Manasa
14.9K views
1 days ago
#😇My Status #🙆 Feel Good Status #✌️నేటి నా స్టేటస్ శ్రీ గురుభ్యోనమః🙏 🌹పంచాంగం🌹 శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు, తేది ... 4 - 4 - 2026, వారం ... స్థిర వాసరే (శని వారము), శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, బహుళ పక్షం, తిధి : విదియ ఉ 8.30 వరకు తదుపరి తదియ నక్షత్రం : స్వాతి రా 8.12 వరకు తదుపరి విశాఖ యోగం: హర్షణం మ 1.12 వరకు తదుపరి వజ్రం కరణం : గరజి ఉ 8.30 వరకు వణిజ రా 9.18 వరకు వర్జ్యం : రా 2.20 - 4.05 వరకు దుర్ముహూర్తం : ఉ 5.57 - 7.34 వరకు అమృతకాలం : ఉ 10.42 - 12.25 వరకు రాహుకాలం : ఉ 9.00 - 10.30 వరకు యమగండం : మ 1.30 - 3.00 వరకు సూర్యరాశి : మీనం చంద్రరాశి : తుల సూర్యోదయం : 5.57 సూర్యాస్తమయం:6.10 *నేటి మాట* ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మాణేినమః గురుచరిత్ర - 63 నామధారకా! ఒక నిదర్శనము చెప్పెదను అని అంటిని కదా! వినుము. పూర్వము సంభవించిన ఒక దృష్టాంతము చెప్పెదను. వల్లభేశుడు అను బ్రాహ్మణుడు కాశ్యప గోత్రుడు ఒకడు కలడు. అతడు ఆచారవంతుడు. సుశీలుడు. వ్యాపారమును వృత్తిగా అవలంబించిన ఆ విప్రుడు ప్రతీ సంవత్సరమును శ్రీపాదుల వారి దర్శనమునకు పోవుచుండేవాడు. ఇట్లు ఉండగా, ఒకప్పుడు ఆ ద్విజుడు వాణిజ్యమునకు పోవుటకు సంకల్పించి, కార్యసిద్ధి అయినచో వేయిమంది బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెనని మనస్సు నందు సంకల్పము చేసుకొన్నాడు. ఈ విధముగా నిశ్చయించుకొని వ్యాపారము చేయుటకు పోయినాడు. శ్రీపాద శ్రీవల్లభుల చరణములను సదా ధ్యానించేవాడు. అతడు వెళ్ళిన ప్రతీ ప్రదేశమునందు విశేషమైన లాభములు ఆర్జించినాడు. తన సంకల్పమునకు వెయ్యిరేట్లు లాభము రాగా మిక్కిలి సంతోషించి, శ్రీపాదుల వారి పాదములందు చిత్తమును నిల్పి స్వగృహమును వల్లభేశుడు చేరినాడు. తరువాత, తాను సంకల్పించిన బ్రాహ్మణ భోజనములకు ఏర్పాట్లు చేయుటకొరకై ద్రవ్యముతో వెళ్ళుచున్న వల్లభేశుని గమనించిన కొందరు దొంగలు, ద్రవ్యలోలులై కపటముతో వల్లభేశునికి మిత్రులుగా నటించుచూ, వానిని అనుసరించిరి. రెండు మూడు రోజులు ఈ విధముగా వెంబడించి, వానికి నమ్మకము కలుగజేసి, దొంగలు విజనమైన కాంతారా మార్గమును చేరి, బ్రాహ్మణునితో, మేము ప్రతీ సంవత్సరం కురువపురము చేరి, శ్రీపాద దర్శనము చేయుచుందుము అనిరి. వల్లభేశుడు వారి మాటలు సత్యములని తలంచినాడు. ఈ విధముగా నమ్మకము వచ్చునట్లు చేసి, విజన ప్రదేశము చేరిన పిదప, ఆ బ్రాహ్మణుని శిరస్సు ఛేదించి, ద్రవ్యమును అపహరింప సమకట్టినారు. చనిపోవుచున్న వల్లభేశుడు, భక్తవత్సలుడు, జటాధారి, భక్తలిప్తుడు అయిన శ్రీపాదుల వారిని స్మరించినాడు. వెంటనే స్వామి త్రిశూలమును, ఖడ్గమును చేతబట్టి కురువపురము నుండి వచ్చి దొంగల ఎదుట నిలిచినాడు. సర్వం శ్రీపాద శ్రీవల్లభ చరణారవిందమస్తు 🙏