#😇My Status #🕉️ శ్రీ భగవాన్ రమణ మహర్షి
ఓం నమో భగవతే శ్రీ రమణాయ
శాస్త్రాలలో చెప్పబడిన విషయాన్ని మహర్షి ఇట్లా వివరించారు ......
మనిషి పొందగలిగిన ఆనందమూ, అలాగే మనిషి కంటే ఉత్తమమయిన పది స్థాయిలలో బ్రహ్మవరకు పొందగల అనంత ఉత్కృష్ట ఆనందమూ - ఆత్మానందంతో పోలిస్తే ఉప్పొంగిపొరలే వరదలోని నురుగులాంటివి.
దృఢమైన ఆరోగ్యం, మంచి యవ్వనం, అత్యధిక ఐశ్వర్యం, అధికారము కలిగి మేధావియై యుండి ఏ కొరతాలేని జీవితం కలిగి, సౌందర్యము, గుణముగల భార్య / భర్త ఉన్న ఒక మనిషి ఆనందాన్ని ఊహించుకో! ఆ మనిషి ఆనందం మొత్తం కలిపి బ్రహ్మానందసాగరంలో పైనతేలే నురుగుతో సమానం.
ఈ సందర్భంగా అవధూత దత్తాత్రేయుల కథను మహర్షి ఇలా సెలవిచ్చారు ...
ఒక రాజు తన సైన్యాన్నీ, పరివారాన్నీ, మందీమార్బలాన్నీ తోడుకొని ఎంతో వైభవంగా
అరణ్యమార్గంలో వెళ్తున్నాడు. దారిలో కౌపీనం మాత్రం ధరించి నేలపై పరుండి కాలుమీదకాలు వేసుకొని ఉన్న ఒక వ్యక్తిని చూచాడు. అతను ఆనంద ఉన్మత్తుడై ఉన్నాడు. అతని ఆనందానికి రాజు ఆశ్చర్యపడి అతనిని తన వద్దకు పిలుచుకొని రమ్మని ఆదేశించారు.
రాజు పరిచారకులు ఆ దిగంబరసాధువు వద్దకు వెళ్ళి రాజుగారి సందేశాన్ని తెలుపగా, అతను వారినేమాత్రం గుర్తించక తన ఆనందంలో తాను మునిగిఉన్నాడు. సేవకులు ఈ విషయాన్ని రాజుకు తెల్పగా, రాజు స్వయంగా ఆయన వద్దకు వెళ్ళాడు. అయినా ఆ వ్యక్తి గుర్తించలేదు. అప్పుడు అతను సాధారణవ్యక్తి కాదని రాజుకు తోచింది.
అప్పుడు రాజుగారు "స్వామీ! తమరు పరిపూర్ణ ఆనందంలో మునిగి ఉన్నట్లు తెలుస్తోంది. మీరుఉన్న యీ స్థితికి గల రహస్యమేమిటి? ఏ గురువు వద్ద మీరు దాన్ని పొందారో దయచేసి తెలుపగలరా!" అని అడిగాడు.
అందుకు ఆ సాధువు "నాకు ఇదివరకు ఇరువది నల్వురు గురువులు. భూమి, ఈ శరీరము, పక్షులు, కొన్ని పరికరాలు, కొందరు వ్యక్తులూ అందరూ నాకు సర్వమూ నేర్పారు. ప్రపంచంలో గల సర్వాన్నీ మంచిదిగానో, చెడ్డదిగానో విభజించవచ్చు. దేనిని గ్రహించవలెనో మంచివి నేర్పాయి. అలాగే దేనిని త్యజింపవలెనో చెడ్డవి నేర్పాయి. అంతే" అని సెలవిచ్చారు.