nvs subramanyam sharma
907 views
2 months ago
రథసప్తమి : మాఘ శుద్ధ సప్తమి తిథి సూర్యజయంతి. అఘము అంటే పాపం. మాఘం అంటే పాపాలను నశింపచేసే శక్తి కలది. మాఘమాసం సూర్యుని మాసం. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తరువాత వచ్చే రథసప్తమి పవిత్రతిథి. సూర్యోపాసనకు అనుకూలమైంది. రథసప్తమినాడు మాఘస్నానం, పొంగలి నివేదనం, అర్ఘ్యం సూర్యసమర్పణంగా చేసినవారికి ఆరోగ్యలాభం చేకూరుతుంది. రథసప్తమినాడు తులసి కోట వద్ద ఆవుపేడతో శుద్ధి చేయాలి. పసుపు కుంకుమలతో అలంకరించిన ముగ్గుల మీద గొబ్బిపిడకలను కుంపటిగా అమర్చాలి. దానిపై కొత్త గిన్నెలో ఆవుపాల పొంగలి వండాలి. ఈ క్రమంలో పాలను మూడుసార్లు పొంగనివ్వాలి. పొంగలి వండిన తర్వాత, చిక్కుడు కాయలతో రథాన్ని తయారుచేసుకోవాలి. చీపురుపుల్లల సహాయంతో చిక్కుడు కాయలను రథాకారంలో గుచ్చాలి. తులసికోట ముందు వేసిన ముగ్గుపై ఆ రథాన్ని ఉంచాలి. ఆ రథం మీదకు సూర్యదేవుని ఆవాహన చేయాలి. రథం ముందు పదిహేను చిక్కుడు ఆకులు పరచి, వాటిలో ఇంతకుముందు వండిన పొంగలి పెట్టాలి. వీటిలో ఐదు ఆకులు అగ్నిదేవునికి, ఐదు ఆకులు తులసీమాతకు, ఐదు ఆకులు నివేదన చేయాలి. ఆదిత్య సంబంధమైన స్తోత్రాలు, అష్టకాలు పారాయణ చేయాలి. సమంత్రకంగా, షోడశ ఉపచారాలతో ఆదిత్యునికి అర్చనలు చేయాలి. రథసప్తమినాడు చేసే పూజల్లో అనేక ప్రాంత, ఆచార భేదాలు కనిపిస్తాయి. కొందరు ఏడు, తొమ్మిది ఆకుల్లో నివేదన పెడతారు. వ్రతరత్నాకరం, ధర్మసింధువు, నిర్ణయామృతం మొదలైన గ్రంథాల్లో రథసప్తమికి సంబంధించి అనేక అర్చన, వ్రత విధానాలు విస్తారంగా వర్ణితమై ఉన్నాయి. ధర్మసింధువు ప్రకారం రథసప్తమికి ముందు రోజు అంటే షష్ఠి రోజున ఉపవాసం ఉండి, మర్నాడు శాస్త్రోకరీతిలో స్నానం చేసి, సప్తమీ వ్రతం చేస్తే ఏడు జన్మల పాపం నశిస్తుంది. రథసప్తమీ వ్రతాన్ని చేయటం వల్ల శారీరక రోగాలతో పాటు, ప్రస్తుత జన్మలోను, గత జన్మల్లోను చేసిన పాపాలు నశిస్తాయని ప్రత చూడామణి చెబుతోంది. మనుస్మృతి ప్రకారం సూర్యారాధన వల్ల శారీరక రోగాలన్నీ నశించి, ఉత్తమమైన ఆరోగ్యం కలుగుతుంది. #🌅శుభోదయం #🌼ఆదివారం స్పెషల్ విషెస్ #🙏🏻ఆదివారం భక్తి స్పెషల్ #🙏రథ సప్తమి💮 #☀️రధ సప్తమి శుభాకాంక్షలు 🙏🙏