#😇My Status #🕉️ శ్రీ భగవాన్ రమణ మహర్షి
ఓం నమో భగవతే శ్రీ రమణాయ🙏🏻
భక్తుడు :
భగవాన్! ఇంద్రియ భోగాల్లోకన్నా, ధ్యానంలో సుఖము ఎక్కువ. అయినా మానవులు భోగాలవైపే పరుగెత్తుతూ, ధ్యానాన్ని వదలి వేస్తున్నారు. ఎందుచేత?
మహర్షి :
సుఖదుఃఖాలు మనస్సు కల్పించేవి మాత్రమే. మన సహజ స్వభావం ఆనందం. కాని మనం ఆత్మను మరచి పోయాము. శరీరాన్నో లేక మనసునో ఆత్మ అని భ్రమ చెందుతున్నాము. ఆ భ్రమే దుఃఖాన్ని కలిగిస్తుంది. ఏమి చేయడం?
వాసనలు(కోరికలు) ఎప్పటినుండో అనేక జన్మలుగా వస్తున్నవి. అందుచేత ఆ కోరికలు బలపడ్డవి. సహజ స్థితి అంటే ఆనందం. ఆనందం కావాలంటే కోరికలు పోయి తీరాల్సిందే.