హరికృష్ణ ఆచార్య
499 views
14 hours ago
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 #మఘా శుద్ధ తదియ - శ్రీ మార్కండేయ మహర్షి జయన్తీ* --------------------------------------- *_శ్రీ మార్కండేయ మహర్షి_* --------------------------------------- *మార్కండేయుడు మృకండు మహర్షి యొక్క సంతానం. బాలుని గానే యముని జయించి, శివుని ఆశీస్సులతో చిరంజీవత్వాన్ని పొందిన సద్గుణుడు.* ------------------------------------- *పూర్వం మృకండుడనే బుుషి పుంగవుడు వుండేవాడు.* --------------------------------------- *జంతువులు తమ శరీరంపై నున్న దురద తీర్చుకోవటానికి రాళ్ళకేసి రుద్దుకొంటాయి. ఇలా శరీరాన్ని రుద్దుకోవటాన్ని మృకండ మంటారు.* --------------------------------------- *మృకండ మహర్షి ఘోరతపస్సులో వుండగా ప్రకృతిని మరచి శిలలా మారి ఉంటాడు. అలా శిలలా నిశ్చేష్టుడైన ఆ బుుషి శరీరాన్ని దురదపోవటానికి అడవిజంతువులు రాపిడి చేయడం వలన ఇతనికి మృకండుడనే పేరు సార్థకమైంది.* --------------------------------------- *ఇతని భార్యపేరు మరుద్వతి. భర్తకు తగ్గ ఉత్తమఇల్లాలు.* --------------------------------------- *ఎన్నాళ్ళకు సంతానం కలుగకపోవడంతో మృకండ మహముని కాశీ క్షేత్రానికి వెళ్ళి శంకరుని గురించి తపస్సు చేస్తాడు. అతని తపోనిష్ఠకు సంతసపడిన శివుడు ప్రత్యక్షమై అతనిని పరీక్షింపదలచి 'మృకండా నీకు సకల దుర్గుణాలు కలిగి చిరంజీవి యైన కొడుకు కావాలో? లేక సకల సద్గుణాలసంపద కలిగి కేవలం 16 సం॥ మాత్రమే జీవించగల కొడుకు కావాలో కోరుకోమంటాడు.* ------------------------------------ *అందుకు ఆ మహాముని లోకహాని కలిగించే చిరంజీవియైన కుమారుడి కంటే కొన్నాళ్ళు జీవించినా ఉత్తముడైన కొడుకు మేలని తలచి అల్పాయుష్కుడైన సంతానాన్ని ప్రసాదించమని కోరుకొంటాడు.* --------------------------------------- *మహదేవుడు నీకు త్వరలో పుత్రసంతానం కలుగుతుందని వరమిస్తాడు. అలా శంకర వరప్రసాదంచే జన్మించినవాడే మార్కండేయుడు.* -------------------------------------- *మృకండుని కొడుకు కాబట్టి మార్కండేయుడిగా పిలవడం జరిగింది.* ------------------------------------- *అతనికి 7 సంవత్సరాలు నిండిన తరువాత ఉపనయనం ఆపైన సకల విద్యలు నేర్పడం జరిగింది.* ------------------------------------ *మృత్యు సమీపకాలం దగ్గర పడినపుడు మహాదేవుడిని ఆశ్రయించమని మార్కండేయునికి బ్రహ్మ సూచించడం జరుగుతుంది.* ------------------------------------- *బ్రహ్మదేవుని సలహా మేరకు మార్కండేయుడు శివాలయం చేరి గర్భగుడిలోని శివలింగాన్ని అర్చించడం మొదలు పెడతాడు.* ------------------------------------ *ఇలా పదమూడు రోజులు గడచిన అనంతరం 14 రోజున యమభటులు మార్కండేయుడి ప్రాణాలను హరించటానికి వస్తారు.* ------------------------------------- *శివాలయంలో మహాతేజస్సుతో వెలిగిపోతున్న ఆ బాలుడిని చూచి కింకరులు భయపడి వెనక్కు వెళ్ళిపోతారు.* ------------------------------------- *గడువులోగా జీవుల ప్రాణాలను తీయాలి కనుక విధిలేక యముడే మార్కండేయుడి ప్రాణాలు హరించటానికి బయలుదేరాడు.