#🏏క్రికెట్ 🏏 #t 20 world cup 2026
*నాలుగు దేశాలు, నాలుగు ఖండాలు... సెమీ ఫైనల్స్లో అరుదైన దృశ్యం..❗*
02.03.2026🏏
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ ప్రీ క్లైమాక్స్కి చేరుకుంది. 20 దేశాల టీమ్స్ తో మొదలైన టీ20 వరల్డ్ కప్లో 8 దేశాలు సూపర్ 8 స్టేజీకి రాగా అందులో నుంచి నాలుగు టీమ్స్.. సెమీ ఫైనల్స్ ఆడబోతున్నాయి. గ్రూప్ 1 నుంచి సౌతాఫ్రికా, భారత్.. సెమీ ఫైనల్కి అర్హత సాధించగా, గ్రూప్ 2 నుంచి ఇంగ్లాండ్, న్యూజిలాండ్ సెమీస్ చేరాయి.
2022 టీ20 వరల్డ్ కప్, 2024 టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్లో భారత జట్టు, ఇంగ్లాండ్తోనే తలబడింది. వరుసగా మూడో టీ20 వరల్డ్ కప్లో భారత్, ఇంగ్లాండ్ మధ్య సెమీస్ జరగనుంది. మార్చి 4న కోల్కత్తాలో సౌతాఫ్రికా- న్యూజిలాండ్ మధ్య మొదటి సెమీ ఫైనల్ జరిగితే.. మార్చి 5న ఇంగ్లాండ్ - ఇండియా మధ్య రెండో సెమీస్ జరుగుతుంది.
అయితే 2026 టీ20 వరల్డ్ కప్ సెమీస్లో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. సెమీ ఫైనల్స్ ఆడే నాలుగు దేశాలు కూడా నాలుగు ఖండాలకు చెందినవి కావడం విశేషం.
భారత్, ఆసియా ఖండానికి చెందిన దేశం కాగా, ఇంగ్లాండ్ జట్టు, యూరప్ ఖండానికి చెందింది. సౌతాఫ్రికా జట్టు, ఆఫ్రికా ఖండానికి చెందిన టీమ్ అయితే, న్యూజిలాండ్ జట్టు, ఓషియానియా (ఆస్ట్రేలియా) ఖండంలో ఉంది. ఈసారి ఆసియా టీమ్ లేకుండానే సెమీ ఫైనల్స్ జరుగుతుందేమోనని ఐసీసీ కంగారుపడింది. అయితే ఆఖరి సూపర్ 8 మ్యాచ్లో వెస్టిండీస్ని ఓడించిన భారత జట్టు, సెమీ ఫైనల్కి దూసుకెళ్లింది.
2024 టీ20 వరల్డ్ కప్లో ఇండియా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్తో పాటు ఆఫ్ఘనిస్తాన్.. సెమీస్ కి అర్హత సాధించింది. ఈసారి ఆఫ్ఘనిస్తాన్ ప్లేస్లో న్యూజిలాండ్, సెమీ ఫైనల్స్కి వచ్చింది.