చిన్నతనంలో డబ్బుల్లేక తన తండ్రి పడ్డ అనారోగ్య కష్టాలను కళ్లారా చూసిన హైదరాబాద్కు చెందిన నయీమ్ పాషా అనే వ్యక్తి, పేదరికం వల్ల ఎవరూ వైద్యానికి దూరం కాకూడదని 'క్రియా సంఘ్ సొసైటీ' (KSS) అనే పేరుతో ఒక సంస్థను స్థాపించారు. దీని ద్వారా రసూల్పురాలో ఆయన నడుపుతున్న హెల్త్ సెంటర్లో కేవలం రూ. 20లకే డాక్టర్ కన్సల్టేషన్ ను ఇప్పించి, ఉచితంగా మందులు అందిస్తూ, ప్రతి నెలా దాదాపు 3,000 మంది రోగులకు అండగా నిలుస్తున్నారు.
ఇలా కేవలం వైద్యమే కాకుండా, ఇప్పటివరకు 13,400 మంది మహిళలకు వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించడంతో పాటు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషిస్తూ ఆ ప్రాంతానికి ఒక పెద్ద దిక్కుగా మారారు.
#TALRadioTelugu #NayeemPasha #KriyaSanghSociety #KSS #Hyderabad #Rasoolpura #AffordableHealthcare #HealthcareForAll #WomenEmpowerment #SkillDevelopment #CSRIndia #PositiveStories #InspiringIndia #SocialImpact #GoodNews #TALRadio
#💪పాజిటీవ్ స్టోరీస్ #🙆 Feel Good Status #😇My Status