v. v. guptha
468 views
1 days ago
#📙ఆధ్యాత్మిక మాటలు #🎶భక్తి పాటలు🔱 #🕉️ గణపతి బప్పా మోరియా #🇮🇳 మన దేశ సంస్కృతి 14-03-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - ఒక్క తండ్రియే నంబరు వన్ పాత్రధారి, వారు పతితులను పావనముగా తయారుచేసే పాత్రను అభినయిస్తారు, తండ్రి వంటి పాత్రను ఎవ్వరూ అభినయించలేరు’’ ప్రశ్న:-సన్యాసుల యోగము భౌతిక యోగము, ఆత్మిక యోగాన్ని తండ్రి మాత్రమే నేర్పిస్తారు, ఎలా? జవాబు:-సన్యాసులు బ్రహ్మతత్వముతో యోగము జోడించడము నేర్పిస్తారు. కానీ అది నివసించే స్థానము. కావున అది భౌతిక యోగము అవుతుంది. తత్వాన్ని సుప్రీమ్ అని అనరు. పిల్లలైన మీరు సుప్రీమ్ ఆత్మతో యోగము జోడిస్తారు, అందుకే మీ యోగము ఆత్మిక యోగము. ఈ యోగాన్ని తండ్రి మాత్రమే నేర్పించగలరు, ఇంకెవ్వరూ నేర్పించలేరు ఎందుకంటే వారే మీ ఆత్మిక తండ్రి. పాట:-నీవు ప్రేమ సాగరుడవు... ▶ ఓంశాంతి. పిల్లలూ, చాలామంది ఓం శాంతి అని అంటారు అనగా తమ ఆత్మ యొక్క పరిచయాన్ని ఇస్తారు కానీ వారు స్వయం ఏమీ అర్థం చేసుకోలేరు. ఓం శాంతికి చాలా అర్థాలను చెప్తారు. కొంతమంది ఓం అనగా భగవంతుడని అంటారు కానీ అలా కాదు. ఇక్కడ ఆత్మ ఓం శాంతి అని అంటుంది. ఆత్మనైన నా స్వధర్మమే శాంతి, అందుకే నేను శాంతి స్వరూపాన్ని అని అంటారు. ఇది నా శరీరము, దీనితో నేను కర్మలను చేస్తాను. ఇది ఎంత సహజము. అలాగే తండ్రి కూడా ఓం శాంతి అని అంటారు. కానీ నేను అందరికీ తండ్రినైన కారణముగా, బీజరూపుడినైన కారణముగా రచన రూపీ వృక్షము అనగా కల్పవృక్షము యొక్క ఆదిమధ్యాంతాల గురించి నాకు తెలుసు. మీరు ఏ వృక్షాన్ని చూసినా సరే, దాని ఆదిమధ్యాంతాలను తెలుసుకోగలరు, ఆ బీజమైతే జడమైనది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇది కల్పవృక్షము, దీని ఆదిమధ్యాంతాలను మీరు తెలుసుకోలేరు, అవి నాకు తెలుసు. నన్ను జ్ఞానసాగరుడు అనే అంటారు. నేను కూర్చుని పిల్లలైన మీకు ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తున్నాను. ఈ నాటకాన్ని డ్రామా అని అంటారు, ఇందులో మీరు పాత్రధారులు. తండ్రి అంటారు, నేను కూడా పాత్రధారినే. పిల్లలంటారు - ఓ బాబా, పతిత-పావనా, పాత్రధారిగా అయి రండి, వచ్చి పతితులను పావనముగా తయారుచేయండి. ఇప్పుడు తండ్రి అంటారు, నేను పాత్రను అభినయిస్తున్నాను, నా పాత్ర కేవలం ఈ సంగమ సమయములోనే ఉంటుంది. నాకు నాదంటూ శరీరము లేదు. నేను ఈ శరీరము ద్వారా పాత్రను అభినయిస్తాను. నా పేరు శివ. పిల్లలకే అర్థం చేయిస్తాను కదా. పాఠశాల కోతులకో, జంతువులకో ఉండదు. కానీ తండ్రి అంటారు, ఈ 5 వికారాలు ఉన్న కారణముగా ముఖము మనుష్యుల వలె ఉంది కానీ పనులు కోతుల వలె ఉన్నాయి. