మహబూబ్నగర్ జిల్లా పోలీసు – “ప్రజా భద్రత పోలీసు బాధ్యత”
జిల్లా ఎస్.పి. శ్రీమతి డి. జానకి IPS గారి ఆదేశాల మేరకు,
19.02.2026 తేదీన జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని
కస్తూర్బా గాంధీ విద్యాలయంలో
సురక్ష పోలీసు కళాబృందం, AHTU టీం, మరియు శ్రీరామ చారిటబుల్ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో
విద్యార్థుల భద్రతపై సామాజిక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి పెట్టి క్రమశిక్షణతో జీవిస్తే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని తెలిపారు. టీనేజ్ వయసులో అనవసరపు ఆకర్షణలకు, మొహా వ్యామోహాలకు లోనై విలువైన జీవితాన్ని, బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.
చదువుకోవాల్సిన వయసులో చదువుపైనే దృష్టి పెట్టాలని, బాల్య వివాహాల వల్ల బాలికల జీవితం దుర్భరంగా మారుతుందని, అలాంటి ఘటనలు ఎక్కడైనా గమనిస్తే వెంటనే 1098 చైల్డ్ హెల్ప్లైన్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
అలాగే గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, పోక్సో చట్టం – 2012, సైబర్ భద్రత గురించి వివరించి, సోషల్ మీడియా ద్వారా అపరిచితుల ఫ్రెండ్ రిక్వెస్టులు, వీడియో కాల్స్, ఫోటోలు షేర్ చేయడంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఆన్లైన్ వేధింపులు, బెదిరింపులు ఎదురైతే వెంటనే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు లేదా పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
బాలికలు ఆత్మవిశ్వాసంతో మాట్లాడడం, అవసరమైతే “నో” అని స్పష్టంగా చెప్పడం, ఒంటరిగా ఉన్నప్పుడు అనుమానాస్పద పరిస్థితుల్లో సహాయం కోరడం చాలా ముఖ్యమని తెలిపారు. మహిళలు, బాలికలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ Dial 100 లేదా షీ టీం నంబర్ 8712659365, AHTU నంబర్ 8712680066 ను నిర్భయంగా సంప్రదించాలని అన్నారు.
కార్యక్రమంలో
SO శ్రీమతి తబస్సుం,
శ్రీమతి సుజాత ఎస్ఐ,
శ్రీరామ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి బండి వేణు
ఉపాధ్యాయులు, విద్యార్థినులు, AHTU టీం, సురక్ష పోలీసు కళాబృందం సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
#MahabubnagarPolice
#📰 వార్తలు