కృష్ణ చైతన్యం 💓💖🙏
714 views
6 days ago
ఆర్టికల్ 🚨 “చట్టాలు, శిక్ష భయం ప్రజలని #🎉రామనవమి వేడుకలు😊 #📙ఆధ్యాత్మిక మాటలు #భగవద్గీత తప్పులు చేయకుండా సహజంగా, శాశ్వతంగా ఆపలేవు ధర్మమే ఆపుతుంది " మరి దీనికి శాశ్వత పరిష్కారం ఏమిటి? కొంతమంది భగవంతుడు లేడు అని సగం సగం చదువుకొని కేవలం సైన్స్ తోనే సమస్యలు తీరిపోతాయని అనుకునే వారికి ఈ ఐదు ప్రశ్నలు రెండు రోజులు పోలీస్, కోర్ట్ లేకపోతే—మీ టెక్నాలజీ ప్రజలను తప్పు చేయకుండా భయంతో కాదు హృదయ పరివర్తనతో ఆపగలదా? తప్పు చేసిన తర్వాత శిక్ష ఇస్తారు—కానీ ముందు నుంచే తప్పు చేయకుండా ఆపేది మీ సిస్టమ్‌లో ఉందా? ఎవరూ చూడని చోట—మీ టెక్నాలజీ మనిషిని నిజాయితీగా ఉంచగలదా? డబ్బు, పవర్ ఉన్నవాడు దుర్వినియోగం చేయకుండా మీ చదువు ఎలా ఆపుతుంది? భయం లేకపోతే తప్పు చేయకుండా ఉండే మంచి మనసును మీ సైన్స్ ఇవ్వగలదా? నేటి చట్టాలు మరియు శ్రీరాముడు ధర్మం ఈ రోజుల్లో మనం ఒక పెద్ద మాయలో ఉన్నాం. టెక్నాలజీ ఉంది, విద్య ఉంది, స్కిల్స్ ఉన్నాయి కానీ ఒక ప్రశ్న అడగాలి: ఈ అభివృద్ధి మనిషిని మంచి మనిషిగా మార్చిందా? ఒక సమాజాన్ని నిలబెట్టేది కేవలం చట్టాలు కాదు, ధర్మం. చట్టం భయం వల్ల మనిషి తప్పు చేయకపోవచ్చు. కానీ ధర్మం ఉంటే ఎవరూ చూడకపోయినా, మనిషి తప్పు చేయడు. ఇదే అసలు సివిలైజేషన్. టెక్నాలజీ vs బుద్ధి ఈ రోజుల్లో: డిగ్రీలు ఉన్నాయి స్కిల్స్ ఉన్నాయి టెక్నాలజీ ఉంది కానీ: గౌరవం తగ్గింది మహిళలపై దాడులు పెరిగాయి ప్రకృతి నాశనం అవుతోంది ఎందుకు? బుద్ధి (wisdom) లేకపోవడం వల్ల టెక్నాలజీ మనకు శక్తి ఇస్తుంది కానీ ధర్మం మాత్రమే దానికి సరైన దిశ ఇస్తుంది శ్రీ రాముడు – ధర్మానికి ప్రతిరూపం శ్రీ రామచంద్ర ప్రభు కేవలం ఒక రాజు కాదు. ఆయన ధర్మాన్ని జీవించిన వ్యక్తి. ఆయనకు రాజ్యం ఉంది, శక్తి ఉంది. కానీ ఒక మాట కోసం అన్నిటినీ వదిలి వనవాసానికి వెళ్లారు. ఇది బలహీనత కాదు ఇది ధర్మంపై ఉన్న నిబద్ధత అందుకే ఆయన పాలనను “రామరాజ్యం” అంటారు. రామరాజ్యం అంటే ఏమిటి? రామరాజ్యం అంటే: న్యాయం సహజంగా జరుగుతుంది మహిళలు గౌరవింపబడతారు ప్రజలు చట్టాలు భయంతో కాదు, బాధ్యతతో జీవిస్తారు అక్కడ పోలీస్ అవసరం తక్కువ, ఎందుకంటే ప్రజలలో ధర్మం ఎక్కువ. భగవంతుడు లేకపోతే ఏమవుతుంది? భగవంతుడు అంటే కేవలం ఒక నమ్మకం కాదు— ఆయన ధర్మానికి మూలం “ఎవరో చూస్తున్నారు” అనే భావం లేకపోతే “నేను ఎందుకు తప్పు చేయకూడదు?” అనే ప్రశ్న వస్తుంది అప్పుడు: రాజకీయ నాయకులు తమ ఇష్టం ప్రకారం నడుస్తారు. అందుకే భారతదేశంలో క్రైమ్ చేసే రాజకీయ నాయకులు పార్లమెంట్ అసెంబ్లీ లో ఉన్నారు సమాజం క్రమంగా క్రైమ్ వైపు వెళ్తుంది విద్యార్థులు విలువలు కోల్పోతారు మహిళలపై నిర్లక్ష్యం పెరుగుతుంది. ఇవన్నీ జరుగుతున్నాయి, భక్తి అవసరం లేదు అన్న ప్రతి ఒక్కరికి పై వాటి దగ్గర సమాధానం ఉందా భక్తి లేని చివరికి: సమాజం బలహీనంగా మారుతుంది గీతా సత్యం Bhagavad Gita లో ఒక స్పష్టమైన హెచ్చరిక ఉంది: “యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి…” (4.7) ధర్మం తగ్గితే—అశాంతి పెరుగుతుంది భక్తి – అసలు పరిష్కారం భక్తి అంటే: కేవలం పూజా ఆచారాలు కాదు ఇది ఒక హరే కృష్ణ మహా మంత్రం జప సాధన ద్వారా వచ్చిన అంతర్గత మార్పు: ఇతరులను గౌరవించడం స్వార్థాన్ని తగ్గించడం బాధ్యతతో జీవించడం ఇది వచ్చినప్పుడు: సమాజం సహజంగా సరిగా నడుస్తుంది