రోడ్డు భద్రతే జీవ భద్రత – మద్యం డ్రైవింగ్పై ట్రాఫిక్ పోలీసుల కఠిన హెచ్చరిక & అవగాహన
మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (TTI) లో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వ్యక్తులను, మైనర్ డ్రైవింగ్ చేసిన వారి తల్లిదండ్రులకు పోలీస్ స్టేషన్కు పిలిపించి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ) ద్వారా రోడ్డు ప్రమాదాలపై వీడియోలు ప్రదర్శిస్తూ ప్రమాదాల తీవ్రతను వివరించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ —
* మద్యం సేవించి వాహనం నడపడం ప్రాణాంతక ప్రమాదాలకు ప్రధాన కారణమని తెలిపారు.
* మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల డ్రైవర్ నిర్ణయ సామర్థ్యం తగ్గి ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పారు.
* హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం చిన్న విషయం కాదు – అది ప్రాణరక్షణ కవచమని వివరించారు.
* అధిక వేగం ప్రాణాలకు ముప్పు అని, వేగం నియంత్రణ అత్యవసరమని సూచించారు.
* మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయడం ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.
* ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు గుర్తులు, ట్రాఫిక్ నియమాలు ప్రజల భద్రత కోసం రూపొందించబడినవని తెలిపారు.
* ప్రమాదం జరిగిన తరువాత కుటుంబ సభ్యులు పడే మానసిక, ఆర్థిక కష్టాలను గుర్తు చేశారు.
* కుటుంబం మనపై ఆధారపడి ఉందనే బాధ్యతతో జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు.
* చిన్న నిర్లక్ష్యం జీవితాంతం పశ్చాత్తాపానికి కారణమవుతుందని హెచ్చరించారు.
* యువత ట్రాఫిక్ నియమాలను పాటించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కోరారు.
* మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు.
* రోడ్డు భద్రత ప్రతి పౌరుడి బాధ్యత అని, పోలీసులే కాక ప్రజల సహకారం కూడా అవసరమని పేర్కొన్నారు.
* “సురక్షిత ప్రయాణం – కుటుంబ సంతోషం” అనే సందేశాన్ని అందరికీ చేరవేయాలని సూచించారు.
చివరగా, అందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని కోరడం జరిగింది.
#📰 వార్తలు