KR (king Rules)
535 views
1 months ago
*మత్తయి 28:6 “ఆయన ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచి యున్నాడు.”* ప్రియులారా, ఈ వాక్యం క్రైస్తవ విశ్వాసానికి మూలస్తంభం. యేసుక్రీస్తు సమాధిలో లేడు. ఎందుకంటే ఆయన మరణాన్ని జయించి లేచాడు. ఇది ఒక సంఘటన మాత్రమే కాదు, ఇది క్రీస్తు పునరుత్థానపు శక్తి. బైబిల్ చెబుతుంది: “పాపపు జీతము మరణము” (రోమా 6:23). పాపం మనిషిని మరణానికి బంధించింది. కానీ యేసుక్రీస్తు సిలువపై మన పాపమును భరించి, సమాధిలో దిగిపోయి, మూడవ దినమున లేచి, ఆ మరణపు ముళ్ళును విరిచాడు (1 కోరింథీయులకు 15:55). ఈ రోజు ప్రపంచంలోని అన్ని సమాధులు నిండి ఉన్నా, యేసు సమాధి మాత్రం ఖాళీగా ఉంది. ఎందుకంటే ఆయన చనిపోయినవాడు కాదు. సజీవుడైన దేవుడు! ఆయన పునరుత్థానం ద్వారా అనేకులకు నిత్యజీవమును ప్రసాదిస్తున్నాడు (యోహాను 11:25). కాబట్టి ప్రియులారా, పునరుత్థానడైన యేసు యొక్క వాగ్దానం. భయం వద్దు, నిరాశ వద్దు. నేను సజీవుడిని, నిన్ను కూడా నిత్యజీవానికి నడిపించగలను. ఖాళీ సమాధి మనకు ఇచ్చే సాక్ష్యం. యేసుక్రీస్తు దేవుడు, ఆయన సజీవుడు, ఆయనలో నిత్యజీవము ఉంది. ✨ http://youtube.com/post/Ugkxh7Cox1WS33oTZ1f6Dp7Oc2TOLvxtSrVL?si=39epum4Uzes55XLY #📕బైబిల్ వాక్యాలు #⛪చర్చిలు✝ #ఈస్టర్ శుభాకాంక్షలు.💐 *Plz Subscribe, Share, Like and Comment*