బాబా మాత్రమే కల్పతరువుగా తన భక్తుల కోరికలను తీర్చగలడని, అటువంటి బాబాకు మనం తిరిగి ఏమీ ఇవ్వనక్కరలేదనే భావం మనలో ఉండవచ్చు. ఆయనకే మన కోరిక లన్నిటిని తీర్చగలిగిన శక్తి ఉన్నపుడు సామా న్యులమయిన మనము ఆయనకే మివ్వగలం అనే ఆలోచన తప్పు. ఇవ్వడమనేది ఏకపక్షం గా ఉండరాదు. ఇచ్చిపుచ్చుకోవడమనేది ఉండాలి. భగవంతుడయినా సరే ముందు స్వీకరించిన తరువాతనే అనుగ్రహిస్తాడు.
ఇక్కడ మీకొక సందేహం రావచ్చు. బాబా మననుంచి ఏదీ ఆశించనట్లయితే ఆయన మననుండి దక్షిణ అడిగి మరీ ఎందుకని తీసుకునేవారు? మండుటెండ లో బిక్షకోసం యింటింటికీ ఎందుకని తిరిగేవారు. బాబా ఎప్పుడూ దక్షిణ కోసంగాని, బిక్ష కోసంగాని ఆరాట పడలేదు. ఈవిధంగా ఆయనచేయడం లోని ఆంతర్యం భక్తుల హృదయాలలో ఉండే దయాగుణాన్ని అన్వే షించడానికే. మన జీవితాలు ఉన్నతంగా సాగడానికే మనం సంపాదించిన దానిలో కొద్ది మొత్తాన్ని దాన ధర్మాలకై వినియోగంచమని మనకు ఆవిధం గా బాబా బోధించారు.
బాబా తన భక్తుల ప్రార్ధనలకు, కోరికలకు స్పందించి వారిని అనుగ్రహిస్తూ ఉంటారు. తన భక్తులు వ్యాకు లతలతో ఉన్నప్పుడు గాని, కష్టాలలో ఉన్నపుడు గాని తన అత్యద్భుత మయిన చమత్కారాలను, లీలలను ప్రదర్శించి వారికి తన చేయూతనందించి సహాయం చేస్తూ ఉంటారు. ఈవిధంగాఆయన సహాయం అందు కున్న భక్తులనుంచి బాబా ఏమీ ఆశించరు. బాబా తన భక్తుల కోరికలను తీర్చి వారు తను బోధించిన విధంగా ఏవిధం గా ప్రవర్తించాలో ఆవిధంగానే భక్తులు ఉండా లనే కోరుకొంటారు.
కాని, మనమందరం ఆయన ఆశయాన్ని ఆయన మననించి ఏమి కోరుకొంటున్నారో ఇవన్నీ మర్చిపోయి, ప్రతిసారి బాబాని పదే పదే క్రొత్త కోరికలతో ప్రార్ధిస్తూ ఉంటాము.బాబా మన కోరికలను తీర్చగానే మనం ఎంతో ఉద్వేగం చెంది, భావోద్వేగాలతో ఉక్కిరి బిక్కిరయి కన్నీరు కారుస్తూ ఆయనకు మన కృతజ్ఞ తాభివందనాలను అర్పించు కొంటాము. బాబాని మనం మన కోరికలను తీర్చే కల్పతరువుగా భావిస్తాము. అంతేకాదు, ఆయన మన గురువు, భగవంతుడు అని చెప్పుకొంటాము. బాబాకు మేము భక్తులం అని మనకు మనమే ప్రకటించుకొంటాము.
నిజం చెప్పాలంటే బాబాకు మేము భక్తులం శిష్యులం అని మనకు మనమే చెప్పుకునే అర్హత మనకు లేదు. దానికి మనంపాత్రులము కాదు. ఆయన మనకు బోధించిన బోధనలను గాని, ఉపదేశాలను గాని గుర్తుంచుకోకుండా ఆయన ముందు మనంచేతులు చాచి మరలా మరలా అర్ధించడానికి అవసరమయిన ఆధా రం ఏది దొరుకుతుందా అని అన్వేషిస్తూనే ఉంటాము. బాబా మనలనుంచి ఏది కోరు కుంటు న్నారో, ఏవిధంగా మనం ఉండాలో చెప్పిన విషయా లన్నీ మర్చిపోవడమే కాకుండా కావాలనే వాటిని నిర్లక్ష్యం చేస్తున్నాము.
ఆయన పాదాలముందు నిలబడి మరొక క్రొత్త కోర్కెను తీర్చమని అర్ధిస్తున్నాము. ఆయన మన కోరికను తీర్చనప్పుడు ఆయన మీద ఒకింతకోపాన్ని కూడా ప్రదర్శిస్తున్నాము.బాబా జీవనవిధానం మనకు ఇస్తున్న సందేశం బాబా తన భక్తుల కోర్కెలను తీరుస్తారనే విషయం అందరికీ తెలుసు. ఆ కారణం చేతనే అన్ని జాతులవారు, కులాలవారు, మతాల వారు బాబా సమాధి చుట్టూచేరి ఆయననుదర్శించు కునేందుకు గుమికూడుతూ ఉంటారు. తమతమ మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చి, ఆయన తమ మీద ప్రసరించిన అను గ్రహానికి ఆయనకు కానుకలను సమర్పించు కుంటూ ఉంటారు.
