sarvathomukhi SATSANGAM
572 views
1 days ago
#😃మంచి మాటలు జిల్లెళ్ల మూడి అమ్మ వాక్యము శ్రీమాత విశ్వ మాత.. శ్రీ చక్రము జిల్లెళ్ల మూడి క్షేత్ర శరీరంలో అమ్మకు మూలాధారమై ,స్వాధిష్టానం లో వున్న పృధ్వీ అగ్ని తత్వాలకు సంకేతమేమెా అనిపిస్తుంది నాగేశ్వరాలయము నా గేంద్రుడు అగ్నితత్వమే. అందువల్లనే నాగేశ్వరాలయము వెలసింది మనకందరికీ వెన్నుపాము వుంటుంది.అదే మనశరీరంలోని నరాలన్నింటికీఆధారము మూలాధారము నుండి సహస్రారము దాకా వున్న గ్రంధులన్నీ ఆ వెన్ను పామును ఆధారము చేసుకొని వున్నాయి.మణిపూర, అనాహతాల స్థానములో హైమాలయము వున్నది. అది వాయు తత్వానికి సంకేతము అందువల్లనే యెాగనిష్ణాతమై వాయు తత్వాన్ని నియంత్రించి సర్వాభీష్టాలు నెరవేరతాయి విశుద్ధి ఆజ్ణా చక్రాల స్థానములో అనసూయేశ్వ రాలయము వున్నది.ఆకాశ తత్త్వాన్ని నియంత్రించి మనోతత్త్వాన్ని ఆక్ర మించి హాకినీ, ఢాకినీ,.శక్తిని మిళితము చేసుకొని అర్ధ నారీశ్వరంగా ,అనసూయేశ్వరుని గా దర్శనము ప్రసాదిస్తూ షోడశ దళ పద్మములో నిలచే సిద్ధ మాతయై మన మనస్సులను నియంత్రిస్తుంది. దక్షిణము నుండి ఉత్తరానికి వరుస గా నాగేశ్వరాలయము, హైమా లయము అనసూయేశ్వరాలయము ఈ మూడింటిని పాలిస్తున్న క్షేత్ర పాలిక సహస్రా రములో నిలచిన శుద్ధ చైతన్య శక్తిఅమ్మ. ఈ మూడు ఆలయాలతో ,నవావరణత విలసిల్లేశ్రీచక్రము జిల్లెళ్ల మూడి అయితే అందులోని బిందు స్థానము అమ్మ. అమ్మ శాంత స్వరూపిణీ యైన విశ్వమాత సర్వతోముఖీ