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, అందరూ తమను తాము పతితులుగానే చెప్పుకుంటారు కానీ మనల్ని పతితముగా ఎవరు తయారుచేస్తారు మరియు మళ్ళీ పావనముగా ఎవరు వచ్చి తయారుచేస్తారు అనేది వారికి తెలియదు. పతిత-పావనుడు అని ఎవరినైతే పిలుస్తారో, వారి గురించి ఏమీ అర్థం చేసుకోలేకపోతారు. మేమంతా పాత్రధారులమని కూడా వారికి తెలియదు. ఆత్మనైన నేను ఈ శరీరాన్ని తీసుకుని పాత్రను అభినయిస్తాను. ఆత్మ పరంధామము నుండి వస్తుంది, వచ్చి పాత్రను అభినయిస్తుంది. ఆటంతా భారత్ పైనే తయారుచేయబడింది. భారత్ పావనముగా ఉండేది, భారత్ ను పతితముగా ఎవరు తయారుచేసారు. రావణుడు. రావణుడి రాజ్యము లంకలో ఉండేదని అంటూ ఉంటారు కూడా. తండ్రి అనంతములోకి తీసుకువెళ్తారు. ఓ పిల్లలూ, ఈ సృష్టి అంతా అనంతమైన ద్వీపము. అదైతే హద్దు లంక. ఈ అనంతమైన ద్వీపముపై రావణుడి రాజ్యముంది. ముందు రామ రాజ్యము ఉండేది, ఇప్పుడు రావణ రాజ్యము ఉంది. బాబా, రామ రాజ్యము ఎక్కడ ఉండేది అని పిల్లలు అడుగుతారు. బాబా అంటారు, పిల్లలూ, అది ఇక్కడే ఉండేది కదా, దానిని అందరూ కోరుకుంటారు. భారతవాసులైన మీరు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు, మీరు హిందూ ధర్మానికి చెందినవారు కారు. మధురాతి మధురమైన, చాలా కాలం దూరమైన తర్వాత కలిసిన ప్రియమైన పిల్లలూ, మొట్టమొదట మీరే భారత్ లో ఉండేవారు. మీకు ఆ సత్యయుగ రాజ్యాన్ని ఎవరు ఇచ్చారు? తప్పకుండా హెవెన్లీ గాడ్ ఫాదర్ యే ఈ వారసత్వాన్ని ఇస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఎంతమంది ఇతర ధర్మాల్లోకి కన్వర్ట్ అయిపోయారు. ముసల్మానుల రాజ్యము ఉన్నప్పుడు, చాలామందిని ముసల్మానులుగా చేసారు. క్రిస్టియన్ల రాజ్యము ఉన్నప్పుడు చాలామందిని క్రిస్టియన్లుగా చేసారు. బౌద్ధులదైతే ఇక్కడ రాజ్యము లేకపోయినా సరే చాలామందిని బౌద్ధులుగా చేసారు, తమ ధర్మములోకి కన్వర్ట్ చేసారు. ఆది సనాతన ధర్మము కనుమరుగైపోయినప్పుడే మళ్ళీ ఆ ధర్మ స్థాపన జరుగుతుంది. కనుక తండ్రి భారతవాసులైన మీ అందరికీ చెప్తున్నారు - మధురాతి-మధురమైన పిల్లలూ, మీరందరూ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారు. మీరు 84 జన్మలు తీసుకున్నారు. బ్రాహ్మణ, దేవతా, క్షత్రియ... వర్ణాలలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ దేవతా వర్ణములోకి వెళ్ళేందుకని బ్రాహ్మణ వర్ణములోకి వచ్చారు. బ్రాహ్మణ దేవతాయ నమః అని పాడుతారు కూడా, ముందు బ్రాహ్మణుల పేరును తీసుకుంటారు. బ్రాహ్మణులే భారత్ ను స్వర్గముగా