కాని, బాబా ఉపదేశాలను గ్రహించుకోవడంలో విఫలమయ్యారనే చెప్పవచ్చు. ఒక కోరిక తీరిన తరువాత మరొక కోరికను తనముందు పెట్టడమనే తీరును బాబా తన భక్తులనుంచి కోరుకోరు. ఆయన మననించి కోరుకునేది తను చెప్పిన ఉపదేశాలను అర్ధం చేసుకోమని. తను ఉపదేశించిన విషయాలను అందరికీ వ్యాప్తి చేయమనే ఆయన మననుంచి కోరు కునేది. ఆయన బోధనలను ఆచరణలో పెట్ట మనే మనలనుంచి బాబా కోరుకొంటారు.బాబా చెప్పిన సిధ్ధాంతాలను, బోధనలను, మనం ఆచరణలో పెట్టినపుడే మనలో భక్తి ఎంత ఉందనే విషయాన్ని బాబా గుర్తిస్తారు.
శ్రధ్ధ, సబూరి -- ఈ రెండుపదాలు మనకు బాబా సుపరిచితమయినవే. కాని మన జీవిత గమ్యంలో వాటి సారాన్ని తెలుసుకొని ఆచరణలో పెట్టడంలో విఫలమయ్యాము. శ్రద్ధ అనగా భగవంతుని మీద సడలని భక్తి, ఆత్మనివేదన. వీటిని అభ్యాసం చేయడం, ఆచరించడం అంత సులభమేమీ కదు. కారణ మేమంటే మన జీవితం అధఃపతనం చెందడా నికి కారణమయ్యే మన గమనాన్ని మార్చు కోవాలి. మనలో ఉన్నటువంటి స్వార్ధపూరిత ఆలోచనల స్థానంలో భగవంతుని మీదనే మన దృష్టిని నిలిపి ఆయన కోరుకున్నట్లుగానే అన్నీ సమర్పిస్తూ ఉండాలి.
సబూరి -- మన జీవితంలో కలిగే కష్టాలు, విఘాతాల సమయాలలో స్థిరంగా ఉండమని సహనం మనకు బోధిస్తుంది. జీవితంలో మనకు అనేక ఒడిదుడుకులు, ప్రకంపనాలను ప్రతిక్షణం మనం అనుభవిస్తూ ఉంటాము. ఈ రెండు సూత్రాలను సాధన చేయకుండా భక్తుల మయిన మనం ఏవిధంగా వాటిని తట్టుకొని నిలబడగలము. మన దైనందిన జీవితంలో వీటిని ఆచరణలో పెట్టమనే బాబా మనల నుంచి కోరుకునేది.
కర్మ, భక్తి, ధ్యానం మనలో ఉన్నటువంటి సంకుచిత మయిన ఆలోచనలని, స్వార్ధ స్వభావాన్ని, మూర్ఖ పధ్ధతులను విడనాడి సేవాభావాన్ని, త్యాగనిరతిని అలవరచుకొని క్రొత్తజీవితాన్ని గడపమనే బాబా తన భక్తుల నుంచి కోరుకొంటారు. స్వార్ధాన్ని వదలి స్వలా భాపేక్షకు అనుసంధానమయిన ‘నేను’ ను విడిచి పెట్టమని, ధర్మగుణాన్ని సేవానిరతిని అలవరచుకొని ఆ విధంగా జీవించమని బాబా ఉపదేశించారు. ఇదే బాబా మనకు ఉపదేశిం చిన కర్మయోగం. మనంచేసే ప్రతి కర్మను ఒక పుష్పంగా భగవంతునికి సమర్పించా లి. ఇదే భక్తియోగం. ప్రతిచోటా భగవంతుడుఉన్నాడనే భావంతో ఉండటమే ధ్యానయోగం. మన ఆలోచన లను, కోరికలను, మనోభావాలను, అర్పించడం కూడా భక్తియోగాన్ని తెలియ చేస్తుంది.
చివరిగా బాబా మననుంచి కోరుకునేది బాబా మనలని నామస్మరణ, ధ్యానం చేసుకో మని ఉపదేశించారు. శరీర స్పృహను మరచి తన నామాన్నే జపించుకుంటు ఉండమనిచెప్పారు. తన రూపంమీద ధ్యానం చేసుకో మన్నారు. ఈవిధంగా నిరంతరం ఆగకుండా ధ్యానం చేసుకోవాలి. మన మనస్సుని, బుధ్ధిని, శరీరాన్ని అహాన్ని ఆయన చైతన్యంలో విలీనం చేయాలి. ఇదే చివరిగా ఆయన మననుంచి కోరుకునేది. ఈ విషయా లని చులకనగా చూడవద్దు.
వీటిలో చెప్పబడిన ముఖ్యోద్దేశాన్ని గుర్తించి ఆచరణలో పేట్టవలసిన అవసరం ఎంతయినా ఉంది. బాబా షిరిడీలో రొట్టెముక్క కోసం ఇంటింటికి తిరిగేవారు. వాస్తవానికి ఆయన మననుంచి ఆహారాన్ని కోరు కోలేదు. మన అస్తిత్వాన్ని పూర్తిగా తనకు సమర్పించా లనే కోరుకొన్నారు.
#🙏🏼షిరిడి సాయి బాబా #🕉 ఓం సాయిరామ్😇