*_తమ్ముడి వాటా:_*
*ధర్మపురిలో ధర్మాత్ముడైన ఒక రాజు ఏటేటా ప్రజలకు అన్నవస్త్రాలు దానం చేస్తూ ఉండే వాడు, ఆ సమయంలో ఆయన సభచేసి, తాను ఏ విధంగా పరిపాలన సాగిస్తున్నది ప్రజలకు వివరించి చెప్పి, “ప్రజలందరూ నా నహోదరులు, నా సొత్తు అంతా ప్రజలదే" అనేవాడు.*
*ఇది విన్న ఒక మనిషి రాజసభకు వచ్చి, "నేను రాజుగారికి ఒక తమ్ముణ్ణి. రాజు గారిని చూడాలి,” అన్నాడు*.
*రాజు అతన్ని సభలోకి రప్పించి "ఏమిటి సంగతి?" అని ఆడిగాడు.*
*"మీ ప్రజలలో నేనూ ఒక తమ్ముణ్ణి, మీ పొత్తులో నా వాటా అడిగి తీసుకుపోదామని వచ్చాను” అన్నాడు ఆ మనిషి*.
*రాజు గణకులను పిలిపించి "మన రాజ్యంలో ఉన్న జనసంఖ్య ఎంతో, మన ఖజానాలో ఎంత డబ్బున్నదో, అది అందరికీ పంచితే ఒక్కొక్కడికి ఎంత వస్తుందో లెక్క కట్టండి,” అన్నాడు.*
*గణకులు లెక్కకట్టి ఒక్కొక్క పౌరుడికీ అరదమ్మిడీ వస్తుందన్నారు*
*"పోనీలెండి. ఈ మనిషికి ఒక దమ్మిడి ఇచ్చిపంపండి,” అన్నాడు రాజు*.
*_చందమామ కథ._*
#మన సంప్రదాయాలు సమాచారం