తయారుచేసారు. ఇది ఉన్నదే భారత్ యొక్క ప్రాచీన యోగము. మొట్టమొదట ఏదైతే రాజయోగము ఉండేదో, దాని గురించే గీతలో వర్ణన ఉంది. గీతలో ఉన్న యోగాన్ని ఎవరు నేర్పించారు? ఈ విషయాన్ని భారతవాసులు మర్చిపోయారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలూ, యోగాన్ని అయితే నేనే నేర్పించాను. ఇది ఆత్మిక యోగము. మిగిలినవన్నీ భౌతిక యోగాలు. సన్యాసులు మొదలైనవారు భౌతిక యోగాన్ని నేర్పిస్తారు అనగా బ్రహ్మతత్వముతో యోగము జోడించమని నేర్పిస్తారు. అది రాంగ్ అవుతుంది. బ్రహ్మతత్వమైతే నివసించే స్థానము. అదేమీ పరమాత్మ కాదు. తండ్రిని మర్చిపోయారు. మీరు కూడా మర్చిపోయారు. మీరు మీ ధర్మాన్ని మర్చిపోయారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. విదేశాలలో యోగము ఉండేది కాదు. హఠయోగము మరియు రాజయోగము ఇక్కడే ఉన్నాయి. ఆ నివృత్తి మార్గానికి చెందిన సన్యాసులు ఎప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు. దాని గురించి తెలిసినవారే నేర్పించాలి. సన్యాసులైతే రాజ్యాన్ని కూడా వదిలేస్తారు. గోపీచంద్ రాజు ఉదాహరణ ఉంది కదా. రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్ళిపోయారు. అతని కథ కూడా ఉంది. సన్యాసులైతే రాజ్యాన్ని విడిపించేవారు, అటువంటివారు రాజయోగాన్ని ఎలా నేర్పించగలరు. ఈ సమయములో మొత్తము వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పుడిక పడిపోవడానికి సిద్ధముగా ఉంది. ఏ వృక్షమైనా శిథిలావస్థకు చేరుకున్నప్పుడు, చివర్లో దానిని పడగొట్టవలసి ఉంటుంది. అలాగే ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షము కూడా తమోప్రధానముగా ఉంది, ఇందులో ఎటువంటి సారము లేదు. ఇది తప్పకుండా వినాశనము చెందుతుంది. దాని కంటే ముందే ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని ఇక్కడ స్థాపన చేయవలసి ఉంటుంది. సత్యయుగములో ఎవరూ దుర్గతిలో ఉండరు. మనుష్యులు విదేశాలకు వెళ్ళి యోగాన్ని నేర్పిస్తారు కానీ అది హఠయోగము, అందులో జ్ఞానము అసలు ఉండదు. అనేక రకాల హఠయోగాలు ఉన్నాయి. ఇది రాజయోగము, దీనిని ఆత్మిక యోగమని అంటారు. అవన్నీ భౌతిక యోగాలు. అవి మనుష్యులు మనుష్యులకు నేర్పిస్తారు. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, నేను మీకు ఒక్కసారి మాత్రమే ఈ రాజయోగాన్ని నేర్పిస్తాను, ఇంకెవ్వరూ ఎప్పటికీ నేర్పించలేరు. