అండర్ - 19 ప్రపంచకప్ లో వరుసగా ఆ lరవసారి విశ్వ విజేతగా ఆవిర్భవించిన భారత్ యువ జట్టు!
లేదా
మరోసారి ఓ అమోఘమైన ఇన్నింగ్స్ తో చెలరేగిన వైభవ్ సూర్యవంశీ!
ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ లో భారత్ మరోసారి విశ్వ విజేతగా నిలువడం ఎంతైనా హర్షణీయం.మొత్తం మీద చూస్తే ఇప్పటివరకు ఈ మెగా టోర్నీని 6 సార్లు నిర్వహిస్తే మన భారత జట్టు 6 సార్లు విశ్వ విజేతగా ఆవిర్భవించడం ఓక గొప్ప విశేషంగా చెప్పవచ్చు.ఇక హరారే వేదికగా యువ భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన యువ భారత జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోర్ సాధించగా, ఆ తరువాత అత్యంత భారీ లక్ష్య చేదనతో బరి లోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు కొంతలో కొంత పోరాడినప్పటికి మన భారత బౌలర్లు అంబ్రిష్,దీపేశ్, కనిష్క్ దాటికి కేవలం 40.2 ఓవర్లలో 311 పరుగులు మాత్రమే సాధించి 100 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.అన్నింటికి మించి ఇంగ్లాండ్ తో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరొమారు చిచ్చరపిడుగులాగా చేలరేగి వాయువేగంతో కేవలం 80 బంతుల్లో 15 ఫోర్లు,15 సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చేలరేగిపోయి 175 పరుగులు సాధించడంతో భారత యువజట్టు 400 పరుగుల భారీ స్కోరును,చెట్టు అంతా అసాధారణ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ జట్టు ముందు యువ భారత జట్టు ఉంచగలిగింది.వైభవ్ సూర్యవంశీతో పాటు ఆయుశ్,వేదాంత్,విహాన్,అభిజ్ఞాన్,కనిష్క్ లు సైతం తమ బ్యాట్ లకు పని చెప్పడంతో భారత యువ జట్టు ఓ అనితర సాధ్యమైన లక్ష్యాన్ని ఇంగ్లాండ్ జట్టు ముంగిట నిలిపింది.ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ అండర్ - 19 వరల్డ్ కప్ ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ దాటికి అనేక రికార్డులు ఈ కుర్రాడి పాదాక్రాంతమయ్యాయి అనే మాట అక్షర సత్యం.ఇక ఈ కుర్రాడి నమ్మశక్యం కానీ రికార్థుల విషయానికి వస్తే భారత్ తరపున వైభవ్ సూర్యవంశీ వరల్డ్ కప్ లో అత్యధిక స్కోరు సాధించడం,ఓవరాల్ గా అంబటి రాయుడు ( 177) తరువాత సూర్య వంశీ ( 175 పరుగులు) రెండవ స్థానంలో నిలువడం,15 ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్స్ లు,30 అత్యధిక బౌండరీలు కొట్టడమే కాదు,కేవలం ఈ ఫైనల్ మ్యాచ్ లో సిక్స్ లు, ఫోర్ల ద్వారానే 150 పరుగులు రాబట్టడం,అంతేకాదు ఐదో వేగవంతమైన సెంచరీని కేవలం 55 బంతుల్లో సాధించడం,అదేమాదిరి అత్యధికంగా 30 సిక్స్ లు ప్రపంచ కప్ లో సాధించడం,భారత్ తరపున ఒకే వరల్డ్ కప్ లో శిఖర్ ధావన్ (505) తరువాత రెండో స్థానాన్ని వైభవ్ సూర్య వంశీ (439) భర్తీ చేయడం వెరసి ఈ యువ ఆటగాడు ఈ అండర్ - 19 వరల్డ్ కప్ లో తన పదునైన బ్యాట్ తో ఎంతటి విధ్వంసం సృష్టించాడో మనం ఇట్టే ఊహించవచ్చు.
ఏదిఏమైన వైభవ్ సూర్యవంశీ వంటి దూకుడుకు మారు పేరైనా ఓక మెలిక లాంటి అద్భుత ఆటగాడు భారత క్రికెట్ జట్టుకు లభించడం ఓక గొప్ప శుభపరిణామంగా చెప్పవచ్చు.వేదిక ఏదైనా,స్థాయి ఎలాంటిదైనా,ప్రత్యర్థి ఎవరైనా వారి బౌలింగ్ శ్రేణిని ఊచకోట కోయడమే పనిగా పెట్టుకున్న ఈ పాల బుగ్గల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఈ అండర్ - 19 విశ్వ కప్ ఫైనల్లో పాయింట్, కవర్స్,మిడ్ వికెట్,ఫైన్ లెగ్, లాంగాఫ్,లాంగాన్ ఇలా ప్రతి దశలో అత్యద్భుత షాట్లతో ఇంగ్లీష్ బౌలర్ల పనిపట్టి 175 పరుగులు రికార్డు స్కోరును నమోదు చేయడాన్ని బట్టి ఈ కుర్రాడి విలువ ఏంటో ఒక్క భారత్ కే కాదు యావత్ ప్రపంచ క్రికెట్ కు తెలిసి వచ్చింది అనడంలో ఎలాంటి సందేహానికి తావు లేదు.ఏమైనా అండర్ - 19 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ వంటి అత్యంత ప్రతిభావంతమైన జట్టును మన యువ భారత జట్టు ఆటగాళ్లు సమిష్టి కృషితో,మంచి టీం స్పిరిట్ కనబరచి మరీ మట్టి కరిపించడం ఎంతైనా ఓక గొప్ప విశేషంగా చెప్పవచ్చు.ఇలాగే మున్ముందు కూడా మన అండర్ - 19 భారత యువ జట్టు మరిన్ని అసాధారణ విజయాలు సాధించి యావత్ భారత వాణికి మరింతగా కీర్తి,ప్రతిష్టలు తీసుకురావాలని కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానులు అంతా మనసా,వాచ,కర్మణ హృదయపూర్వకంగా కోరుకుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.జయ జయహో అండర్- 19 భారత యువ క్రికెట్ జట్టు! హ్యాట్సాఫ్ టూ వైభవ్ సూర్యవంశీ మేరా హిందూస్తాన్ మహాన్!🇮🇳🇮🇳🇮🇳🏏🏏🏏✍️✍️✍️!
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా!
#క్రికెట్