GMTV TELUGU NEWS CHANNEL
4.6K views
2 days ago
ముస్లిం-క్రిస్టియన్లకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి ముస్లిం-క్రిస్టియన్ల సామాజికసదస్సులో నేతల తీర్మానం బలపరిచిన బహుజనసేనా రాష్ట్ర అధ్యక్షులు శ్రీచందు అమరావతి 17జనవరి2026 (ఉత్తరప్రభ) భారతదేశంలో మత విద్వేషాలు రెచ్చిపోతున్నాయని, ఒక వ్యక్తి మరో వ్యక్తిపై ఒక మతం మరో మతంపై అనేక రూపాల్లో దాడులు పెరుగుతున్నాయని, ఈ దాడులు అరికట్టడానికి ప్రత్యేక రక్షణ చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని బహుజనసేనా ఆధ్వర్యంలో మదనపల్లిలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగిన ముస్లిం క్రిస్టియన్ల సదస్సులో బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీచందు గారు ప్రభుత్వాన్ని కోరారు. వీరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లింలు క్రిస్టియన్ల సంఘ పెద్దలు పాల్గొన్నారు, వీరు మాట్లాడుతూ మతపరంగా కొన్ని హిందూ మత సంస్థలు పనిగొట్టుకొని మరి మా మనోభావాలపైన, మా వ్యక్తిత్వాల పైన మా దేవాలయాల పైన, మా సాంప్రదాయాల పైన, మా ప్రార్థనల పైన దాడులు జరుగుతున్నాయని వాటిని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని కచ్చితంగా మాకు మతపరమైన రక్షణ చట్టాలు అవసరమని వీరు ఆవేదన చెందారు. ఈ సభలో చాలా సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన సభ్యులు పాల్గొన్నారు, దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్లో భాగంగా మతపరమైన వ్యతిరేకత ఎక్కువవుతుందని ఇది దేశ ఔన్నత్యానికి, భారత రాజ్యాంగ మూల స్తంభ లౌకిక తత్వానికి భంగం వాటిల్లేలా ఉందని ఈ మతపరమైన దాడులు నివారించడానికి ప్రత్యేక రక్షణ చట్టాల అవసరమని, ఇప్పటికే కర్ణాటక తెలంగాణ ప్రభుత్వాలు అటువైపు నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తున్నాయని వీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గుర్తు చేశారు. సభ ప్రారంభానికి ముందు భారత రాజ్యాంగ పీఠికకు వందన ప్రమాణం అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్రిస్టియన్ ముస్లిం నాయకులు మాట్లాడుతూ.. మన మతపరమైన గ్రంథాలకు, మన మత స్వాతంత్రపు హక్కులకు, మన స్వేచ్ఛకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 నుండి 28 వరకు పొందుపరిచారని ఈ హక్కుల పట్ల ప్రభుత్వ అధికారులు, మత పెద్దలు సరైన అవగాహన పెంచుకొని మనపై జరుగుతున్న దాడులను రాజ్యాంగబద్ధంగా తిప్పి కొట్టాలని కొట్టాలని వీరు సభకు తెలియజేశారు. సిపిఎం నాయకులు కృష్ణప్ప శ్రీనివాసులు మాట్లాడుతూ... ఆర్ఎస్ఎస్,బిజెపి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుందని వీరిని అడ్డం పెట్టుకొని హిందూ మత సంస్థలు అంబేద్కర్రిస్టులు, కమ్యూనిస్టులు పైన దాడులకు పాల్పడుతూ క్రిస్టియానిటీలో, ముస్లింలలోఉన్న పేద వర్గాల పైన మతపరమైన దాడులు చేస్తూ.. దేశంలో నిరుద్యోగం, ప్రైవేటీకరణ, రాజ్యాంగం మీద దాడులు హెచ్చు మీరెలా చేస్తున్నారని మీరు విమర్శించారు. అస్సాంలో క్రిస్టియానిటీ మీద దాడులు, ఢిల్లీ కేంద్రంగా ముస్లింల పైన, #✌️నేటి నా స్టేటస్ యూనివర్సిటీల కేంద్రంగా అంబేద్కర్ విద్యార్థుల సంఘాల పైన, సోషల్ మీడియా కేంద్రంగా ఫేక్ అకౌంట్ లతో మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతూ దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారి పట్ల కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకురావాలని అందుకు అన్ని రాజకీయ పార్టీలు ముందుకొచ్చి రక్షణ చట్టాలు బలంగా అమలు చేయాలని వీరు డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం పైన జరుగుతున్న దాడులను,ఈ మతపరమైన దాడులను తిప్పి కొట్టడానికి, ఎస్సీ,ఎస్టీ,బీసీ క్రిస్టియన్ ముస్లిం ఏకతాటు పైకి వచ్చి బహుజన రాజ్య పోరాటానికి సిద్ధమవుతామని వీరు హెచ్చరించారు. ముస్లిం క్రిస్టియన్ జనాభా నిష్పత్తి ప్రకారం అన్ని రంగాల్లో విద్య, ఉద్యోగ, మరియు రాజకీయ రిజర్వేషన్లను అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని, జరగబోవు జనాభా లెక్కల లో భాగంగా ముస్లిం క్రిస్టియన్ల సమగ్ర జనగణనకు ప్రత్యేక కమిషన్ తో జనగణన ఏర్పాటు చేసి, ప్రక్క రాష్ట్రాల్లో జరిగిన తప్పిదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వీరు ప్రభుత్వానికి జాగ్రత్త తెలిపారు. భవిష్యత్తులో చలో విజయవాడ పేరుతో ఈ మతపరమైన, భారత రాజ్యాంగం పైన జరుగుతున్న దాడులు పట్ల పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని వీరు తెలియజేశారు. ఈ సదస్సులో ముస్లీం ఐక్యవేదిక సయ్యద్ కలిల్ అహ్మద్,షమీమ్ అస్లామ్,మొహ్మద్ సలీమ్ భాష,మీమ్ సేన పీరు,ఖాజ హుసేన్ గుండ్లూరు రఫీ, మహ్మద్,సి ఎస్ ఐ రాయలసీమ అడ్మినిస్ట్రేషన్ ప్రశాంత్,రాయలసీమ జనరల్ సెక్రటరీ ఆనంద్,ముబుక మాథ్యూ,గ్లోరి ఫాస్టర్స్ ఫెలోషిప్స్ బి.జోహన్ బాబు,నాగరాజు,భక్తవాచలం,రతీష్,డేవిడ్,బహుజన సేన నాయకులు జయశంకర్, రాగవేంద్రయాదవ్ మనోహర్ రెడ్డి,భాను ప్రకాష్,రెడ్డిశేఖర్,వెంకటేష్,సయ్యద్ మరియు కుప్పం,అనంతపురం,కడప,రాయచోటి,రైల్వే కోడూరు,పీలేరు,వాయల్పాడు,చిత్తూరు వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ముస్లీం, క్రిష్టియన్ నాయకులు పాల్గొన్నారు.