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నేర్పిస్తున్నారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ పాపాలన్నీ నశిస్తాయి. హఠయోగులు ఎప్పుడూ ఈ విధముగా చెప్పలేరు. తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. ఇది కొత్త విషయము. తండ్రి మిమ్మల్ని ఇప్పుడు దేహీ-అభిమానులుగా తయారుచేస్తున్నారు. తండ్రికి దేహము లేదు. వీరి తనువులోకి వచ్చి, వీరి పేరును మారుస్తారు ఎందుకంటే మరజీవాగా అయ్యారు. గృహస్థులు సన్యాసులుగా అయినప్పుడు మరజీవాగా అవుతారు, గృహస్థాశ్రమాన్ని వదిలి నివృత్తి మార్గాన్ని చేపడతారు. కనుక మీరు కూడా మరజీవాగా అవ్వడముతో పేర్లు మారుతాయి. ప్రారంభములో అందరి పేర్లు తీసుకువచ్చారు, కానీ తర్వాత కొంతమంది ఆశ్చర్యము కలిగించేలా విని, వర్ణించి, పారిపోయారు, కావున పేర్లు ఇవ్వడము ఆగిపోయింది, అందుకే ఇప్పుడు తండ్రి అంటున్నారు - నేను పేరు పెట్టి, ఆ తర్వాత మళ్ళీ వారు పారిపోతే అది వృధా అయిపోతుంది. ముందు వచ్చినవారికి ఏవైతే పేర్లు పెట్టారో, అవి చాలా రమణీకముగా ఉండేవి. ఇప్పుడు పేర్లు పెట్టడము లేదు. ఎవరైతే సదా స్థిరముగా నిలిచి ఉంటారో, వారికే పేర్లు పెట్టడము జరుగుతుంది. చాలామందికి పేర్లు పెట్టారు, కానీ తర్వాత తండ్రిని వదిలి పారిపోయారు, అందుకే ఇప్పుడు పేర్లు మార్చడము లేదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ జ్ఞానము క్రిస్టియన్ల బుద్ధిలో కూడా కూర్చుంటుంది. భారత్ యొక్క యోగాన్ని నిరాకార తండ్రియే వచ్చి నేర్పించారని ఇంతమాత్రం అర్థం చేసుకుంటారు. తండ్రిని స్మృతి చేయడము ద్వారానే పాపాలు భస్మమవుతాయి మరియు మనము మన ఇంటికి వెళ్ళిపోతాము. ఈ ధర్మానికి చెందినవారు ఎవరైతే కన్వర్ట్ అయిపోయి ఉంటారో, వారు నిలుస్తారు. మనుష్యులు, మనుష్యులకు సద్గతినివ్వలేరని మీకు తెలుసు. ఈ దాదా కూడా మనిషే, వీరు అంటారు, నేను ఎవరికీ సద్గతినివ్వలేను. మీ సద్గతి కూడా స్మృతి ద్వారానే జరుగుతుందని బాబా మనకు నేర్పిస్తారు. తండ్రి అంటారు, ఓ పిల్లలూ, ఓ ఆత్మలూ, నాతో యోగము జోడించినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. మీరు మొదట బంగారుయుగము వారిగా, పవిత్రముగా ఉండేవారు, ఆ తర్వాత మాలిన్యము చేరుకుంది. ఎవరైతే మొదట దేవీ-దేవతలుగా, 24 క్యారెట్ల బంగారముగా ఉండేవారో, వారు ఇప్పుడు ఇనుపయుగములోకి వచ్చి చేరుకున్నారు. ఈ యోగాన్ని కల్ప-కల్పము మీరు నేర్చుకోవలసి ఉంటుంది. ఇందులో కూడా కొంతమంది పూర్తిగా తెలుసుకుంటారు, కొంతమంది తక్కువగా తెలుసుకుంటారని మీకు తెలుసు. కొంతమంది ఇక్కడ ఏమి నేర్పిస్తున్నారు అని ఊరికే చూడడానికి వస్తారు. బ్రహ్మాకుమార-కుమారీలుగా ఇంతమంది పిల్లలు ఉన్నారు అంటే తప్పకుండా ప్రజాపిత బ్రహ్మా ఉంటారు కదా, ఇంతమంది వారికి పిల్లలుగా అయ్యరు, తప్పకుండా ఇక్కడ ఏదో ఉండి ఉంటుంది, కావుననే