TNTUC
534 views
8 hours ago
అన్నదాతలకు ఉగాది ముందే వచ్చింది... సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేసిన కూటమి ప్రభుత్వం, ఈ రోజు  'అన్నదాత-సుఖీభవ' మూడవ విడత నిధులు రైతుల ఖాతాలో జమ చేయనుంది. కేంద్ర సహకారంతో అమలు అవుతున్న ఈ పధకం మూడో విడత నిధులని, ఈ రోజు సాయంత్రం సూరంపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు విడుదల చేస్తారు. మూడవ విడతగా 46.85 లక్షల మందికి కేంద్ర, రాష్ట్ర వాటా కలిపి ఒక్కో రైతు అకౌంట్‌లో రూ.6,000 జమ చేయనుంది.  మూడో విడతగా రూ.2,676 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి. ఇందులో రాష్ట్ర వాటా రూ.1,874 కోట్లు.  ఇప్పటికే రెండు విడతల కలిపి రూ.14 వేలను ప్రభుత్వం అందించింది. 2025 ఆగస్ట్ 2న మొదటి విడతగా రూ.7 వేల చొప్పున రూ.3,174 కోట్లు, నవంబర్ 19న రెండవ విడతగా రూ.7 వేల చొప్పున రూ.3,135 కోట్లు కలిపి రూ.6,309 కోట్లు రైతులకు అందించింది. ఒక్క ఏడాదిలోనే రైతు సోదరులకు కూటమి ప్రభుత్వం రూ.8,985 కోట్లు అందించినట్లు అవుతుంది. ఇందులో రాష్ట్ర వాటా రూ.6,560 కోట్లు కాగా, కేంద్రం వాటా రూ.2,425 కోట్లు.  #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #🏛️పొలిటికల్ అప్‌డేట్స్