తమిళనాడులోని పెరంబలూరు జిల్లాకు చెందిన వాలికందపురం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ఏళ్ల తరబడి వృథాగా, పిచ్చిమొక్కలతో నిండి ఉన్న 5 ఎకరాల బంజరు భూమిని పచ్చని తోటగా మార్చేశారు. ఇక్కడి సైన్స్ టీచర్ అనంతరాజ మరియు హెడ్ మాస్టర్ సెల్వరాజ్ పాఠశాలలోని 62 మంది విద్యార్థులతో 'నేషనల్ గ్రీన్ కార్ప్స్' (NGC) అనే పేరుతో ఒక గ్రూప్ ఏర్పాటు చేసి, విద్యార్థులు చేతులు కడుక్కునే వృథా నీటిని (Sullage water) పొలాలకు మళ్లించి సేంద్రియ సాగు ప్రారంభించారు.
ప్రస్తుతం అక్కడ టమాటాలు, వంకాయలు వంటి కూరగాయలతో పాటు అరటి, పప్పాయ వంటి పండ్ల తోటలు కూడా పెంచుతున్నారు. విద్యార్థులకు కేవలం పుస్తకాల్లోనే కాకుండా గ్రౌండ్ లెవెల్ లో ప్రకృతిపై అవగాహన కల్పిస్తున్న ఈ వినూత్న ప్రయత్నాన్ని గుర్తించిన ప్రభుత్వం, ఈ పాఠశాలను 'గ్రీన్ స్కూల్ స్కీమ్' కింద ఎంపిక చేసి రూ. 20 లక్షల నిధులను మంజూరు చేసింది.
#TALRadioTelugu #GreenSchool #StudentPower #TeachersInspire #EcoEducation #OrganicFarming #WaterReuse #SustainableLiving #EnvironmentProtection #GreenInitiative #SchoolTransformation #PositiveNews #InspiringStory #IndiaStories #TalRadio #TalRadioPositive #GoodNews #TALRadio #TouchALifeFoundation
#🙆 Feel Good Status #😇My Status #💪పాజిటీవ్ స్టోరీస్