వెళ్ళి వారిని అడిగి చూద్దాము అని అనుకుంటారు. మీకు ప్రజాపిత బ్రహ్మా నుండి ఏమి లభిస్తుంది? అడగాలి కదా! కానీ ఈ మాత్రము బుద్ధి కూడా ఉండదు. రాతిబుద్ధి కలవారి నుండి పారసబుద్ధి కలవారిగా అయ్యారు, పారసబుద్ధి కలవారి నుండి రాతిబుద్ధి కలవారిగా అయ్యారని అంటూ ఉంటారు - విశేషముగా భారత్ కోసమే ఇలా చెప్తారు. సత్య, త్రేతాయుగాలలో పారసబుద్ధి కలవారిగా, బంగారుయుగము వారిగా ఉండేవారు, ఆ తర్వాత వెండియుగములో రెండు కళలు తగ్గిపోయాయి, అందుకే చంద్రవంశీయులు అన్న పేరు వచ్చింది, ఎందుకంటే ఫెయిల్ అయిపోయారు. ఇది కూడా ఒక పాఠశాల. ఎవరికైతే 33 మార్కుల కన్నా తక్కువ వస్తాయో, వారు ఫెయిల్ అయిపోతారు. సీతా-రాములు మరియు వారి వంశావళి సంపూర్ణము అవ్వలేదు, అందుకే వారు సూర్యవంశీయులుగా అవ్వలేరు. కొంతమంది ఫెయిల్ కూడా అవుతారు కదా ఎందుకంటే పరీక్ష కూడా చాలా పెద్దది. పూర్వము ఐ.సి.ఎస్ అని గవర్నమెంట్ కు సంబంధించిన పెద్ద పరీక్ష ఉండేది. అందరూ దానికి చదవలేకపోయేవారు. కోట్లలో కొంతమందే వెలువడుతారు. మేము సూర్యవంశీ మహారాజా, మహారాణిగా అవ్వాలని ఎవరైనా కోరుకుంటే, మరి దానికి కూడా చాలా కృషి అవసరము. మమ్మా, బాబా కూడా శ్రీమతమనుసారముగా చదువుకుంటున్నారు. వారు మొదటి నంబరులో చదువుకుంటారు, మిగతా ఎవరైతే మాత-పితలను ఫాలో చేస్తారో, వారే వారి సింహాసనముపై కూర్చుంటారు. సూర్యవంశీయులది 8 తరాలు నడుస్తుంది. ఏ విధముగా ఎడ్వర్డ్ ది ఫస్ట్, ది సెకెండ్ అన్న తరాలు నడుస్తాయి కదా. మీకు ఈ క్రిస్టియన్లతో ఎక్కువ కనెక్షన్ ఉంది. క్రిస్టియన్ వంశము భారత్ యొక్క రాజ్యాన్ని మింగేసింది, వారు భారత్ యొక్క అపారమైన ధనాన్ని తీసుకువెళ్ళిపోయారు. మరి ఆలోచించండి, సత్యయుగములో ఎంత అపారమైన ధనము ఉండి ఉంటుంది. అక్కడితో పోలిస్తే, ఇక్కడ అసలు ఏమీ లేదు. అక్కడ అన్ని గనులు నిండుగా ఉంటాయి. ఇప్పుడైతే ప్రతి వస్తువుకు సంబంధించిన గనులు ఖాళీ అయిపోతూ ఉంటాయి. మళ్ళీ చక్రము రిపీట్ అయినప్పుడు అన్ని గనులు నిండిపోతాయి. మధురాతి మధురమైన పిల్లలూ, మీరు ఇప్పుడు రావణుడిపై విజయాన్ని పొంది రాజ్యాన్ని తీసుకుంటున్నారు, మళ్ళీ అర్ధకల్పము తర్వాత ఈ రావణుడు వస్తాడు, అప్పుడు మీరు రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. ఇప్పుడు భారతవాసులైన మీరు గవ్వ సమానముగా అయిపోయారు. నేను మిమ్మల్ని వజ్ర సమానముగా తయారుచేసాను. రావణుడు మిమ్మల్ని గవ్వ సమానముగా తయారుచేసాడు. ఈ రావణుడు ఎప్పుడు వచ్చాడు, అతడిని మనము ఎందుకు కాలుస్తున్నాము అనేది ఎవరూ అర్థం చేసుకోరు. ఈ రావణుడైతే పరంపరగా ఉన్నాడని అంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, అర్ధకల్పము తర్వాత ఈ రావణ రాజ్యము ప్రారంభమవుతుంది. వికారులుగా అయిన కారణముగా తమను తాము దేవీ-దేవతలుగా చెప్పుకోలేరు. వాస్తవానికి మీరు దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారు. మీ అంతటి సుఖాన్ని ఎవ్వరూ చూడలేరు. అందరికన్నా ఎక్కువ పేదవారిగా కూడా మీరే అయ్యారు. ఇతర ధర్మాలవారు తర్వాత వృద్ధి చెందుతారు. క్రైస్టు వచ్చారు, మొదటిలో చాలా కొద్దిమందే ఉండేవారు. చాలామంది తయారైనప్పుడు రాజ్యము చేయగలుగుతారు. మీకైతే ప్రారంభములోనే రాజ్యము లభిస్తుంది. ఇవన్నీ జ్ఞానానికి సంబంధించిన విషయాలు. తండ్రి అంటారు, ఓ ఆత్మల్లారా, తండ్రినైన నన్ను స్మృతి చేయండి. అర్ధకల్పము మీరు దేహాభిమానులుగా ఉన్నారు, ఇప్పుడు దేహీ-అభిమానులుగా అవ్వండి. ఇది ఘడియ-ఘడియ మర్చిపోతూ ఉంటారు ఎందుకంటే అర్ధకల్పము యొక్క తుప్పు పట్టి ఉంది. ఈ సమయములో బ్రాహ్మణులైన మీరు పిలక వంటివారు. మీరు అందరికన్నా ఉన్నతమైనవారు. సన్యాసులు బ్రహ్మతత్వముతో యోగము జోడిస్తారు. దాని వలన వికర్మలు వినాశనమవ్వవు. ప్రతి ఒక్కరూ సతో, రజో, తమోలలోకి తప్పకుండా రావాల్సిందే. ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. ఎప్పుడైతే అందరూ తమోప్రధానముగా అయిపోతారో, అప్పుడు తండ్రి వచ్చి అందరినీ సతోప్రధానముగా తయారుచేస్తారు అనగా అందరి జ్యోతులు వెలుగుతాయి. ప్రతి ఆత్మకు తమ-తమ పాత్ర లభించి ఉంది. మీరు హీరో-హీరోయిన్ పాత్రధారులు. భారతవాసులైన మీరు అందరికన్నా ఉన్నతమైనవారు, మీరు రాజ్యాన్ని తీసుకుంటారు, మళ్ళీ పోగొట్టుకుంటారు. ఇతరులెవ్వరూ రాజ్యాన్ని ఈ విధముగా తీసుకోరు. వారు బాహుబలముతో రాజ్యాన్ని తీసుకుంటారు. బాబా అర్థం చేయించారు, ఎవరైతే విశ్వానికి యజమానులుగా ఉండేవారో, వారే మళ్ళీ అవుతారు. కావున సత్యమైన రాజయోగాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ నేర్పించలేరు. మనుష్యులు ఏదైతే నేర్పిస్తారో, అదంతా అయథార్థమైన యోగము. ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. ఇప్పుడు ఇది అంతిమము. అందరూ దుఃఖము నుండి విముక్తులవుతారు, మళ్ళీ నంబరువారుగా రావాల్సి ఉంటుంది. ముందు సుఖాన్ని చూస్తారు, ఆ తర్వాత దుఃఖాన్ని చూస్తారు. