Ravi Talluri
3.4K views
*_కదంబ వృక్షం............!!_* *హనుమంతుడి* *పుట్టుకకు మూలం ఈ వృక్షం:* *క్రిష్ణుడు గోపికల చీరలను దాచిన చెట్టు :* *ప్రకృతిలో రాధాకృష్ణుల ముచ్చట్లన్నీ ఈ చెట్టు నీడలోనే*:. *పలు రకాల బొమ్మల తయారీకి కూడా ఈ చెట్టు* *చెక్క పనికివస్తుంది*. *భగవద్గీతలో కూడా దీని గురించి ప్రస్తావించారు. రాధాకృష్ణులకు నచ్చే మొక్క ఇది*.. *ఈ చెట్టు నీడలో పరిమళాలను ఆస్వాదిస్తూ* *వారి ప్రేమాయణం కొనసాగిందని,* *అందుకే దీనిని హిందువులు పవిత్రమొక్కగా భావిస్తారని సమాచారం*. *గోపికల చీరలను కృష్ణుడు తీసుకెళ్లి ఈ రుద్రాక్షాంబ చెట్టు మీదే ఉంచినట్టు కూడా మహాభారతంలో ఉందట*. *ఈ చెట్టు 45 మీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ మొక్క పెరిగేందుకు ఓ మోస్తరు నీరే సరిపోతుంది. ఉష్ణ మండల ప్రాంతంలో బాగా పెరిగే లక్షణాలను కలిగి ఉంటుంది.* *ఇది ఆకురాల్చ‌దు.* *ఎప్ప‌టికీ ఆకుపచ్చగా ఉంటుంది*. *నీడను బాగా ఇస్తుంది*. *అడవులలో ఎక్కువ‌గా పెరుగుతుంది.* *దీని పూలు గుండ్రంగా ఉంటాయి.* *దీని పుష్పాల నుంచి అత్తర్లు కూడా తయారు చేస్తుంటారు*. *దీని క‌ల‌ప‌ను బొమ్మల తయారీకి ఉప‌యోగిస్తారు.* *_పురాణాల్లో కదంబ వృక్షం :_* *ఈ కదంబవృక్షానికి పురాణాల్లో రెండు రకాల* *పేర్లు ఉన్నాయి.* *ఉత్తరభారతం లో దీన్ని కృష్ణవృక్షమనీ*, *దక్షిణభారతం లో పార్వతీవృక్షమనీ అంటారు*. *ఈ వృక్షానికి, కృష్ణుడికీ చాలా సంబంధం ఉంది*. *రాధాకృష్ణుల ముచ్చటలు ఈ వృక్షం నీడలోనే జరిగాయంటారు.* *అందుకే కృష్ణవృక్షం అంటారని పురాణాలు చెబుతున్నాయి*. *దక్షిణాదిలో అమ్మవారిని 'కదంబవనవాసిని' అంటారు*. *కదంబ వృక్షానికి 'ఓం శక్తిరూపిణ్యై నమః' అనే మంత్రంతో పూజ చేసినట్లైతే రోగనివారణ జరుగుతుందని చెబుతారు పండితులు*. *గ్రహదోషాలు తొలగించుకోవడానికి అమ్మవారి స్వరూపమైన కదంబవృక్షానికి పసుపు, కుంకుమలు, పూలతో అర్చన చేయాలని, అలా పూజ చేసిన తర్వాత పెరుగన్నాన్ని పార్వతీదేవికి నివేదించాలి.* *హనుమంతుడి పుట్టుకకు మూలం కదంబం..* *అంతేకాదు, సాక్షాత్తు పార్వతీ స్వరూపం ఈ వృక్షం*. *దక్షిణాదిలో అమ్మవారిని 'కదంబవనవాసిని'..* *అలాగే నేటి మీనాక్షి అమ్మవారి ఆలయం ఉన్న ప్రాంతమే కదంబవనం అంటారు*. *ఏది ఏమైనా అన్నాచెల్లెళ్ళు 'నారాయణా నారాయణి' లకూ, ఈ వృక్షానికీ చాలా సంబంధం ఉందని చెబుతారు*. *హనుమంతుడి పుట్టుకకు మూలం కదంబం :* *అమ్మవారిని కదంబ వనవాసిని అంటారు*. *సాక్షాత్తు పార్వతీ స్వరూపం ఈ వృక్షం*. *గార్దబాసురుడు అనే రాక్షసుడు* *పరమేశ్వరుని గురించి తపస్సు చేసి భూమిమీద,* *మనుషులతో, జంతువులతో* *మరణంలేకుండా ఉండాలని* *వరం కోరతాడు*. *శివయ్య తథాస్సు అని అంతర్థానమవుతాడు.