*అలసిన వానిని ఊరడించు మాటలు*
🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞
*సహోదరుడు భక్త సింగ్ గారి* *పరిచర్య నుండి సేకరించిన*
*అనుదిన ధ్యానములు*
🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇
*🌷🌷ఫిబ్రవరి 9🌷🌷*
*"దేశములో కరవు కలుగగా యూదా బేత్లెహేము నుండి..* *మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్లెను"*
*(రూతు 1:1)*
ఇశ్రాయేలు దేశములో అవి ఆత్మీయ చీకటి దినములు. మీరు రూతు గ్రంధము ఆరంభ వచనములను, న్యాయాధిపతులు యొక్క ముగింపు మాటలతో పోల్చి చూచిన యెడల ఆ సమయములో దేశము యొక్క పరిస్థితులను కొంత అర్థము చేసికొనగలరు. "ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు: ప్రతివాడును తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చెను. "దేశములో కరువు ఉన్నప్పుడు నయోమి, ఆమె కుటుంబము ఈ కష్టముల నుండి పారిపోవలెనని తలంచి, మోయాబు దేశమునకు వెళ్లిరి. వారి సమస్యలన్నియు తీరిపోయెను. దేవుని చిత్తమును వేడుకొన వలెనను తలంపు వారికి లేకుండెను. వారు "తమదృష్టికి సరియైనదిగా కనబడు" దాని ద్వారానే నడిపించబడిరి. *నేడు కూడా డబ్బు, లోక సంబంధమైన అభివృద్ధి నిమిత్తము అనేకమంది విశ్వాసులు, దేవుని పిల్లల సహవాసమును నిర్లక్ష్య పెట్టుచున్నారు.* కొంత కాలము వరకు నయోమి మరియు ఆమె కుటుంబమునకు అంతయు బాగుగానే ఉండెను. వారికి బేత్లెహేములో ఉన్నదానికంటే ఎక్కువ ఆహారము అక్కడ కలదు. అయితే మరణము శీఘ్రముగా కుటుంబములోనికి వచ్చెను. మరియు ఇద్దరు కుమారులు మోయాబు స్త్రీలను వివాహము చేసికొనిరి.
*నయోమి యొక్క కుటుంబములోని పతనములన్నిటికి కారణము దేవుని ప్రజల సహవాసమును తృణీకరించి, వారినుండి దూరముగా వెళ్లిపోవుటయే.* దానిని ప్రతి యొక్కరు సులభముగా చూడగలరు. మొదటి నయోమి యొక్క భర్త ఎలీమెలెకు మరణించెను కావున నయోమి విధవరాలయ్యెను. ఆమె తన కుమారులను తన అదుపులో పెట్టుకొనలేకపోయెను. ఆ ఇద్దరు యవ్వనులను సరియైన మార్గములో నడిపుంచుటకు ఏ ఒక్కరును లేనందున వారు మోయాబు స్త్రీలను వివాహము చేసికొనిరి. *మనము దేవుని ప్రజల సహవాసములో ఉన్నదానికంటే ఎక్కువగా ఒంటరిగా ఉన్నప్పుడు శోధనలకు గురియగుదుము. మనము ఇతర విశ్వాసులతో ఉన్నప్పుడు వారి ప్రార్ధన, సహవాసముల ద్వారా బలపరచబడుదుము మరియు శత్రువు యొక్క తంత్రములను ఎదిరించుటకు సిద్ధపరచబడుదుము. కావున దేవుని ప్రజల సహవాసమును ఎన్నడును నిర్లక్ష్యపెట్టకుము.* దేవుని వాక్యమునకు, దైవ నియమములకు అవిధేయత చూపుట ద్వారా వివిధ రకములైన నష్టములు కలుగును మరియు ఇది దుఃఖమునకు దారి తీయును.
దీని తరువాత నయోమి యూదా బేత్లెహేమును గురించి తలంచనారంభించెను. ఈ అన్య దేశములో ఉన్నదానికంటే బేత్లెహేములో తాను ఎంతో మేలుగా ఉండగలనను తలంపు ఆమెకు పుట్టెను. తన స్థలము బేత్లెహేమనియు, దేవుని వాగ్దాన దేశము నుండి వచ్చుట వలన తాను తప్పుచేసెనని ఆమె గ్రహించెను. *మన జీవితములో పతనములు ఏమైనను వాటి విషయమై మనము నిజముగా పశ్చాత్తాపపడి, సంగతులను సరిచేసి కొనుటకు ఇష్టపడినప్పుడు దేవుడు మన పక్షముగా పని చేసి మన పతనములను విజయములుగా మార్చును.* నయోమికి తెలియకుండగానే దేవుడు తెర వెనుక పనిచేయుచుండెను. మోయాబీయురాలైన ఆమె కోడలు, రూతు దేవుని కుమారుడు ఈ లోకమునకు వచ్చుటకు సాధనము కాగల్గెను, తద్వారా ఆయన కృపా మహదైశ్వర్యములు బయలు పరచబడెను. *అయితే ఆయన ఈ విషయములలో ఏదైనను చేయుటకు ముందు నయోమి, దేవుని వాగ్దాన దేశమునకు తిరిగి రావలెను. ఆమె తిరిగి రావలెనని తీర్మానించుకొనిన క్షణమే దేవుడు పనిచేయ నారంభించెను. అదే రీతిగా మన జీవితములో పతనములు ఏమైనను, మనము దేవుని వైపుకు తిరుగుటకు తీర్మానించుకొనిన క్షణమే, ఆయన మన దుఃఖమును సంతోషముగా మార్చును మరియు మన ద్వారా ఆయన కృపా మహదైశ్వర్యములను బయలుపరచును.*
Please share
🙏🏼Praise the LORD.🙏🏼
#📝అనుదిన వాక్యము #⛪దేవుని వాక్యము ✝