Manasa
571 views
3 days ago
#🌅శుభోదయం #😇My Status #🙆 Feel Good Status #✌️నేటి నా స్టేటస్ శ్రీ గురుభ్యోనమః🙏 🌹పంచాంగం🌹 శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు, తేది ... 31 - 3 - 2026, వారం ... భౌమ్య వాసరే (మంగళ వారము), శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, శుక్ల పక్షం, తిధి : త్రయోదశి ఉ 6.50 వరకు తదుపరి చతుర్దశి నక్షత్రం : పుబ్బ సా 3.19 వరకు తదుపరి ఉత్తర యోగం: గండం మ 3.47 వరకు తదుపరి వృద్ధి కరణం : తైతుల ఉ 6.50 వరకు గరజి రా 6.40 వరకు వర్జ్యం : రా 10.38 - 12.16 వరకు దుర్ముహూర్తం : ఉ 8.25 - 9.14 వరకు రా 10.53 - 11.40 వరకు అమృతకాలం : ఉ 8.54 - 10.30 వరకు రాహుకాలం : మ 3.00 - 4.30 వరకు యమగండం : ఉ 9.00 - 10.30 వరకు సూర్యరాశి : మీనం చంద్రరాశి : సింహం సూర్యోదయం : 6.00 సూర్యాస్తమయం:6.09 *నేటి విశేషం* ఒంటిమిట్ట రామస్వామి వారి కళ్యాణ మహోత్సవం, మహావీర్ జయంతి, రేవతి కార్తె ప్రారంభం రా 10.11 *నేటి మాట* ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మాణేినమః గురుచరిత్ర - 59 నవమాధ్యాయం నామధారకుడు ప్రణుతుడై సిద్ధుని మరలా ఇట్లు అడిగినాడు. కృపానిధి! శ్రీపాదుల వారు కురువపురము నందు ఉన్న సమయంలో జరిగిన కథ పూర్తిగా చెప్పగొరెదను. నామధారకా! ఆ సమయంలో సంభవించిన విశేషములు తెలిపెదను, వినుము. కురువపురములో ఒక రజకుడు శ్రీపాదుల వారికి సేవకుడై ఉండేవాడు. శ్రీపాదుల వారు నిత్యమూ కృష్ణానదిలో స్నానమునకు వెళ్ళుచుండేవారు. త్రిమూర్తులు స్వయముగా కృతార్థులు అయిననూ లోకసంగ్రహమునకై నిత్యమూ స్నానమునకై వెళ్ళుచుండిరి. కృష్ణాప్రవాహ మధ్యమున భక్తకామదులైన శ్రీపాదుల ఒకనాడు స్నానమునకు ఉద్యుక్తులు అయినారు. ఆ నది ఒడ్డు నందే రజకుడు వస్త్రములను ఉతుకుచున్నాడు. భక్తితో స్వామిని చేరి ఆ రజకుడు ప్రతిదినమూ స్వామికి నమస్కారము చేసేవాడు. త్రికాలములందు వాడు శ్రీపాదుల వారికి సాష్టాంగ నమస్కారము అర్పించేవాడు. మనోవాక్కాయములందు భక్తితో రజకుని సేవ ఇలా కొన్ని రోజులు జరిగెను. శ్రీపాద శ్రీవల్లభుల వారు ఆ రజకుని యందు ప్రసన్నులై ఒకనాడు వానితో ఇట్లు పలికిరి. ఓ రజకా! ప్రతిదినమూ ఈ విధముగా నాకు ప్రణామము చేస్తున్నావు, నా నుండి నీవు ఏమి ఆశిస్తున్నావు? భక్తా! నీకు రాజ్యము కావలెనా? ఈ మాటలు గురుదేవుని నోటి నుండి వినిన రజకుడు, తన వస్త్రమును కొంగున ముడి వేసుకొని, చేతులు కట్టుకొని, స్వామీ! మీరే ఈశ్వరులు, సత్యసంకల్పులు. అన్నాడు. అప్పటి నుండి అతడు సంసార చింతన వీడి గురుసేవకుడు అయినాడు. దూరముగా స్వామి వారిని చూసినా దండప్రణాణము ఆచరించువాడు. ఈవిధముగా చాలా కాలము గడిచింది. ఆ రజకుడు ప్రతిదినమూ శ్రీపాదుల వారి నివాసము ముందర ప్రాంగణము తుడిచి, నీరు జల్లి ఉంచేవాడు. ఒకమారు వసంతఋతువున, వైశాఖమాసమందు ఒక యవనరాజు జలక్రీడలు ఆడుచూ, నదీతీరమునకు వచ్చినాడు. ఆభరణాలంకృతలయిన స్త్రీలతో ఆ రాజు స్వయముగా అలంకరించుకొని, జలమధ్యమున నౌకలో విహరించుచున్నాడు. గజతురగ పదాతి దళములు రెండు తీరములందు ఉండిరి. ఆ రాజు రెండు తీరములలో ఉన్న తన సేవకులను నది మధ్యలో నౌకలో నుండి పరికించి చూస్తున్నాడు. కృష్ణా తీరములందు నానావిధములైన వాయిద్యములు మ్రోగుచున్నాయి. రాజు ప్రవాహంలో స్త్రీలతో జలక్రీడలు ఆడుచూ ఉన్న్మత్తుడై ఉన్నాడు. రజకుడు ఆ వాద్య శబ్దమును విని శ్రీగురు చింతనము మాని, కృష్ణానది మధ్యలో ఉన్న రాజును చూస్తూ విస్మయం చెందినాడు. ఈ సంసారమున జన్మించి ఇట్టి సౌఖ్యమును, వైభవమును పొందనిచో జన్మయే వ్యర్ధము. ఈశ్వరుని భక్తులు సేవించినట్లు, వీనిని నానాలంకార భూషితులైన స్త్రీలు సేవించుచున్నారు. ఇతడు ఎట్టి పుణ్యము సంపాదించినాడో కదా! ఈ రాజు గురువు ఎవరో కదా! ఏ దేవుడిని ఇతడు ఆరాధించినాడో కదా! ఇట్టి మహర్దశ వీనికి లభించుట ఏ విధంగా సంభవించినదో కదా! అని మనస్సులో అనుకుంటూ, తిరిగి వచ్చిన శ్రీపాదుల వారిని చూసి దండ ప్రణామాలు ఆచరించినాడు. ఎదురుగా నిలిచినాడు. సర్వం శ్రీపాద శ్రీవల్లభ చరణారవిందమస్తు 🙏