#🏏క్రికెట్ 🏏 #వైభవ్ సూర్య వంశీ
*'ఏం ఆట బాబూ నీది..' 1 ఫోర్.. 10 సిక్సర్లు.. 283 స్ట్రైక్ రేట్! సూర్యవంశీ ఊచకోత❗*
06.01.2025🏏
ధక్షిణాఫ్రికాలో జరిగిన రెండో వన్డేలో, 14 ఏళ్ల కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ కేవలం 24 బంతుల్లోనే 68 పరుగులు చేసి భారత జట్టుకు 8 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందించాడు.
283 స్ట్రైక్ రేట్తో ఆడిన సూర్యవంశీ, తన మెరుపు బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లను వణికించాడు.
దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత అండర్-19 జట్టు మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. రెగ్యులర్ కెప్టెన్ ఆయుష్ మాత్రేకు విశ్రాంతి ఇవ్వడంతో, ఈ సిరీస్లో భారత జట్టుకు సూర్యవంశీ నాయకత్వం వహిస్తున్నాడు.
24 బంతుల్లో 68 పరుగులు..
నేడు జరిగిన రెండో వన్డేలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు 49.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌట్ అయింది.
246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఓపెనర్గా వచ్చిన కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ మైదానంలో పరుగుల వర్షం కురిపించాడు. కేవలం 24 బంతుల్లో 1 ఫోర్, 10 సిక్సర్లతో చెలరేగిపోయి 68 పరుగులు చేశాడు. కాంతి తక్కువగా ఉన్న కారణంగా (Bad light) ఆట మధ్యలో ఆగిపోయింది. ఆ సమయంలో DLS పద్ధతి ప్రకారం భారత్కు 174 పరుగుల లక్ష్యాన్ని నిర్ణయించారు. భారత జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించి, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3 వన్డేల సిరీస్ను కైవసం చేసుకుంది.
14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కేవలం భారత పిచ్లపైనే బాగా ఆడతాడు అనే విమర్శలకు, దక్షిణాఫ్రికా గడ్డపై తన బ్యాటింగ్తో సమాధానం చెప్పాడు. తక్కువ వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో ఇంతటి దూకుడు ప్రదర్శిస్తున్న సూర్యవంశీ భవిష్యత్తులో భారత సీనియర్ జట్టులో కీలక ఆటగాడిగా మారతాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు