భారీగా బంగారం,
వెండి చోరీ
టీడీపీ ఎమ్మెల్యే తల్లి ఇంట్లో ఘటన.
పొన్నూరు: మండలంలోని చింతలపూడిలో
ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ తల్లి
ప్రమీలా దేవి ఇంటిలో భారీ చోరీ ఘటన చోటుచేసుకుంది. భారీగా బంగారం ఆభరణాలు, వెండి, నగదు అపహరణకు గురైనట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. రూరల్ ఎస్ఐ శ్రీహరి తెలిపిన వివరాలు.
ఇంట్లో ఎవరూ లేని సమయం లో అర్ధరాత్రి దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి, బీరువాలోని 42 సవర్ల బంగారం, పదిన్నర కిలోల వెండి, రూ.లక్ష నగదు అపహరించినట్టు తెలిపారు. చోరీ చేసిన సొత్తు విలువ సుమారు రూ.80లక్షల వరకు ఉండవచ్చని చెప్పారు. ఘటనా స్థలాన్ని రూరల్ సీఐ కృష్ణయ్య పరిశీలించి కేసు నమోదు చేశారు. క్లూస్ టీం చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. డాగ్ స్క్వాడ్ పరిసరాలను పరిశీలించింది.
#🆕షేర్చాట్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్