నా💝అమ్మే👩‍👦నా కనిపించే 🙏దైవం💝
4.3K views
3 hours ago
లారీ డ్రైవర్ కోసం ప్రియుడిని చంపిన టీవీ నటి.. 12 రోజులుగా ఇంట్లోనే మృతదేహం.. కట్‌చేస్తే.. కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం ఘటన వెలుగు చూసింది. ఓ టీవీ నటి తన లివింగ్‌ పాట్నర్‌ను అతి కిరాతకంగా మత్య చేసింది. పార్టీ చేసుకుందామని చెప్పి ప్రియుడిని ఏకాంతంగా తీసుకెళ్లి ఏకంగా తిరిగిరాని లోకాలకే పంపేసింది. బెంగళూరులోని మంజునాథనగర్‌లో గత రెండు వారాల క్రితం జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మరో వ్యక్తితో పెళ్లి కోసం సిద్ధమైన ఓ టీవీ నటి తను లివింగ్‌లో ఉంటున్న ప్రియుడిని అతి దారుణంగా హత్య చేసిన ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో వెలుగు చూసింది. సుమారు రెండు వారాల తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై కేసు నమెదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఊర్మిలా అలియాస్ బిందుగా పిలువబడే టీవీ నటి గత కొన్ని రోజులుగా మోహన్ కృష్ణ అనే వ్యక్తితో లివ్‌-ఇన్‌ రిలేషన్‌లో ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఆమెకు లారీ డ్రైవర్ అయిన వినయ్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడగా.. అతన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే ఈ విషయం మోహన్‌కు తెలియడంతో అతను బిందు ప్రశ్నించాడు. దీంతో మోహన్ తమకు అడ్డుగా ఉన్నాడని భావించిన బిందు అతన్ని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ప్లాన్‌ ప్రకారం వియన్‌ తో కలిసి అతన్ని హత్య చేసేందుకు అన్ని సిద్ధం చేసుకుంది. అనుకన్న ప్రకారం మోహన్‌తో కలిసి తాను ఉంటున్న ఇంట్లోనే పార్టీ ఏర్పాటు చేసింది. అతని ఫుల్‌గా మద్యం సేవించి పడిపోయిన తర్వాత. వినయ్, అతని స్నేహితుడు దనుష్‌తో కలిసి మోహన్‌పై దాడికి పాల్పడింది. ముగ్గురు కలిసి కత్తులతో అతి కిరాతంగా దాడి చేసి మోహన్‌ను అతమర్చారు. తర్వాత అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. అయితే హత్య జరిగిన రెండు వారాల త్వరాత ఇంటి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మోహన్ మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. #😱నటి అరెస్టు..తాళం వేసిన ఇంట్లో మృతదేహం లభ్యం

More like this