* *వరగర్వంతో దేవలోకం చేరి ఇంద్రున్ని తరిమికొడతాడు గార్దబుడు*. *దీంతో దేవేంద్రుడు విష్ణుమూర్తిని వెంట పెట్టుకుని పరమేశ్వరుని చేరతాడు.* *గార్దబాసురుని చంపమని కోరతాడు శ్రీమహావిష్ణువు*. *అయితే తాను వరమిచ్చిన విషయం చెబుతాడు శివయ్య*. *ఆ సమయంలో శ్రీమహావిష్ణువు ఓ సరదా మాట అంటాడు*. *నువ్వు గార్దబాసురుని చంపితే నేను దాసుడిగా ఉంటానంటాడు.* *దానికి శివయ్య నువ్వు గనుక గార్దబాసురుని చంపినట్టైతే నేనే దాసుడిగా* *మారతానని దానికి* *మరో మాట* *కలుపుతాడు* *అయితే మోహినీ రూపంలోకి మారతాడు విష్ణుమూర్తి.* *దక్షిణాన ఉన్న గార్దబాసురుని రాజ్యానికి సమీపంలోని వనానికి చేరతాడు*. *అదే సమయంలో విష్ణువుకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆ వనానికే అందమైన కన్యరూపంలో వస్తుంది పార్వతీదేవి*. *అమ్మవారి అందానికి* *ముగ్దులైన రాక్షసులు* *ఆమె దగ్గరకు* *చేరతారు*. *మరోవైపు మోహినీ అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి ఆకర్షితుడై వెంటపడతాడు కదంబాసురుడు*. *దీంతో కదంబాసురున్ని ఆకాశంలోకి ఎగరేసి*.. *తోడేలు రూపంలోకి మారి సంహరిస్తాడు*. *ముఖం తోడేలు.. మొండెం మనిషి రూపంలో ఉండి…* *పరమేశ్వరుని వరానికి భంగం కలగకుండా చంపుతాడు.* *అలా సంహరిస్తున్న తరుణంలో* *అంతమొందించడానికి కదంబ వృక్షంగా మారి అగ్నిజ్వాలలతో రాక్షసులందరిని సంహరిస్తుంది* *అమ్మవారు.* *దీంతో గార్దబాసురుని సంహారం జరిగిపోయింది*. *అయితే సరదాగా అన్న మాట..మాటే కాబట్టి…* *రామావతారంలో హనుమంతుడిగా మారి శ్రీరామబంటుగా సేవలు అందించాడు శివుడు*. *_జ్యోతిష్య శాస్త్రంలో కదంబం :.._* *ఈ కదంబ వృక్షానికి పూజ చేసినట్లైతే రోగనివారణ జరుగుతుందని చెబుతారు పండితులు*. *జ్యోతిష శాస్త్రం లో నక్షత్రాలు ఒక్కొక్క దానికి* *ఒక వృక్షాన్ని గుర్తించారు.* *అందుచేత నక్షత్రవనం లో కదంబ వృక్షాన్ని* *శతభిష నక్షత్ర స్థానంలో పెంచుతారు*. *గ్రహదోషాలు తొలగించుకోవడానికి అమ్మవారి స్వరూపమైన కదంబ వృక్షానికి పూజ చేయాలి అంటారు. పసుపు, కుంకమలు పూలతో అర్చన చేయాలని చెబుతారు*. *గ్రహదోషాలు ఉన్నవాళ్లు… కదంబ వృక్షానికి* *పూజ చేసిన తర్వాత పెరుగన్నాన్ని పార్వతీదేవికి నివేదించాలి*. *కదంబ వృక్షం మంచి సువాసనతో మత్తెక్కించేటట్లు గా ఉంటాయి కదంబ పూలు*. *గుండ్రని టెన్నిస్ బంతుల ఆకారంలో మొదట్లో ఆకుపచ్చగా తర్వాత పసుపు బంగారు వర్ణంలో తర్వాత తెల్లగాను మారతాయి*. *ఈ పువ్వులు పార్వతి దేవి పూజలు జరిగే* *చైత్ర, ఆషాడ,శ్రావణ ఆశ్వీజ మాసాల్లోనే* *కడిమి పూలు ఎక్కువ పూస్తాయి*. *ఆద్యాత్మిక పరంగానే* *కాక వాణిజ్య పరంగాను* *కడిమి చెట్టు ప్రత్యేకమే*. *ఔషధ పరంగా ఈ కదంబ వృక్షం మనుషులకు ప్రకృతి ప్రసాదించిన వరం అంటారు ఆయుర్వేద వైద్యులు. ఈ చెట్టు ఆకులు షుగర్ వ్యాది నివారణకు ఉపయోగిస్తారు.* #మన సంప్రదాయాలు సమాచారం