P.Venkateswara Rao
585 views
1 days ago
#రెండు కళ్ళ సిద్ధాంతం.. 🤠 *చంద్రబాబు ముగ్గురు బిడ్డల పథకంపై మాజీ ఫ్రెండ్ పంచ్ లు..❗* Syed Ahmed March 6, 2026👀 ఏపీలో జనాభా పెంచేందుకు వీలుగా ప్రజలంతా ముగ్గురు పిల్లల్ని కనాలంటూ సీఎం చంద్రబాబు (Chandrababu)తెస్తున్న విధానంపై మాజీ కేంద్రమంత్రి, ఆయన మాజీ స్నేహితుడు కూడా అయిన చింతా మోహన్ (chinta mohan) మండిపడ్డారు. ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లల్ని కంటే ఉద్యోగులకు అదనపు సెలవులు ఇస్తామని, అలాగే 25 వేల ప్రోత్సాహకం ఇస్తామని చంద్రబాబు నిన్న చేసిన ప్రకటనపై చింతా మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా ఆయన సమస్య ఏంటో చెప్పాలన్నారు. నిన్న అసెంబ్లీలో సీఎం చంద్రబాబు రాష్ట్రంలో జనాభా నిర్వహణ పై డ్రాఫ్ట్ పాలసీపై ప్రకటన చేశారు. ఏపీలో ప్రస్తుతం టోటల్ ఫెర్టిలిటీ రేటు (టీఎఫ్ఆర్) 1.5గా ఉందని, దీనిని 2.1కి పెంచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇందుకోసం మూడో బిడ్డను కనే దంపతులకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. దీనిపై స్పందించిన చింతా మోహన్.. ఆయన మాత్రం ఒక బిడ్డనే కంటాడు, ఇతరుల్ని మాత్రం ముగ్గురు బిడ్డల్ని కనమని ఎలా చెప్తాడని ప్రశ్నించారు. ఇద్దరు, ఆపైన పిల్లలను కంటే రూ.25 వేలు, ఇంకా బోలెడు బెనిఫిట్స్: సీఎం చంద్రబాబు! ఇద్దరు, ఆపైన పిల్లలను కంటే రూ.25 వేలు, ఇంకా బోలెడు బెనిఫిట్స్: సీఎం చంద్రబాబు! అలాగే ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్ సైతం ఒక బిడ్డనే కంటాడని, అయినా చంద్రబాబు ఇతరులు ముగ్గురు బిడ్డలు కనాలని చెప్పడం విడ్డూరంగా ఉందని చింతా మోహన్ తెలిపారు. చంద్రబాబు తాను చేయని పనులు ఇతరులకు చెప్తుంటాడని చింతా మోహన్ ఎద్దేవా చేశారు. ఒక్క బిడ్డనే పుట్టించిన చంద్రబాబు తెలివితేటలు తమకు కూడా ఉన్నాయన్నారు. ఇతరులకు ఏదైనా చెప్పేముందు ఆలోచించి చెప్పాలని తన మాజీ స్నేహితుడికి చింతా మోహన్ సలహా ఇచ్చారు. చంద్రబాబు ఏం చెప్తాడో, ఏం చేస్తాడో ఎవరికీ అర్ధం కాదన్నారు.