బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
626 views
12 days ago
వందే భారత్ ఎక్ష్ప్రెస్ లా శరవేగంగా దౌడు తీస్తున్న మన జననేత వైఎస్ జగనన్న గారి సారథ్యంలోని వైస్సార్సీపీ పార్టీ యొక్క ఫ్యాను గాలి స్పీడ్ కు రాబోయే 2029 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ వారి గుర్తు అయిన సైకిల్ అదుపుతప్పి చతికిల పడటం తథ్యం! ఇసుక వేస్తే రాలనంత జనం తండోపతండాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మన వైఎస్ జగనన్న గారి ప్రతి సభకు తరలివస్తుంటే అధికార కూటమి పార్టీ నాయకులు దిక్కుతోచక,ఈ ప్రజా చైతన్యాన్ని చూసి వారి రోమాలు నిక్కబోడుచుకుంటున్నాయి అనే మాట సత్య దూరం కాదు! చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు కుల,మత, వర్గ,ప్రాంతాలకు అతీతంగా అందరి నోటి వెంట ఒకటే మాట జై జగన్! జై జై జగన్! ముఖ్యంగా మన జనసంక్షేమ నేత వైఎస్ జగనన్న గారు తన గత వైస్సార్సీపీ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల నుంచి బాగా లబ్ది పొందిన ప్రతి సామాన్యుడు కూడా మన వైఎస్ జగనన్న గారి సభలకు నీరాజనాలు పడుతున్నారు, ఆయన మాట్లాడే ప్రతి మాటకు తమ దైన శైలిలో చప్పట్లతో హోరేత్తిస్తున్నారు, ఆయనను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు! ఒక విధంగా చెప్పాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంతా ఫ్యాను గాలి చాలా బలంగా వీస్తున్నది అనే దానికి నిదర్శనమే వైయస్ జగనన్న గారు పాల్గొనే ప్రతి సభకు లక్షలాది మంది ప్రజలు తరలివస్తున్న ఓ ఆసక్తికరమైన ఘట్టం మనందరి కళ్ళముందు సాక్షాత్కారిస్తూనే వుంది.అయితే సింహం సింగిల్ గానే వస్తుంది అన్నట్లుగా మన జనహృదయనేత వైఎస్ జగనన్న గారు సింహంలా గర్జన చేస్తుంటే మరో వైపు చిన్న, చితక పార్టీ లు అయిన 5 పార్టీలతో కూడిన చంద్రన్న సేన మంది మార్భాలంతో,హంగు ఆర్భాటాలతో ఒక పెద్ద ఆవుల మందలా తయారు అయ్యి సింహం రూపంలో మన వైఎస్ జగనన్నతో పోరు సల్పుదాం, పోరాటానికి సై అంటూ మేకపోతూ గాంబీర్యాన్ని ప్రదర్శిస్తుంది తప్ప జన బలం ఎవరికి ఎంత వుంది అనే వాస్తవాన్ని కనిపెట్టడంలో మాత్రం వారు నూటికి నూరుపాళ్ళు వైపల్యం చెందుతున్నారు,ఒక విధంగా వాస్తవానికి తమ బలం ఎంతో చూసుకోకుండా చాలా గుడ్డిగా వారు గాలిలో మేడలు కడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు అనే మాట సత్యదూరం కాదు. ఏదిఏమైన ఇరు పార్టీల మధ్య ఎలక్షన్ల సమరానికి ఇంకా మూడేళ్ళ వ్యవధి వున్న నేపథ్యంలో తమ పార్టీలకు ఘనవిజయం సాధించిపెట్టేందుకు ఇరు పార్టీల నాయకులు అంటే ఒక వైపు వైస్సార్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగనన్న గారు మరో వైపు పొత్తులతో కూడిన టీడీపీ కూటమి పార్టీ ఆదినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు సర్వశక్తులు ఒడ్డుతున్న నేపథ్యంలో,అమితుమీ తేల్చుకొనేందుకు ఇద్దరు కాకలు తీరిన యోధులు ప్రజాకోర్టు వంటి బోనులో ప్రవేశించి మరొమారు ప్రజాతీర్పు కోసం వేచి వున్నారు. కానీ ఈసారి ప్రజాతీర్పులో అంటే రాబోయే 2029 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా మరొమారు విజయభేరి మ్రోగించి,అశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అపూర్వ మద్దతుతో ఆఖండ విజయాన్ని వైఎస్ జగనన్న గారు తన సొంతం చేసుకోవడం తథ్యం.జై జగన్! జై జై జగన్!✍️✍️✍️ - మధుసూదనరెడ్డి బుగ్గన,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు, #ysr