హరికృష్ణ ఆచార్య
546 views
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 🕉 శివరాత్రి సందర్భంగా 🕉 🔅 చిత్తూరు జిల్లా : గుడిమల్లం 🔅 శ్రీ పరశురామేశ్వర ఆలయం : గుడిమల్లం. 🙏 తన ఒడికి చేర్చుకునే గుడిమల్లం దేవుడు శివుడు 🙏 🔅 ఈ గుడి ఏనాటిదో ఖచ్చితంగా చెప్పటానికి తగిన శాసనాలేవీ లభించలేదు . కానీ పురావస్తు శాస్త్రజ్ఞుల పరిశోధన ఇది క్రీ.పూ. రెండో శతాబ్దం నాటిదని నిర్ణయించింది . 👉 అయితే ఆలయంలోని లింగాన్ని ఎవరు , ఎప్పుడు ప్రతిష్టించారో మాత్రం తెలియటం లేదు . ఆలయంలోని శివ లింగం ఆకారం మరెక్కడా లేని విధంగా పురుషాంగాన్ని పోలి ఉంటుంది . దానిమీద రాక్షసుడి భుజాలపై నిలుచున్న శివమూర్తి ఉంటాడు . 👉శివుడి కుడిచేతిలో జింక , ఎడమ చేతిలో భిక్షపాత్ర , ముంజేతికి కడియం , చెవులకి కుండలాలు , భుజం మీద గండ్ర గొడ్డలి , తలకు తాటికాయలు కిరీటం , మొలకు ధోవతి స్పష్టంగా కనిపిస్తాయి . 👉చోళుల తర్వాత పల్లవులు కొంత కాలం ఈ ఆలయ నిర్వహణ చేశారు . వాళ్ళ శాసనాల్లో ఈ ప్రాంతాన్ని " తిరువిప్పురమ్ బేడు " అని పిలిచినట్టు తెలుస్తోంది . అంటే తెలుగులో ' శ్రీ విప్రపీఠం ' అంటారు . పల్లపుల నిర్వహణలోకి వచ్చాక ఇది గుడిపల్లంగా మారిపోయింది . కాలక్రమంలో అదే గుడిమల్లంగా మారిపోయింది. 👉ఈక్షేత్రంలోఉన్న శివలింగం త్రిమూర్తి స్వరూపం అనునది సుస్ఫష్టం. శివలింగములన్నీ ఆద్యంతములులేని స్తంభమువలె లింగరూపంలో దర్శనమిస్తాయి. 👉 ఆలయమందు శివుడు పరశురామేశ్వరుడుగా పూజింపబడుతున్నాడు. 👉గర్భాలయంలో ప్రతిష్ఠించబడిన శివస్వరూపం జ్యోతిర్లింగ ఆలయాలు మరియు ఇతర శివాలయాల మాదిరిగా లింగ రూపంలో కాక పురుషాంగాన్ని పోలి ఐదుఅడుగుల పొడవు ఒక అడుగు వెడల్పుతో ముదురు కాఫీరంగు రాతితో చేయబడి వేటగానితూపంలో శివుడు యక్షుని భుజాలపై నిలబడి రుద్రుని భంగిమలో దర్శనమిస్తాడు. 👉రెండు చేతులందు తలక్రిందులుగా గొర్రెపోతు కాళ్ళు కుడిచేతితో, చేతిలో చిన్నపాత్ర పట్టుకొని తలకట్టుతో, చెవులకు రింగులు మరియు ఆభరణాలు ధరించి నడుమునుండి మోకాళ్ళ వరకూ వస్త్రముధరించి యజ్ఞోపవీతం లేని వేటగానివలె కనపడతాడు. ఎడమభుజం ఆనుకొని గొడ్డలిఉంది. పలుచని వస్త్రమునుండి స్వామివారి శరీరభాగములు స్పష్టంగా కనపడతాయి. తలపాగా, దోవతిధరించిన రుద్రుని వస్త్రధారణ రుగ్వేదకాలం నాటిదని తెలుస్తూంది. 👉భాగవతపురాణ కధనంప్రకారం శ్రీమహావిష్ణువు పది అవతారాలో ఆరవ ఆవతారం పరశురాముడు. జమదగ్ని మహర్షి మరియు రేణుకాదేవి కుమారుడు. 