టెక్నాలజీ అవసరం ఉంది— కానీ అది సరిపోదు స్కిల్స్ ఉండాలి కానీ బుద్ధి కూడా ఉండాలి అభివృద్ధి ఉండాలి కానీ ధర్మంతో కలిసిన అభివృద్ధి కావాలి “ధర్మం లేకుండా టెక్నాలజీ ప్రమాదం… భగవంతుడు లేకుండా ధర్మం నిలవదు… అందుకే ధర్మం మరియు భగవంతుడు—సమాజానికి రెండు కళ్ళు.” శ్రీమద్ భాగవతం 9.10.50 శ్రీల ప్రభుపాద వారి భాష్యం : శ్రీ రామచంద్రుడు రాజ్యాన్ని స్వీకరించారు. ఆయన ప్రజలను తండ్రి తన పిల్లలను చూసుకునే విధంగా చూసుకున్నారు. ప్రజలు కూడా తమ తమ వర్ణాశ్రమ ధర్మాలలో నిమగ్నమై, ఆయనను తమ తండ్రిగా భావించారు. రాజు లేదా నాయకుడు ఒక రాజర్షి అయితే, ప్రజలతో ఆయనకు స్పష్టమైన సంబంధం ఉంటుంది. అప్పుడు సమాజంలో గందరగోళం ఉండదు, ఎందుకంటే దొంగలు తగ్గిపోతారు. కానీ కలియుగంలో వర్ణాశ్రమ వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రజలు ఎక్కువగా తప్పు మార్గంలో నడుస్తున్నారు. ప్రజాస్వామ్యంలో, ఇలాంటి వారు ఒకరినొకరు ఎన్నుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అందువల్ల ప్రభుత్వం గందరగోళంగా మారుతుంది, ఎవరూ సంతోషంగా ఉండరు. శ్రీమద్ భాగవతం 9.10.51 భాష్యం శ్రీల ప్రభుపాద నాలుగు యుగాలలో—సత్య, త్రేతా, ద్వాపర, కలి—ఇవన్నిటిలో కలియుగం అత్యంత దోషపూరితమైనది. కానీ వర్ణాశ్రమ ధర్మాన్ని అమలు చేస్తే, ఈ కలియుగంలో కూడా సత్యయుగ స్థితిని తీసుకురాగలం. ఈ ఉద్దేశ్యంతోనే హరే కృష్ణ ఉద్యమం, లేదా కృష్ణ చైతన్య ఉద్యమం ఉంది. “కలేర్ దోషనిధే రాజన్ అస్తి హ్యేకో మహాన్ గుణః కీర్తనాద్ ఏవ కృష్ణస్య ముక్త సంగః పరమ్ వ్రజేత్” (శ్రీమద్ భాగవతం 12.3.51) అర్థం: ఓ రాజా! కలియుగం అనేక దోషాలతో నిండిపోయినా, ఒక గొప్ప గుణం ఉంది—కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా మనిషి భౌతిక బంధనాల నుండి విముక్తి పొంది పరమ స్థితిని చేరుకోగలడు. ప్రజలు ఈ హరే కృష్ణ సంకీర్తన ఉద్యమాన్ని—“హరే కృష్ణ, హరే రామ” అని జపిస్తే—కలియుగపు కలుషిత ప్రభావాల నుండి తప్పక విముక్తి పొందుతారు. అప్పుడు ఈ యుగంలోని ప్రజలు కూడా సత్యయుగంలోని ప్రజలలా సంతోషంగా జీవించగలరు. ఎవరైనా, ఎక్కడైనా ఈ హరే కృష్ణ ఉద్యమాన్ని సులభంగా ఆచరించవచ్చు. కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం, నియమాలను పాటించడం, పాపాచారాల నుండి దూరంగా ఉండటం అవసరం. ఒకవేళ ఎవరికైనా పాపాచారాలను వెంటనే విడిచిపెట్టడం కష్టమైనా, వారు భక్తితో, విశ్వాసంతో హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే—వారు నిశ్చయంగా అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారు, వారి జీవితం విజయవంతమవుతుంది. “పరం విజయతే శ్రీ కృష్ణ సంకీర్తనం” శ్రీ కృష్ణ సంకీర్తనం మహా విజయాన్ని అందిస్తుంది. ఇదే కలియుగంలో Lord Rama గారు గౌరసుందరునిగా అవతరించి ఇచ్చిన ఆశీర్వాదం “చట్టాలు మనిషిని భయపెడతాయి… కేవలం చదువులు సైన్స్ డబ్బులు ఇస్తాయి కానీ ధర్మం మనిషిని మార్చుతుంది… రామరాజ్యం రావాలంటే—మార్పు మనసులో మొదలవాలి. అది హరే కృష్ణ మహా మంత్రం జపం సాధనతో ప్రారంభమవుతుంది” ప్రతిరోజు భగవద్గీత ప్రాక్టికల్ సైన్స్ తరగతులకు హాజరు కావాలంటే " 9121 585 375 " కు whatsapp మెసేజ్ చేయగలరు. ప్రతి ఒక్కరికి సులభంగా అర్థమయ్యే విధంగా ఉదాహరణలతో భగవద్గీత చెప్పబడుతుంది భక్తులు ఈ అవకాశం ఉపయోగించుకోగలరు ఇట్లు మీ సేవకులు చైతన్య కృష్ణ దాస ©Jivjaago Media Director