*దేశంలో ఎంతమంది ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారో తెలుసా?*
భారత టెలికాం రంగం రికార్డు వృద్ధిని నమోదు చేసింది. ట్రాయ్(TRAI) తాజా నివేదిక ప్రకారం దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 102.86 కోట్లకు చేరింది. ఇందులో 98 కోట్లకు పైగా వైర్ లెస్ వినియోగదారులే కావడం విశేషం. టెలికాం రంగ స్థూల ఆదాయం రూ.1,02,475 కోట్లుగా నమోదైంది. కంపెనీలకు ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం రూ.190.99 నుంచి
రూ.194.57కు పెరిగింది.
#🆕Current అప్డేట్స్📢