బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
583 views
10 hours ago
ప్లాస్టిక్ వాడకానికి చరమగీతం పాడాల్సిందే - లేకపొతే పర్యావరణానికి,తద్వారా మానవాళికి పెను ముప్పు పొంచి వుంది! లేదా ప్లాస్టిక్ వ్యర్తాల రీ సైక్లింగ్ అత్యంత ఆవశ్యకం - ప్లాస్టిక్ కు గుడ్ బై చెప్పేలా మన కేంద్ర ప్రభుత్వం యావత్తు దేశప్రజల్లో చైతన్యం తీసుకురావాలి! ఇప్పుడు దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా అందరి నోట ఒకటే మాట అదేమంటే ప్లాస్టిక్ వాడకానికి చరమ గీతం పాడాలి అని.ముఖ్యంగా పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ వ్యర్తాలను రీ సైక్లింగ్ చేయడం ద్వారా జపాన్ దేశం అత్యంత విజయవంతం కావడాన్ని మనదేశ వాసులు,కేంద్ర ప్రభుత్వం వారు తప్పనిసరిగా స్ఫూర్తిగా తీసుకోవాలి.ఎందుకంటే టోక్యో 2020 ఒలింపిక్స్ లో ఆ దేశానికే చెందిన ప్లాస్టిక్ వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసి ఒలింపిక్ విజేతలకు పతకాలు తయారు చేసింది అంటే ఆ దేశ ప్రభుత్వం ప్లాస్టిక్ కు ముకుతాడు వేసేందుకు ఎంతటి పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్లిందో మనం ఇట్టే ఊహించవచ్చు.అంతేకాదు ఒలింపిక్స్ లో పాల్గొనే అథ్లెట్ లకు పడుకునేందుకు కార్డ్ బోర్డ్ మంచాలను,వాటిపై పరుపులను సైతం రీసైక్లింగ్ ద్వారా తయారు చేసింది అంటే వారి గొప్ప ప్రయత్నానికి హ్యాట్సాఫ్ చెప్పి తీరాల్సిందే.ఎందుకంటే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఏటా ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్ లో కేవలం గరిష్టంగా పది శాతమే రీ సైక్లింగ్ అవుతుండగా మిగిలినది చెత్త కుప్పల్లో చేరుతున్నది అంటే అలా చేరిన చెత్త కుప్పల వల్ల వాతావరణం కలుషితం అయ్యి అవి గాలి,నీరు,ఆహారం రూపంలో చేరి అవి వివిధ వ్యాధులకు అలంబనగా మారి యావత్తు మానవాళిని కోలుకోలేని విధంగా కాటు వేస్తున్నది అనే మాట సత్య దూరం కాదు.అంతేకాదు మనం ప్లాస్టిక్ ను విపరీతంగా, విచ్చలవిడిగా వాడటం మూలాన ముంచుకొచ్చే భుతాపోన్నతి,వాతావరణ మార్పుల ముప్పును ఎదుర్కోవాల్సిందే అనేదానికి ప్రత్యేక్ష ఉదాహరణ ఇటీవల తీవ్రమైన వరదలు పాకిస్తాన్ ను పలకరించడం,ఈ ఏడాది మొదట్లోను వందేళ్లలో కనివినీ ఎరుగని రీతిలో అమెరికా మంచులో కూరుకుపోయి ఆస్తి,ప్రాణ నష్టం భారీ ఎత్తున సంభవించింది అంటే ఈ అనారోగ్య పరిణామం మూలాననే అనే మాట అక్షర సత్యం.ఓక విధంగా చెప్పాలంటే రీ సైక్లింగ్ చేయడం అంటే అదేమీ పెద్ద పని ఏమి కాదు,అసాధారణ బ్రహ్మ విద్య అంతకన్నా కాదు. ఓక ప్లాస్టిక్ వస్తువు ద్వారా వచ్చే వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసి వేరే వస్తువుగా మనం వాడుకోవడమే.ముఖ్యంగా మన దేశం విషయానికి వస్తే 250 రీ సైక్లింగ్ కేంద్రాలు అవసరం కాగా ప్రస్తుతం దేశంలో దాదాపు 16 ప్లాంట్లు మాత్రమే ఉండటం అవి హైదరాబాద్,అహ్మదాబాద్, సూరత్,థానే, ముంబై, ఢిల్లీ, చండీగడ్,ఇండోర్,విశాఖపట్నం, విజయవాడ తదితర నగరాల్లో మాత్రమే ఉండటం మన దేశానికి సంబంధించి ఓక తీవ్ర లోటు గానే చెప్పాలి.కాబట్టి దేశవ్యాప్తంగా మరికొన్ని పెద్ద,చిన్న నగరాలలో, మున్సిపాలిటీ లలో సైతం రీ సైక్లింగ్ ప్లాంటులు ఏర్పాటు చేస్తే ఈ ప్లాస్టిక్ ద్వారా ఉత్పన్నం అయ్యే వ్యర్తాల బెడద తొలగి యావత్ మానవాళి ఉన్నంతలో ఆరోగ్యకరమైన,సుఖప్రదమైన జీవితం గడిపేందుకు నూటికి నూరుపాళ్ళు అవకాశం ఉంటుంది. ఏదిఏమైన పట్టాపగ్గాలు లేకుండా తరుముకొస్తున్న ప్లాస్టిక్ భూతానికి సంకెళ్లు వేయాలంటే,దాని భరతం పట్టాలంటే మాత్రం ముందు మన కేంద్ర ప్రభుత్వం యొక్క ఆరోగ్య శాఖకు చెందిన అధికారులు యావత్ మన దేశ ప్రజానీకంలో ఈ ప్లాస్టిక్ మహమ్మారికి పూర్తి స్థాయిలో గుడ్ బై చెప్పేలా ఓక యుద్ధప్రాతిపదికన చైతన్యం తీసుకురావాలి. ఏమైనా ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు వేయడం వల్ల ఎంతటి పెను ముప్పు పొంచి వుందో ముందుగా ప్రతి ఒక్క దేశప్రజానీకం వివేకంతో, పరిణతితో ఆలోచించి తదనుగుణంగా ప్రత్యేకంగా కేటాయించిన ఏదో ఓక స్థలంలో మాత్రమే ఆ వ్యర్థాలను ఉంచగలిగితే రీ సైక్లింగ్ చేయడానికి బాగా అవకాశం ఏర్పడి ఈ ప్లాస్టిక్ భూతానికి మన శరీరం వ్యాధిగ్రస్తం పాలు కాకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి ఓక ఆయుధం లా ఈ రీసైక్లింగ్ వ్యవస్థ ఉపయోగపడుతుంది అనడంలో ఎలాంటి సందేహానికి తావులేదు. రీ సైక్లింగ్ వ్యవస్థకు జై కొట్టాలి!ప్లాస్టిక్ భూతాన్ని నామ రూపాల్లేకుండా తరిమి కొట్టడం మన బాధ్యతగా ప్రతి ఒక్క దేశప్రజానీకం భావించి అందుకు ఎనలేని చిత్తశుద్ధి తో పాటుపడాలి! - బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #🔊తెలుగు చాట్‌రూమ్😍