ఢిల్లీకి చెందిన ప్రగతి చాస్వాల్, విద్యార్థులకు ప్రకృతిని దగ్గర చేయాలనే లక్ష్యంతో 'SowGood' ఫౌండేషన్ను ప్రారంభించారు. తన కుమారుడికి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు నేర్పించే క్రమంలో మొదలైన ఈ ప్రయత్నం, ఈరోజు 5 రాష్ట్రాల్లోని 28 పాఠశాలల్లో ఒక గొప్ప ఉద్యమంగా మారింది.
గాంధీజీ 'నయీ తాలీమ్' స్ఫూర్తితో ఆమె రూపొందించిన మూడంచెల ఫిలాసఫీ విచార్ (ఆలోచన), ఆచార్ (ఆచరణ), ప్రచార్ (ప్రచారం) ద్వారా విద్యార్థులు కేవలం పుస్తకాలతోనే కాకుండా, నేరుగా ప్రకృతితో పని చేస్తూ ఆహారాన్ని పండించడం నేర్చుకుంటున్నారు.
ఇలా ఇప్పటివరకు సుమారు 78,000 మంది చిన్నారులు పాల్గొన్న ఈ ప్రోగ్రామ్, రోజూవారీ వ్యర్థాల నుండి కంపోస్ట్ తయారు చేయడం, రసాయనాలు లేని కూరగాయలు పెంచడం వంటి పర్యావరణహిత అలవాట్లను వారి జీవనశైలిలో భాగం చేస్తోంది. పాఠశాలల రూఫ్-టాప్లను, ఖాళీ ప్రదేశాలను పచ్చని ప్రదేశాలుగా మారుస్తూ, భావి తరాల్లో ప్రకృతి పట్ల బాధ్యతను పెంచుతున్న ఈమె కృషి నిజంగా అభినందనీయం.
#TALRadioTelugu #GoodNews #PragatiChaswal #SowGood #UrbanFarming #NatureEducation #Sustainability #SchoolGardening #GreenIndia #TALRadio #TouchALifeFoundation
#💪పాజిటీవ్ స్టోరీస్ #🙆 Feel Good Status #😇My Status