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. చేతులు పని వైపు, హృదయము భగవంతుని వైపు ఉండాలని అంటారు. పనులు చేసుకుంటూ ఉండండి కానీ బుద్ధియోగము తండ్రితో ఉండాలి. ఆత్మలైన మీరు ఒక్క ప్రియునికి ప్రేయసులు. ఇప్పుడు ఆ ప్రియుడు వచ్చి ఉన్నారు. ఆత్మలందరినీ (ప్రేయసులను) పుష్పాలుగా తయారుచేసి తీసుకువెళ్తారు. అనంతమైన ప్రేయసులకు అనంతమైన ప్రియుడు. వారు అంటారు, నేను అందరినీ తీసుకువెళ్తాను. తర్వాత నంబరువారు పురుషార్థానుసారముగా వెళ్ళి పదవిని పొందుతారు. గృహస్థ వ్యవహారములో ఉండండి, పిల్లలను సంభాళించండి. ఓ ఆత్మా, నీ హృదయము తండ్రి వైపు ఉండాలి. స్మృతి యొక్క ఈ అభ్యాసాన్నే చేస్తూ ఉండండి. తండ్రిని స్మృతి చేసినట్లయితే ఇప్పుడు మనము స్వర్గవాసులుగా అవుతామని పిల్లలకు తెలుసు. విద్యార్థులైతే చాలా సంతోషముగా ఉండాలి. ఇది చాలా సహజము. డ్రామానుసారముగా అందరికీ మార్గాన్ని తెలియజేయాలి. ఎవరితోనూ వాదించవలసిన అవసరము లేదు. ఇప్పుడు మీ బుద్ధిలోకి మొత్తం జ్ఞానమంతా వచ్చేసింది. మనుష్యులు అనారోగ్యము నుండి విముక్తులైనప్పుడు వారికి అభినందనలు తెలియజేస్తారు. ఇక్కడైతే మొత్తము ప్రపంచమంతా రోగగ్రస్థముగా ఉంది. కొద్ది సమయములో జయజయకారాలు జరుగుతాయి. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. సత్యాతి-సత్యమైన ప్రేయసులుగా అయి, చేతులతో పని చేస్తూ బుద్ధి ద్వారా ప్రియుడిని స్మృతి చేసే అభ్యాసము చేయాలి. తండ్రి స్మృతి ద్వారా మనము స్వర్గవాసులుగా అవుతున్నాము, ఈ సంతోషములో ఉండాలి. 2. సూర్యవంశీ రాజ్యములో సింహాసనాధికారులుగా అయ్యేందుకు తల్లిదండ్రులను పూర్తిగా ఫాలో చేయాలి. తండ్రి సమానముగా నాలెడ్జ్ ఫుల్ గా అయి అందరికీ మార్గాన్ని తెలియజేయాలి. వరదానము:-కిరీటాన్ని మరియు తిలకాన్ని ధారణ చేసి బాప్ దాదాకు సహాయకులుగా అయ్యే హృదయ సింహాసనాధికారి భవ ఎప్పుడైనా, ఎవరైనా సింహాసనముపై కూర్చుంటే తిలకము మరియు కిరీటము వారికి గుర్తుగా ఉంటుంది. అలా ఎవరైతే హృదయ సింహాసనాధికారులుగా ఉంటారో వారి మస్తకముపై సదా అవినాశీ ఆత్మ యొక్క స్థితి రూపీ తిలకము దూరము నుండే ప్రకాశిస్తూ కనిపిస్తుంది. సర్వాత్మల పట్ల కళ్యాణము యొక్క శుభ భావన వారి నయనాల ద్వారా మరియు ముఖము ద్వారా కనిపిస్తుంది. వారి ప్రతి సంకల్పము, మాట మరియు కర్మ బాబా సమానముగా ఉంటుంది. స్లోగన్:-సరళమైన స్మృతి కొరకు సరళతా గుణాన్ని ధారణ చేయండి, సంస్కారాలను సరళముగా చేసుకోండి.   అవ్యక్త ప్రేరణలు - ‘‘నిశ్చయమనే పునాదిని దృఢముగా చేసుకుని సదా నిర్భయులుగా మరియు నిశ్చింతగా ఉండండి’’ విజయులుగా అయ్యేందుకు పునాది - ‘‘నిశ్చయము’’, ఒకవేళ పునాది పక్కాగా ఉన్నట్లయితే బిల్డింగ్ కదలదు, నిశ్చింతగా ఉంటారు. కానీ కేవలము తండ్రి పట్ల నిశ్చయము ఉండటము కాదు, స్వయముపై కూడా నిశ్చయము మరియు డ్రామాపై కూడా నిశ్చయము ఉండాలి. వాహ్ డ్రామా వాహ్! ఒకవేళ డ్రామాపై నిశ్చయము ఉన్నట్లయితే అకళ్యాణ విషయము కూడా కళ్యాణములోకి మారిపోతుంది. "