*గుడ్ న్యూస్.. ఇక 'ఆధార్' అవసరం లేదు..!*
ఇకనుంచి ఆధార్ కార్డు మీ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అవును మీరు విన్నది నిజమే.. ఆధార్ వినియోగంలో మరో కీలక ముందడుగు వేస్తూ కేంద్ర ప్రభుత్వం ‘న్యూ ఆధార్’ అనే యాప్ను ప్రారంభించింది. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ యాప్ను లాంచ్ చేశారు. ఫేస్ ఆథెంటికేషన్, క్యూఆర్ కోడ్ స్కాన్ వంటి సౌకర్యాలతో ఇకపై జిరాక్స్ కాపీలు, ఫిజికల్ కార్డు అవసరం ఉండదు. ఇందులోనే ఆధార్ ఫోన్ నెంబర్, అడ్రస్ వివరాలు చేంజ్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లోనే ఆధార్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఒకే యాప్లో ఐదుగురు కుటుంబ సభ్యుల ఆధార్ ప్రొఫైల్స్ నిర్వహించుకునే వెసులుబాటు కల్పించారు #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్