* ----------------------------------- *మార్కండేయా! జాతస్య మరణం దృవమ్ అన్నసంగతి సకల శాస్త్రాలను అభ్యసించిన నీకు తెలియదా ! కనుక శివాలయ గర్భగుడినుండి బయటకు రా నీ జీవాన్ని తీసుకువెళతానని యముడు చెపుతాడు.* --------------------------------------- *అలా సమవర్తికి మార్కండేయుల మధ్య పెద్ద సంవాదమే జరుగుతుంది.* -------------------------------------- *కోపిష్టుడైన యముడు గర్భగుడిలోనికి పాశాన్ని విసురుతాడు. అదే సమయంలో మహాదేవా రక్షించమని మార్కండేయుడు శివలింగాన్ని కౌగిలించుకొంటాడు.* --------------------------------------- *శివలింగాన్ని కౌగిలించుకొన్న మార్కండేయుడిపై యమపాశం పడగానే శంభులింగం మహాశబ్దంతో బ్రద్దలై శివుడు మహాకాలుడై త్రిశూలంతో పాశాన్ని తొలగించి యముడిని తీక్షణదృక్కులతో చూస్తాడు.* -------------------------------------- *యముడు క్షమించమని కోరుతాడు. అంతట మహాశివుడి శాంతించి యముడిని క్షమించి మార్కండేయుడికి సంపూర్ణ ఆయుష్సును ప్రసాదిస్తాడు.* ------------------------------------ *ఇలా మార్కండేయుడు చిరంజీవిగా జీవిస్తాడు.* ---------------------------------------------------------------------------- *చిరంజీవుడైన శివభక్తుడు మార్కండేయుడు* --------------------------------------- *మార్కండేయ జయంతి సందర్భంగా...* --------------------------------------- *చిరంజీవుడైన - శివభక్తుడు -మార్కండేయుడు!* ------------------------------------ *శివభక్తుల గురించి తల్చుకోగానే మార్కండేయుడి పేరు వెంటనే స్ఫురిస్తుంది, పిల్లల్లో భగవంతుడి పట్ల విశ్వాసాన్నీ, అనుకున్నది సాధించడంలో చూపాల్సిన పట్టుదలనీ పెంచేందుకు మార్కండేయుడి కథను ఆదర్శంగా చెబుతారు,* *కార్తీక మాసాన కూడా ఆ మార్కండేయుని కథ మరొక్కసారి, వింటూ ఉంటారు, భక్తులు, అపమృత్యు భయం లేకుండా ఉండడం కోసం .* --------------------------------------- *అనగనగా మృకండుడు అనే రుషి ఉండేవారు, మృకండుడు శివుని గురించి ధ్యానం చేసుకునే సమయంలో మృగాలు అతడిని రాసుకుంటూ పోయినా కూడా పట్టించుకునేవాడు కాదట, అలాంటి మృకండునికి మరుద్వతి అనే సాధ్వి భార్యగా ఉండేది, భగవన్నామస్మరణలో హాయిగా జీవితాన్ని గడుపుతున్న ఆ దంపతులకి ఒకటే లోటు, వారికి పిల్లలు లేరు! సంతానభాగ్యం కోసం వారిద్దరూ వారణాశి క్షేత్రానికి చేరుకుని శివుని పూజించడం మొదలుపెట్టారు, ఆ దంపతుల దీక్షకు మెచ్చిన శివుడు వారి ముందు ప్రత్యక్షం అయ్యాడ, కానీ ఆ పరమేశ్వరునికి వారిని పరీక్షించాలని అనిపించిందో ఏమో… మీకు తప్పకుండా పుత్రసంతానాన్ని ప్రసాదిస్తాను, కానీ ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి. సుదీర్ఘకాలం జీవించే దుర్మార్గుడు కావాలా లేకపోతే పదహారు సంవత్సరాలు మాత్రమే జీవించే గుణవంతుడు కావాలా?అని అడిగాడు, వ్యక్తిత్వం లేనివాడు ఎన్ని రోజులు ఉంటే మాత్రమేం, మాకు గుణవంతుడైన అల్పయుష్కుడే కావాలి అని కోరుకున్నారు మృకండుని దంపతులు.