నామినేషన్ పత్రాల పరిశీలన సందర్భంగా మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ డి.జానకి ఐపిఎస్
మున్సిపల్ ఎన్నికల పనుల్లో భాగంగా ఈరోజు నామినేషన్ పత్రాల పరిశీలన జరుగుతున్న సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపిఎస్ గారు మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ నామినేషన్ పత్రాల పరిశీలన ప్రక్రియలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సక్రమ ఏర్పాట్లు చేయాలని, అలాగే ఎన్నికల ప్రవర్తన నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామంజుల రెడ్డి, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్యతో పాటు ఇతర అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
#MahabubnagarPolice #MunicipalElections
#📰 వార్తలు