Ravi Talluri
505 views
2️⃣. *_శ్రీ మహావిష్ణు పురాణం_* *_2 వ భాగం_* *_వ్యాస మహర్షి వృత్తాంతం:_* *సూత మహర్షి వ్యాస మహర్షి జనన చరిత్ర చెబుతూ “మానవుల ఇహపర జీవనానికి కావలసిన సమస్త ధర్మాలు, కర్మలు, జ్ఞానము వేదాలలో ఉంది. అందుకే వేదాలను శ్రుతి, జ్ఞానం, బ్రహ్మం అని కూడా అంటారు*. *కృతయుగం నుంచి కలియుగం వచ్చేసరికి మానవుల మేధాశక్తి, ఆయుష్యు తగ్గుతూ వస్తుంది. అందుకే ప్రతి ద్వాపరంలోను మానవులకు సులభతరంగా అర్ధమవ్వడానికి వేదాలను విభజించి రచించటం జరుగుతుంది*. *ప్రస్తుత మహాయుగంలోని ద్వాపరంలో వ్యాస భగవానుడు వేదాలతో పాటు వేదసారాంశం సులభంగా అర్ధమవ్వడానికి పద్దెనిమిది పురాణాలు, పద్దెనిమిది ఉపపురాణాలు రచించారు. పంచమ వేదం అన్న మహాభారత ఇతిహాసాన్ని రచించారు.* *ఉపనిషత్తులకు మూలమైన బ్రహ్మ సూత్రాలు రచించాడు.* *శ్రీమన్నారాయణుని జ్ఞాన రూప అవతారమైన వ్యాస మహర్షిని భక్తితో తలచుకునే పుణ్యదినం ఆషాడ శుద్ద పౌర్ణమి. ఈ రోజుని గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ, వ్యాస జయంతి అని కూడా పిలుస్తారు. బ్రహ్మాండ పురాణంలో వ్యాస పూర్ణిమ గొప్పదనాన్ని తెలియచేసే కథ ఉంది.* *పూర్వము వారణాసిలో వేదనిధి, వేదవతి అనే దంపతులు నివసిస్తున్నారు. వారికి చాలా కాలం సంతానం కలుగ లేదు. వారికి తెలిసిన వారు “వ్యాస మహర్షి ప్రతిరోజు మధ్యాహ్నం మారు వేషములో వ్యాస మహర్షి గంగానదిలో స్నానం చేయడానికి వచ్చి వెళతారు. ఆయన అనుగ్రహం మీరు పొందగలిగితే సంతానం తప్పక లభిస్తుంది” అని చెప్పడంతో వారు గంగానది తీరానికి మిట్ట మధ్యాహ్నం వచ్చి వ్యాసమహర్షి రాక కోసం ఎదురు చూడసాగారు.* *కమండలం, దండం ధరించిన బిక్షువు ఒకరు స్నానానికి నది వద్దకు వచ్చాడు. దంపతులిరువురు ఆయనే వ్యాసుడని భావించి పాదాల పై పడి శరణు వేడారు. మొదట అదిలించినా, పట్టువదలని వారి దీక్షకు సంతసించి ప్రసన్నుడై వ్యాసుడు వరం ఇచ్చాడు. వేదనిధి మరుసటి రోజు తన తండ్రి శ్రాద్ధకర్మకు భోక్తగా రావాలని కోరాడు. వ్యాసుడు అంగీకరించాడు.* *మరుసటి రోజు వేదవతి తమకు ఉన్నంతలో అన్ని వంటకాలు శుచిగా రుచిగా చేసింది. బిక్షుక రూపంలో వ్యాసుడు భోక్తగా వచ్చాడు. తృప్తిగా శ్రాద్ధ భోజనం తిని సంతుష్టుడై వారిని చూసి “మీకు పదిమంది కుమారులు జన్మిస్తారు సుఖ భోగాలు అనుభవించిన తరువాత వైకుంఠ ప్రాప్తి మీక కలుగుతుంది.* *ఆషాడ శుద్ద పౌర్ణమి నాడు ప్రజలు ప్రతి పౌరాణికులలో నన్ను దర్శించి అతిథి సత్కరాలు చేసి పూజించాలి*. *అలా చేసినవారికి నా అనుగ్రహం తప్పక లభిస్తుంది” అని ఆశీర్వదించి వెళ్లి పోయాడు.