kumarsingh
507 views
16 days ago
స్కూటీని కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన డీసీఎం.. మహిళ మృతి... హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో మైండ్ స్పేస్ సమీపంలో రాత్రి స్కూటీపై వెళ్తున్న దంపతులను డీసీఎం వాహనం ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత డ్రైవర్ ఆగకుండా స్కూటీని కిలోమీటర్ మేర ఈడ్చుకెళ్లాడు. ఈ దుర్ఘటనలో ఆయేషా అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె భర్త తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేరళకు చెందిన ఈ దంపతులు మహేశ్వరం సమీపంలో నివసిస్తూ మలబార్ గోల్డ్‌లో పనిచేస్తున్నారు. ప్రమాదం తర్వాత డీసీఎం డ్రైవర్ పరారయ్యాడు. స్థానికులు క్లీనర్‌ను పట్టుకుని చితకబాదారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు... #🆕Current అప్‌డేట్స్📢 #📸 వీధి ఫోటోగ్రఫీ