* --------------------------------------- *అచిరకాలంలోనే. ఆ దంపతులకు వెలుగురేఖలాంటి ఓ బాలుడు కలిగాడు, మృకండుని కుమారుడు కాబట్టి అతనికి మార్కండేయుడు అన్న పేరు వచ్చింది, శివుని మాటలకు తగినట్లుగానే మార్కండేయుడు సకలగుణాభిరాముడు! బాల్యం తీరకుండానే సకల శాస్త్రాలనూ ఔపోసన పట్టాడు మార్కండేయుడు, మరో పక్క వ్యక్తిత్వంలోనూ తనకు సాటి లేదనిపించుకున్నాడు, ఇలా ఉండగా ఓసారి మృకండుని ఆశ్రమానికి సప్తరుషులు వచ్చారు, మార్కండేయుని చూడగానే అతనికి త్వరలోనే ఆయుష్షు తీరనుందని వారికి అర్థమైంది, మార్కండేయుని బ్రహ్మదేవుని వద్దకు తీసుకుపోయారు సప్తరుషులు, మార్కండేయుని చూసిన బ్రహ్మ, అతడిని నిరంతరం శివారాధన చేస్తూండమని సూచించాడు. అందరూ కలిసి, శివనామస్మరణ చేత అకాలమృత్యవు దరిచేరదని మార్కండేయునికి తెలియచేశారు.* ------------------------------------ *పెద్దల మాటల మేరకు ఒక శివలింగం ముందర కూర్చుని శివధ్యానాన్ని మొదలుపెట్టాడు మార్కండేయుడు, ఒకపక్క అతని మృత్యుఘడియలు సమీపిస్తున్నాయి, మరో పక్క నోటి నుంచి శివనామస్మరణ ఆగడం లేదు సరికదా ఒకో నిమిషం గడిచేకొద్దీ మరింత జోరుగా సాగుతోంది, యముని ఆదేశం మేరకు మార్కండేయుని తీసుకురావడానికి బయల్దేరారు యమభటులు, కానీ మార్కండేయుని తీసుకురావడం కాదు కదా! అతని దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయారు, ఇక ఆ పిల్లవాడిని తానే స్వయంగా తీసుకురావాలనుకున్నాడు యముడు, తన వాహనమైన మహిషాన్ని అధిరోహించి, యమపాశాన్ని చేతపట్టి మార్కండేయుని వైపు సాగిపోయాడు, ఆ ధ్యానాన్ని ఆపి ఇవతలికి రా! నీమృత్యువు సమీపించింది`అని హుంకరించాడు యముడు, కానీ యముని మాటలను విన్న మార్కండేయుడు ఇవతలికి రాలేదు సరికదా, గట్టిగా ఆ శివలింగాన్ని పట్టుకుని మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం మొదలుపెట్టాడు.* --------------------------------------- *ఇక యమునికి. ఏం చేయాలో దిక్కుతోచలేదు, ఆఖరి ఆస్త్రంగా తన పాశాన్ని మార్కండేయుని మీదకు వదిలాడు, కానీ మార్కండేయునితో పాటుగా ఉన్న శివలింగానికి ఆ పాశం తగలగానే శివుడు కాలరుద్రుడై బయటకు ఉరికాడు. తన మీదకీ, తన భక్తుని మీదకీ పాశాన్ని విడుస్తావా అంటూ యముడిని ఒక్కపెట్టున సంహరించాడు. ఆసందర్భంలోనే శివునికి `కాలాంతకుడు అనే బిరుడు వచ్చింది, అంటే కాలాన్ని / మృత్యువుని సైతం అంతం చేసినవాడు అని అర్థం,కానీ యుముడే లేకపోతే ఈలోకంలో చావుపుట్టుల జీవనచక్రం ముందుకు సాగేదెలా! అందుకని దేవతలందరి ప్రార్థన మేరకు శివుడు శాంతించి తిరిగి యముడిని జీవింపచేశాడు,అయితే మార్కండేయుని జోలికి అతను ఇక రాకూడదనీ, ఆమాటకు వస్తే శివభక్తులు ఎవ్వరినీ కూడా నరకానికి తీసుకుపోకూడదనీ హెచ్చరించి వదిలివేశాడు పరమేశ్వరుడు,ఈఘట్టం తమిళనాడులోని `తిరుక్కడయూర్‌ అనే ప్రాంతంలో జరిగిందని, ఓ నమ్మకం, కార్తీక మాసంలో ఈ ఆలయంలో విశేషమైన పూజలు జరుగుతాయి, మార్కండేయుడు అప్పటి నుంచి చిరంజీవిగా ఉండటమే కాకుండా, అష్టాదశ పురాణాలలో ఒకటైన మార్కండేయ పురాణాన్ని కూడా రాశాడు, శివకేశవుల లీలలే కాకుండా దేవీమాహాత్మ్యం కూడా లోకంలో నిలిచిపోయేలా. ఈ పురాణం సాగుతుంది.* ---------------------------------------