👉జమదగ్ని మరియు రేణుకాదేవికి వాసు, విశ్వావసు, బ్రిహుద్యను, బృత్వకన్వ మరియు భద్రరామ అను అయిదుగురు కుమారులు. ఇందు భద్రరామ తరువాత కాలంలో పరశురాముడని పిలువబడ్డాడు. 👉రేణుకాదేవి మహాసాధ్వీ మరియు తన భర్తకు గొప్ప భక్తురాలు. ఒకరోజు ఆమె నదికినీరు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు నదిలో స్నానం చేస్తున్న గంధర్వుడిని చూసి మోహించినది. అందువలన ఆమెకు గల దైవికశక్తులు నశించినవి. దివ్యదృష్టితో ఆ విషయం తెలుసుకొన్న జమదగ్ని ముందుగా తన నలుగురు కుమారులను పిలిచి తల్లి శిరస్సు ఖండించమని ఆదేశించాడు. 👉వారు అంగీకరించక పోవడంతో పరశురామునితో సోదరులను, తల్లిని వధించమని ఆదిశించాడు . తన తండ్రి ఆజ్ఞతో తల్లి మరియు సోదరులకు శిరచ్ఛేదం చేసిన తరువాత, పరశురాముడు తన తల్లి మరియు సోదరులను తిరిగి బ్రతికించుటకు తండ్రి నుండి వరం కోరుకున్నాడు. 👉తల్లిని చంపిన మాతృహత్యా దోషంనుండి విముక్తి కొరకు శివలింగం పూజించవలసిందిగా తండ్రి చేసిన సలహాతో శివలింగం కొరకు వెతకి పరశురాముడు అడవి మధ్యలో శివలింగం చూచి సమీపంలో చెరువుతవ్వి పూజించసాగాడు.. .. 👉ఆ చెరువు నందు ప్రతిరోజు ఒక దైవికపుష్పం పెరుగుతూ ఉండగా పరశురాముడు శివునికి పూజించేవాడు. పువ్వును జంతువులనుండి రక్షణకొరకు చిత్రసేనుడను యక్షుడుని కాపలాగా ఉంచాడు. 👉ఒకమారు పరశురాముడు లేని సమయంలో బ్రహ్మభక్తుడైన చిత్రసేనుడు ఆపుష్పంతో శివుని పూజించాడు. ఇది తెలిసిన పరశురాముడు కోపోధ్రిక్తుడై చిత్రసేనునీతో పద్నాలుగు సంవత్సరాలు యుద్ధంచేశాడు. 👉వారు ఇరువురు యుద్ధం చేసిన ప్రదేశం గుంటవలే తయారై గుడిపల్లం అని పేరు వచ్చిందని స్థానిక కధనం. 👉యుద్ధం ముగియకపోవడంతో శివుడు ప్రత్యక్షమై వారిని శాంతింపజేశాడు. శివుడు వారి భక్తికి తృప్తి చెంది వారిలో రెండు భాగాలుగా లీనమయ్యడు.. అందువల్ల శివలింగం ఒకభాగం విష్ణు రూపమైన పరశురామునిగా ఒకచేతిలో వేటాడిన మృగంతో, రెండవచేతిలో కల్లుకుండతో - రెండవభాగం చిత్రసేనుడు బ్రహ్మవలె మరియు శివుడు లింగరూపంతో మలచబడినట్లు కథ ప్రాచుర్యంలో ఉంది. 👉దీనినిబట్టి ఈక్షేత్రంలోఉన్న శివలింగం త్రిమూర్తి స్వరూపం అనునది సుస్ఫష్టం. 👉 సూర్యకిరణాలు ఉత్తరాయణ, దక్షిణాయణములలో శివలింగం నుదిటిపై నేరుగా ప్రసరిస్తాయి. 👉 ఇక్కడ వసతి మరియు భోజన సదుపాయాలు ఏమి ఉండవు. ✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