1️⃣3️⃣9️⃣
*_సంపూర్ణ మహాభారతము_*
*_139 వ రోజు_*
*_వన పర్వము షష్టమాశ్వాసము:_*
*_మార్కండేయుని రాక_*
*ఒకరోజు* *మార్కండేయుడు ధర్మరాజు వద్దకు వచ్చాడు. ధర్మరాజు అతిథి మర్యాదలు చేసాడు*. *ధర్మరాజు “మహర్షీ! మేము, ద్రౌపది అడవిలో ఇన్ని కష్టాలు పడుతున్నాము. మా వలె కష్టాలు పడుతున్న వారెవరైనా ఉన్నారా?”*
*అందుకు మార్కండేయుడు “ధర్మజా! పూర్వము ఇక్ష్వాకు వంశంలో అజుడు అనే రాజు ఉండే వాడు. అతని కుమారుడు దశరధుడు. అతనికి ముగ్గురు భార్యలు. వారిలో కౌసల్య అనే భార్యకు రాముడు, కైకేయి అను భార్యకు భరతుడు, సుమిత్ర అను భార్యకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అనే కుమారులు కలిగారు. బ్రహ్మకు మానస పుత్రుడైన పులస్త్యునకు వైశ్రవణుడు అనే కుమారుడు జన్మించాడు.*
*_సంక్షిప్త రామాయణం_*
*ధశరథుని కుమారుల జననము, వారి నామకరణముల గురించి ప్రకటించగా దశరథుని సభలో వేడుకలు జరుగుతున్న దృశ్యం:*
*ఇక్ష్వాకు వంశంలో అజుడు అనే రాజు ఉండే వాడు. అతని కుమారుడు దశరధుడు. అతనికి ముగ్గురు భార్యలు. వారిలో కౌసల్య అనే భార్యకు రాముడు, కైకేయి అను భార్యకు భరతుడు, సుమిత్ర అను భార్యకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అనే కుమారులు కలిగారు. బ్రహ్మకు మానస పుత్రుడైన పులస్త్యునకు వైశ్రవణుడు అనే కుమారుడు జన్మించాడు. వైశ్రవణుడు తన తండ్రి మాట వినకుండా బ్రహ్మను గురించి తపస్సు చేసాడు.* *ప్రత్యక్షమైన బ్రహ్మ వద్ద నలకుబేరుడు అనే కుమారుని శివునితో సాన్నిహిత్యాన్ని ధనాధిపత్యాన్ని కోరుకున్నాడు*.
```
*_రావణ కుంభకర్ణాదుల పుట్టుక_*`
*పులస్త్యుడు తన శరీరం నుండి విశ్రవసువును సృష్టించి వైశ్రవణునికి హాని చెయ్యమని పంపాడు. ఇది తెలిసిన వైశ్రవణుడు విశ్వవసువు వద్దకు వెళ్ళి “అయ్యా! నేను నీ పుత్ర సమానుడను దయ చూపుము” అని చెప్పి విశ్వవసువుకు నృత్యగాన విశారదులైన పుష్పోత్కట, మాలిని, బక అనే రాక్షస వనితలను సృష్టించి ఇచ్చాడు. వారు విశ్వవసువుకు సేవలు చేస్తున్నారు*. *విశ్రవసువు వారికి సంతానాన్ని ప్రసాదించాడు. పుష్పోత్కటకు-రావణుడు, కుంభకర్ణుడు, మాలినికి-విభీషణుడు బకకు-ఖరుడు,శూర్పణఖ అనే కవలలు జన్మించారు*. *వారిలో రావణుడు పది తలలు కల వాడు, కోపిష్టి. కుంభకర్ణుడు కఠిన హృదయుడు,గర్విష్టి. విభీషణుడు మంచి గుణములు కలవాడు. ఖరుడు దుర్మార్గుడు*. *బ్రాహ్మణులను అవమానించే వాడు. రక్త, మాంసాలను ఆహారంగా తీసుకునే వాడు. శూర్పణఖ కూడా అధర్మపరురాలు, పాపాత్మురాలు*.
*ఆ రాక్షస వీరులు తండ్రి విశ్వవసువు దగ్గర వేద వేదాంగాలు విలువిద్య అభ్యసించారు* #మన సంప్రదాయాలు సమాచారం