాజ పెరుమాళ్ " వలె నిలిచి యుండి దర్శన మిచ్చును . 👉గరుడ మండపమున కోదండరామ - సీత - లక్ష్మణుల సన్నిధి మరియు రతీ మన్మథుల సన్నిధి శోభాయ మానముగ యున్నవి . 👉ఇచ్చట శ్రీమన్నారాయణుడు ఏడు శయనమూర్తి భంగిమలలో దర్శన మిచ్చుచున్నాడు ( భోగ , వీర , స్థల , ఆనంద , బాల , ఉత్థాన , మరియు ప్రధాన శయన మూర్తులు ) . 👉ప్రధాన శయనమూర్తి - ఆదిశేషునిపై శ్రీ మహాలక్ష్మి , భూమిదేవి పాదముల సేవించుచుండగా దర్శనమిచ్చును . అనంతరము శ్రీ కాలమేఘ పెరుమాళ్ ఎడమ చేతిలో గద ధరించి , కుడిచేయి వరద ముద్రతో శ్రీ , భూ దేవేరులు ఇరుప్రక్కల యుండగా దివ్యమైన రీతిలో నిలిచియుండి దర్శన మిచ్చును . 👉ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే 16 చేతులతో చక్రతల్వార్ ఉండటం మరియు ప్రతి చేయి వేరే ఆయుధాన్ని కలిగి ఉండటం. శంకు చక్రంతో చక్రతల్వార్ వెనుక నరసింహ దేవుడు ఉన్నాడు. 🙏జై శ్రీమన్నారాయణ 🙏 🙏🙏🙏 #MMSTUDIOS ✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