* ``` *_వ్యాసాయ విష్ణు రూపాయ_* *_వ్యాసరూపాయ విష్ణవే_* *_నమోవై_* *_బ్రహ్మనిధయా వాసిష్ఠాయ నమో నమః_* *వ్యాస రూపంలో ఉన్న విష్ణువుకి, విష్ణరూపంలో ఉన్న వ్యాసునికి, వసిష్ట మహర్షి ముని మనవడైన వ్యాస భగవానుడికి నమస్కరిస్తున్నాను. ధర్మ సంస్థాపన చేసే భగవంతుడు, దర్మాధర్మ విచక్షణ బోధించే గురువు ధర్మం అనే నాణానికి రెండు ముఖాలవంటి వారు. వ్యాస మహర్షి మహాభారతం రచించడమే కాకుండా ఆ మహాభారత కథలో ముఖ్య పాత్ర వహించారు*. *పంచమ వేదమైన మహాభారతం రచన తరువాత వ్యాస మహర్షి మనస్సులో నారాయణుని గురించి పూర్తిగా వివరించ లేదన్న అసంతృప్తి మిగిలిపోయింది. నారద మహర్షి గ్రహించి వ్యాసుని వద్దకు వచ్చి “పురాణాలు, ఉప పురాణాలు, మహాభారతం రచించిన నీవు నారాయణుని లీలలను కీర్తించే పురాణం రుచించలేదు. మీ తండ్రి పరాశర మహర్షి మహావిష్ణు పురాణం చెప్పాడని నారాయణుని లీలలను వర్ణించి వ్రాయడం నీవు వదలి వేశావు. అందుకే నీ మనస్సు అసంతృప్తిగా ఉంది. భగవంతుడైన విష్ణు లీలలు, అవతారాలను వర్ణిస్తూ భాగవత పురాణం రచించు! నీ మనస్సులో ఉన్న దుఖం తొలుగుతుంది” అని బోధించాడు. వ్యాసుడు భాగవత రచన చేసి దుఖ విముక్తుడైనాడు*. *తను రచించిన భాగవతం లోకానికి అందించడానికి ఒక కుమారుడు ఉంటే బాగుండేది అని వ్యాసునికి తన ఆశ్రమంలో చెట్టుపై కాపురం చేస్తున్న చిలుకల సంసారం చూసి అనిపించింది*. *ఆ విషయం నారదునికి చెప్పగా, నారదుడు పార్వతీ పరమేశ్వరులను ఆరాధించి పుత్ర సంతానం పొందమని చెప్పి వెళ్లిపోయాడు. తపస్సు చేసిన వ్యాసునికి పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమై "పంచ భూతాలతో సమానమైన కుమారుడు నీకు జన్మిస్తాడని" వరమిచ్చి అదృశ్యమయ్యారు.* *కొంతకాలానికి వ్యాసుడు అగ్ని కోసం అరణి మధిస్తుండగా ఘృతాచి అనే అప్సరస కనిపించింది*. *వ్యాసుడు ఆమెను మోహించి చూడసాగాడు. మహర్షి తేజోమయ తీక్షణ చూపులకు భయపడి ఘృతాచి చిలుకగా మారి ఎదురుగా ఎగర సాగింది. వ్యాసుని తేజస్సు మధిస్తున్న అరణిలో పడి చిలుక ముఖం కలిగిన శుకుడు అవతరించాడు.* *శుకునికి భాగవతంతో పాటు వేద శాస్త్రములు బోధించాడు. పరీక్షతు మహారాజు శాపానికి గురై మరణం పొందే ముందు భాగవత పురాణం వినాలనుకుని వ్యాసుని అర్ధిస్తాడు. వ్యాసుడు తన కుమారుడు శుకునికి ఆ బాధ్యత అప్పగించాడు*. *తరువాత తన తండ్రి పరాశర మహర్షి మైత్రేయ మహర్షికి చెప్పిన శ్రీ మహావిష్ణువు లీలలను మహావిష్ణు పురాణంగా రచించి లోకానికి అందించాడు. కనుక మీకు వ్యాసుని తండ్రి పరాశర మహర్షి కథను కూడా మహావిష్ణు పురాణానికి ముందు వినిపిస్తాను* #మన సంప్రదాయాలు సమాచారం