నా💝అమ్మే👩‍👦నా కనిపించే 🙏దైవం💝
936 views
13 hours ago
#✍️నేటి నుంచి టెన్త్ పరీక్షలు..తప్పక పాటించాల్సిన సూచనలు నేటి నుంచే పదో తరగతి పరీక్షలు.. విద్యార్థులకు సూచనలివే.. ఇంటర్నెట్ డెస్క్: నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్ష సమయం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటుంది(కొన్ని పేపర్లకు 12:50 వరకు). రాష్ట్రవ్యాప్తంగా 5,28,239 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. వీరికోసం మొత్తం 2,676 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే.. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, తల్లిదండ్రులు తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు, సూచనలు కొన్ని ఉన్నాయ్. అవేంటంటే... విద్యార్థులు పాటించాల్సిన నియమాలు: పరీక్షా కేంద్రానికి వెళ్లేటప్పుడు విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్‌ను వెంట తీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డ్ లేనిదే పరీక్షకు అనుమతించరు. పరీక్ష ప్రారంభ సమయానికి కనీసం 30 నుంచి 45 నిమిషాల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఆలస్యంగా వెళ్తే అనుమతి ఉండకపోవచ్చు. విద్యార్థులు.. పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్, షార్ప్‌నర్ వంటి స్టేషనరీని సిద్ధంగా ఉంచుకోవాలి. అనవసరమైన కాగితాలు లేదా ఎలక్ట్రానిక్ గూడ్స్‌కు అనుమతి ఉండదు. పరీక్షా హాలులో ఇచ్చే ఓఎంఆర్ షీట్, జవాబు పత్రంపై విద్యార్థుల వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఎక్కడా తప్పులు దొర్లకుండా జాగ్రత్తగా నింపాలి. ఓఎంఆర్‌లో కొట్టివేతలు, వైట్‌నర్ వంటివి వాడేందుకు వీలుండదు. ప్రశ్నాపత్రం ఇవ్వగానే ప్రశాంతంగా అన్ని ప్రశ్నలను ఒకసారి చదువుకోవాలి. బాగా తెలిసిన సమాధానాలను ముందుగా రాయడం ఉత్తమం. ఆ తర్వాత మిగిలిన ప్రశ్నలకు జవాబులు రాసుకుంటూ పోవాలి, సమయపాలన తప్పనిసరిగా పాటిస్తూ.. అన్ని ప్రశ్నలకు సరైన విధంగా సమాధానం రాసేలా చూసుకోవాలి. తల్లిదండ్రులకు సూచనలు: తల్లిదండ్రులు పిల్లలపై అనవసరమైన ఒత్తిడి పెంచకుండా వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. ఇతరులతో పోల్చకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాసేలా ప్రోత్సహించాలి. పరీక్షల సమయంలో విద్యార్థులకు తేలికపాటి, మంచి పోషక విలువలున్న ఆహారాన్ని అందించాలి. పిల్లలు తగినంత నిద్రపోతున్నారా లేదా అనేది గమనిస్తూ ఉండాలి. ఇక.. పరీక్షా కేంద్రం ఎక్కడుందో ముందుగానే తెలుసుకుని, రోజూ వెళ్లొచ్చేందుకు రవాణా ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలి. నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ పరీక్షలు రెగ్యులర్ విద్యార్థులకు ఏప్రిల్ 13 వరకు, ఒకేషనల్ విద్యార్థులకు ఏప్రిల్ 16 వరకు జరగనున్నాయి.

More like this